Top Stories
ప్రధాన వార్తలు
ఒడిశా కొత్త సీఎంగా గిరిజన నేత మోహన్ మాఝీ
సాక్షి, భువనేశ్వర్: ఒడిశా నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై ఉత్కంఠకు తెర దించుతూ బీజేపీ అధిష్ఠానం.. మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ప్రకటించింది. బీజేపీ శాసనసభా పక్షం మోహన్ చరణ్ మాఝీని సీఎంగా ఎన్నుకుంది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ మాఝీకి బీజేపీ అధిష్టానం సీఎం పగ్గాలు అప్పగించింది. డిప్యూటీ సీఎంలుగా కనకవర్థన్ సింగ్ దేవ్, ప్రవతి పరిడా ఎన్నికయ్యారు. ఈ భేటీకి బీజేపీ అధిష్ఠానం తరఫున కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్ హాజరయ్యారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా అధికార బీజేడీ పరాజయం పాలైంది. 24 ఏళ్లుగా ఒడిశా సీఎంగా ఉన్న నవీన్ పట్నాయక్ ప్రతిపక్షానికి పరిమితయ్యారు. ఒడిశా 147 అసెంబ్లీ స్థానాలకు గాను బీజేపీ 78 స్థానాల్ని కైవసం చేసుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఇక బీజేడీ 51 స్థానాల్లో గెలుపొందగా, కాంగ్రెస్ 14 స్థానాల్లో విజయం సాధించగా, మూడు ఇండిపెండెంట్ అభ్యర్థులకు దక్కాయి. లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని 21 స్థానాలకు గాను బీజేపీ 20, కాంగ్రెస్ 1 గెలుచుకోవడంతో బీజేడీ ఘోర పరాజయం పాలైంది.రేపు కొత్త సీఎం ప్రమాణ స్వీకారం రేపు సాయంత్రం 5 గంటలకు ఒడిశా కొత్త సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.ఈ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ రేపు మధ్యాహ్నం 2:30 గంటలకు భువనేశ్వర్ చేరుకుని విమానాశ్రయం నుంచి రాజ్భవన్కు వెళ్లనున్నారు.అనంతరం సాయంత్రం 5 గంటలకు జనతా మైదాన్లో జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఏపీలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత.. ట్రాయ్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై ట్రాయ్కు వైఎస్సార్సీపీ ఫిర్యాదు చేసింది. ఏపీలో సాక్షి టీవీతో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు నిలిపివేతపై ట్రాయ్కి వైఎస్సార్సీపీ ఎంపీ నిరంజన్రెడ్డి ఫిర్యాదు చేశారు. కేబుల్ ఆపరేటర్లపై ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి సాక్షితో పాటు కొన్ని ఛానళ్ల ప్రసారాలు రాకుండా కుట్ర చేస్తోంది.సాక్షి టీవీతో పాటు మరికొన్ని ఛానళ్ల ప్రసారాలను అడ్డుకోవడం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా వ్యవహరించడమేనని ఫిర్యాదులో వైఎస్సార్సీపీ పేర్కొంది.మీడియాకు ఆంక్షలు.. కొత్త సర్కార్ విపరీత పోకడఏపీ సీఎం ప్రమాణస్వీకారానికి మీడియా, జర్నలిస్టులకు కొత్త ప్రభుత్వం ఆంక్షలు విధించింది. చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి సాక్షి మీడియాతో పాటు మరో రెండు ఛానళ్లకు అనుమతి నిరాకరించింది. కవరేజ్ కోసం మీడియా ప్రతినిధులకు పాస్లు ఇవ్వని అధికారులు.. ప్రధాని హాజరవుతున్న కార్యక్రమానికి మీడియా కవరేజ్కు ఆంక్షలు విధించడంతో విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ప్రధాని పర్యటన వార్తలు కవర్ చేయొద్దన్న ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. రాష్ట్ర చర్రితలో ఎన్నడూలేని విపరీత పోకడలపై విమర్శలు వస్తున్నాయి. గతంలో ప్రభుత్వ కార్యక్రమాలకు ఎల్లో మీడియాకు ఆహ్వానాలు అందగా, బాబు ప్రభుత్వం కొలువు దీరకముందే ఆంక్షలు విధించడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు, రాష్ట్రంలో టీడీపీ దాడులు కొనసాగుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు, కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. కర్రలు, రాళ్లు, రాడ్లతో వీరంగం చేస్తున్నారు. విగ్రహాలను, శిలాఫలకాలను ధ్వంసం చేస్తున్నారు. వీరు యథేచ్ఛగా దౌర్జన్యాలకు పాల్పడుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆవేదన చెందుతున్నారు. టీడీపీ, జనసేన పార్టీల తీరుపై ప్రజలు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు..
