ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి
జగిత్యాలరూరల్: ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ రాంబాబు ఆదేశించారు. శుక్రవారం జగిత్యాల రూరల్ మండలం జాబితాపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన ధాన్యాన్ని వెనువెంటనే తూకం వేసి మిల్లులకు తరలించాలన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.కార్యక్రమంలో సహకార సంఘం సీఈవో గాజంగి వేణు, సెంటర్ ఇన్చార్జి ప్రేమ్నాథ్ పాల్గొన్నారు.అంజన్న ఆదాయం రూ.88 లక్షలుకొండగట్టు(చొప్పదండి): కొండగట్టు అంజన్న ఆలయ హుండీలను శుక్రవారం ఈవో చంద్రశేఖర్ సమక్షంలో లెక్కించారు. ఈసందర్భంగా 36 రోజులకుగాను రూ.88,03,608 నగదు, 41 గ్రాముల మిశ్రమ బంగారం, 2.15 కిలోల వెండి, 27 విదేశీ కరెన్సీ నోట్లు సమకూరాయి. దేవాదాయ శాఖ వరంగల్ కార్యాలయ పరిశీలకులు ఎన్.కవిత, ఏఈవో అంజయ్య, సూపరింటెండెంట్లు సునీల్, శ్రీనివాసశర్మ తదితరులు పాల్గొన్నారు.
పోలింగ్ సిబ్బందికి వసతులు కల్పించండికోరుట్ల: వేసవి దృష్ట్యా పోలింగ్ సిబ్బందికి మెరుగైన వసతులు కల్పించాలని తపస్ నాయకులు శుక్రవారం ఆర్డీవో, కోరుట్ల నియోజకవర్గ సహాయ ఎన్నికల అధికారి ఆనంద్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఎండ తీవ్రత ఎక్కువ ఉన్నందున వేడిని తట్టుకునేందుకు పోలింగ్ కేంద్రాల్లో కూలర్లు ఏర్పాటు చేయాలని, సరైన రవాణా సౌకర్యం కల్పించి, నిబంధనలకు అనుగునంగా రెమ్యునరేషన్ చెల్లించాలని కోరారు. ఎన్నికల హాజరు ధ్రువీకరణ పత్రాలు వెంటనే అందించాలని, పోలింగ్ సమయం పెంచినందున ఒక రోజు అదనపు జీతభత్యం చెల్లించాలన్నారు. కార్యక్రమంలో తపస్ జిల్లా అధ్యక్షుడు బోనగిరి దేవయ్య, ఉపాధ్యక్షుడు చెరకు మహేశ్వరశర్మ, మండల నాయకులు కె.శ్రీనివాస్, అన్నల్దాస్, మురళి, మల్లికార్జున్, రాజేశ్వర్రావు, రమేశ్, రజనీకాంత్, సురేందర్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.
ఇంటి వద్దే ఓటేశారుకథలాపూర్/ఇబ్రహీంపట్నం: కథలాపూర్ మండలంలోని పలు గ్రామాల్లో వృద్ధులు, దివ్యాంగులు ఇంటి నుంచి ఓటు వేసేందుకు దరఖాస్తు చేసుకోగా, శుక్రవారం అధికారులు వారి ఇళ్ల వద్దకు వెళ్లారు. ఓటరు ఇళ్ల వద్ద ఓటు వేసేలా ఏర్పాట్లు చేసి పోస్టల్ బ్యాలెట్లను సేకరించారు. మండలంలో 30 మంది దరఖాస్తు చేసుకోగా రెండు రోజుల్లో ఓటు వేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్ఐ నాగేశ్, పోలింగ్ అధికారులు, రాజకీయ పార్టీల ఏజెంట్లు పాల్గొన్నారు. అలాగే ఇబ్రహీంపట్నం మండలంలోని పలు గ్రామాల్లో 48 మంది నడవలేని స్థితిలో ఉన్న వికలాంగులు, 14 మంది 85 ఏళ్లు పైబడి నడవలేని స్థితిలో ఉన్నవారికి 3 బృందాలుగా వెళ్లి ఓటు హక్కు కల్పించినట్లు తహసీల్దార్ తెలిపారు. కార్యక్రమంలో ఆర్ఐ గంగాధర్, జూనియర్ అసిస్టెంట్ లావణ్య, బీఎల్వోలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.