యూరప్ ట్రిప్ మరింత భారం.. భారీగా పెరిగిన వీసా ఫీజులు
ఐరోపా పర్యటనకు వెళ్లాలనుకునే వారికి ప్రయాణ ఖర్చుపై మరింత భారం పడనుంది. నేటి నుంచి (జూన్11)షెంజెన్ వీసా దరఖాస్తు ఫీజు 12 శాతం పెరిగింది. గతనెలలో వీసా ధరఖాస్తు ఫీజును పెంచుతూ యూరోపియన్ కమిషన్ ఆమోదించడంతో వీసా ధరఖాస్తు ఫీజు పెరగడం అనివార్యమైంది. ఈ పెంపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల పౌరులకు వర్తిస్తుందని స్లొవేనియా విదేశీ, ఐరోపా వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెల్లడించింది.ఇప్పటివరకు పెద్దలకు షెంజెన్ వీసా దరఖాస్తు ధర 80 యూరోలు ఉండగా.. ఇప్పుడు దాన్ని 90 యూరోల (భారత కరెన్సీలో దాదాపు రూ.8వేలకు పైనే)కు పెంచారు. ఇక, 6-12 ఏళ్ల పిల్లల దరఖాస్తు ఫీజును 40 యూరోల నుంచి 45 యూరోలకు పెరిగింది. ద్రవ్యోల్బణం, సివిల్ సర్వెంట్ల వేతనాలకు పెరిగిన ఖర్చులు తదితర కారణాలతో ఈ వీసా ఫీజును పెంచినట్లు యూరోపియన్ కమిషన్ తెలిపింది. చివరిసారిగా 2020 ఫిబ్రవరిలో ఈ వీసా ధరలను పెంచారు.
వారణాసిలో ప్రియాంక పోటీ చేసి ఉంటే.. రాహుల్ సంచలన కామెంట్స్
లక్నో: లోక్సభ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ సంచలన కామెంట్స్ చేశారు.చెల్లి ప్రియాంక గాంధీ గనుక తన మాట విని వారణాసిలో ప్రధానిమోదీపై పోటీ చేసి ఉంటే భారీ మెజార్టీతో గెలిచి ఉండేదన్నారు.ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలిలో మంగళవారం(జూన్11) నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. ‘వారణాసిలో ప్రధానమంత్రికి చావుతప్పి కన్నులొట్టబోయింది. నా చెల్లి ప్రియాంక నా మాట విని ఉంటే ఆమె చేతిలో వారణాసిలో మోదీ 2నుంచి3 లక్షల మెజార్టీతో ఓడిపోయేవారు.బీజేపీతో ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి ముప్పు ఉందని ప్రజలు తెలుసుకోవడం వల్లే ఈ ఎన్నికల్లో బీజేపీకి దెబ్బ పడింది.’అని రాహుల్ అన్నారు. ఈ ఎన్నికల్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన ప్రతి కార్యకర్త కాంగ్రెస్కు సహకారం అందించాడని చెప్పారు. గతంలోలా పొత్తుల్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఎన్నికలను ఎదుర్కొన్నామని చెప్పారు.
పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా? తప్పకుండా ఇవి తెలుసుకోండి
పర్సనల్ లోన్ అనేది ప్రస్తుతం సర్వసాధారణం అయిపోయింది. ఉద్యోగం చేస్తున్నవారు, బిజినెస్ చేసేవారు ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవడానికి సిద్దమైపోతారు. ఇంతకీ పర్సనల్ లోన్ తీసుకునే ముందు తెలుసుకోవలసిన విషయాలు ఏంటి? ఏ సమయంలో పర్సనల్ లోన్ తీసుకోవాలి అనే విషయాలను వివరంగా ఈ కథనంలో చూసేద్దాం..వడ్డీ రేటుపర్సనల్ లోన్ తీసుకోవాలనుకునే వ్యక్తి బ్యాంకులు ఎంత వడ్డీకి లోన్ ఇస్తుంది అనే విషయాన్నీ తెలుసుకోవాలి. ఎందుకంటే వెహికల్ లోన్స్, హోమ్ లోన్స్ వంటి వాటితో పోలిస్తే.. పర్సనల్ లోన్ వడ్డీ రేటు ఎక్కువగా ఉంటుంది. ఇది మాత్రమే కాకుండా తీసుకొనే మొత్తాన్ని (డబ్బు) బట్టి, వ్యవధి, క్రెడిట్ స్కోరును బట్టి కూడా ఈ వడ్డీని నిర్ణయిస్తారు. పర్సనల్ లోన్ మీద వడ్డీ రేటు 12 నుంచి 21 శాతం వరకు ఉంటుంది. కాబట్టి లోన్ తీసుకునే వ్యక్తి తప్పకుండా ఈ విషయంలో జాగ్రత్తపడాలి. అంతే కాకుండా.. మీకు వచ్చే వార్షిక ఆదాయానికి మించి లోన్ తీసుకుంటే.. ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.ఎవరికి లోన్ ఇస్తారులోన్ అనేది ఉద్యోగం చేసేవారికైనా.. సొంతంగా బిజినెస్ చేసేవారికైనా ఇస్తారు. అయితే ఉద్యోగికి బ్యాంక్ లోన్ ఇవ్వాలంటే.. వారు మూడు నెలల పేస్లిప్ ఇవ్వాల్సి ఉంటుంది. సొంతంగా బిజినెస్ చేసేవారికి డెబిట్ / క్రెడిట్ కార్డు హిస్టరీని చూసి లోన్ మంజూరు చేయడం జరుగుతుంది. కొన్ని బ్యాంకులు ఫేమస్ కంపెనీలలో ఉద్యోగం చేసేవారికి మాత్రమే లోన్ ఇస్తాయి.ఆదాయాన్ని మించకుండా..పర్సనల్ లోన్ తీసుకునే వ్యక్తి తన నెలవారీ జీతం కంటే ఎక్కువ లోన్ తీసుకోకూడదు. ఎందుకంటే వచ్చే డబ్బుతోనే నిత్యావసరాలు, ఈఎంఐ వంటి వాటితో పాటు పిల్లల చదువులు ఇతరత్రా ఖర్చులు ఉంటాయి. ఇవన్నీ పూర్తిగా బేరీజు చేసుకున్న తరువాత ఎంత లోన్ తీసుకుంటే.. ఎంత ఈఎంఐ కట్టాల్సి ఉంటుంది. నెల జీతంలో ఈఎంఐ పోగా ఎంత మిగులుతుంది అనేది చూసుకోవాలి. ముఖ్యంగా పర్సనల్ లోన్ అనేది 12 నెలలు (ఒక సంవత్సరం) మించగకుండా ఉండేలా చూసుకోవడం ఉత్తమం.లోన్ ఎప్పుడు తీసుకోవాలి?లోన్ తీసుకోవడం అనేది కొంతవరకు కరెక్ట్ కాదు. అయితే అత్యవసర పరిస్థితుల్లో, వేరే మార్గం లేని సమయంలో తీసుకోవాలి. ఆరోగ్యం మందగించినప్పుడు లేదా అనుకోని దుర్ఘటనలు జరిగినప్పుడు తీసుకోవచ్చని ఆర్ధిక నిపుణులు చెబుతున్నారు. సరదాల కోసం, గ్యాడ్జెట్స్ కొనుగోలు కోసం, విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి లోన్ తీసుకోకూడదు. తప్పకుండా ఇవన్నీ గుర్తుంచుకోవాలి.
ఒడిశాకు కొత్త సీఎం.. ఎవరీ మోహన్ చరణ్ మాఝీ?
భువనేశ్వర్ : ఒడిశాకు కాబోయే ముఖ్యమంత్రి? ఎవరనే ఉత్కంఠతకు బీజేపీ అధిష్టానం తెరదించింది. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీని ఎంపిక చేసింది.ఇటీవల రాష్ట్రానికి చెందిన ఇద్దరు సీనియర్ రాష్ట్ర నాయకులు ధర్మేంద్ర ప్రధాన్, జోయల్ ఓరంలకు కేంద్ర నాయకత్వం కేబినెట్ పదవుల్ని కట్టబెట్టింది. దీంతో ఒడిశా కొత్త సీఎంగా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన,పార్టీ గిరిజన నేత మోహన్ చరణ్ మాఝీ ఎంపిక ఖరారైంది. మోహన్ చరణ్ మాఝీతో పాటు డిప్యూటీ సీఎంలగా కేవీ సింగ్ డియో,ప్రవతి పరిదాలకు అవకాశం కల్పించింది. కియోంఝర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మాఝీ ప్రజా సేవ, సంస్థాగత నైపుణ్యాలు ముఖ్యమంత్రి పదవి వరించేలా చేశాయి.డిప్యూటీ సీఎంలుగాకేవీ సింగ్ డియో బోలంగీర్ నియోగజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా,బీజేపీ-బిజూ జనతాదళ్ కూటమి 2009 వరకు నవీన్ పట్నాయక్ ప్రభుత్వంలో తొమ్మిదేళ్లపాటు మంత్రిగా పనిచేశారు.తీవ్ర కసరత్తుఇక 24ఏళ్ల తర్వాత ఒడిశా కొత్త ముఖ్యమంత్రి నియామకంపై కేంద్రం తీవ్ర కసరత్తు చేసేంది. సీఎం నియామకంపై కమలం అధిష్టానం పరిశీలకులుగా కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, భూపేంద్ర యాదవ్లను పంపింది. భువనేశ్వర్లోని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశానికి కీలక నేతలు, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, జువల్ ఓరమ్ కూడా హాజరయ్యారు.
గెలుపులు.. మలుపులు.. ప్రాంతీయ పార్టీల ‘జాతీయ’ బంధాలు..
దేశంలో ప్రాంతీయ పార్టీలు ఏదో ఒక జాతీయ కూటమిలో భాగస్వామి అయితేనే ప్రయోజనమా అనే చర్చ జరుగుతోంది. కొన్ని ప్రాంతీయ పార్టీలు తమ విధానాలు, తమ సిద్ధాంతాలు, తమ వెనుక ఉండే ఓట్ బ్యాంక్ ఆధారంగా జాతీయ పార్టీల కూటమిలో కలవాలా? వద్దా? అనే నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కొన్ని పార్టీలు పూర్తి అవకాశవాదంతో ఎటు వెళితే ఉపయోగమని అనుకుంటాయో అటు వెళుతున్నాయి. కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు ఒకప్పుడు రాష్ట్రాలలోని రాజకీయాలలో అంతగా తలదూర్చేవి కావు. కానీ రాను, రాను అవి కూడా ప్రాంతీయ పార్టీల ధోరణిలో ఆలోచించడం చేస్తున్నాయి. ఆయా రాష్ట్రాలలో పట్టు తెచ్చుకోవడానికి కృషి చేస్తున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రాంతీయ పార్టీలు వ్యూహాత్మకంగా జాతీయ పార్టీలతో చెలిమి చేస్తున్నాయి.స్వాతంత్రం వచ్చినప్పటినుంచి పలు ప్రాంతీయ పార్టీలు పుట్టాయి. వాటిలో అనేకం జాతీయ పార్టీలలో విలీనం అవడమో, లేక పొత్తు పెట్టుకుని మనుగడ సాగించడమో చేశాయి. నాయకత్వ స్థాయిని బట్టి అవి కొంతకాలం నిలబడగలుగుతున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ఉవ్వెత్తున పైకి లేచినా, అనతికాలంలోనే పడిపోయింది. ఒంటరిగా పోటీచేసి అధికారం సాధించలేకపోవడంతో తర్వాత కాలంలో కాంగ్రెస్ లో విలీనం అయిపోయింది.ఉమ్మడి ఏపీలో ఉప ప్రాంతీయ పార్టీగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితి 2001లో తన ప్రయాణం ఆరంభించి 2004 ఎన్నికల నాటికి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునే దశకు ఎదిగింది. ఆ రోజుల్లో కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేకపోవడంతో టీఆర్ఎస్ కూడా ఉంటేనే ఏపీలో అధికారం సాధించగలుగుతామని నాయకత్వం భావించి పొత్తుపెట్టుకుంది. అది ఫలించింది. కాంగ్రెస్ కూటమిలో భాగస్వామి అయి రెండు చోట్ల అధికారం పొందింది. టీఆర్ఎస్ తెలంగాణ సాధనకు ఏర్పాటైన ఉద్యమ పార్టీ కనుక కొద్దికాలానికే కూటమి నుంచి విడిపోయింది. తదుపరి తెలుగుదేశం, సీపీఐ, సీపీఎంలతో పొత్తు పెట్టుకున్నా పెద్దగా ఫలితం పొందలేకపోయింది.ఆ తర్వాత పరిణామాలలో తెలంగాణ రాష్ట్రం రావడం, ఒంటరిగా టీఆర్ఎస్ పోటీ చేసి అధికారం సాధించడంతో పార్టీకి ఖ్యాతి వచ్చింది. తొమ్మిదినర్రేళ్లపాటు పవర్ లో ఉంది. ఆ క్రమంలో కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ వంటి పార్టీల శాసనసభ పక్షాలను విలీనం చేసుకోవడం విశేషం. కానీ 2023లో జరిగిన ఎన్నికలలో ఓటమి పాలవడంతో సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. పార్లమెంటు ఎన్నికలలో ఒక్క సీటు కూడా సాధించలేకపోయింది. అదే టీఆర్ఎస్ కనుక కాంగ్రెస్ లేదా బీజేపీతో పొత్తు పెట్టుకోగలిగి ఉంటే ఈ రోజు పరిస్థితి ఇలా ఉండేది కాదేమో! ఒక దశలో బీజేపీతో స్నేహంగానే ఉన్నా, మరో సందర్భంలో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కు సహకరించినా ఒంటరిగానే రాష్ట్రంలో రాజకీయం చేసింది.ఆ రెండు పార్టీలు ప్రత్యర్ధి పార్టీలుగా మారడంతో బీఆర్ఎస్(పేరు మారిన టీఆర్ఎస్) ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునే పనిలో పడింది. కాంగ్రెస్ తెలంగాణలో అధికారం సాధించడానికి యత్నిస్తున్న పార్టీ కావడం, బీజేపీ పొత్తు వల్ల తమకు ముస్లిం మైనార్టీల మధ్దతు రాదేమోనన్న అనుమానంతో పొత్తు వైపు బీఆర్ఎస్ చూడలేదు. పైగా తనకు మళ్లీ అధికారం వస్తుందని ఆ పార్టీ అంచనా వేసుకుంది. కానీ అది జరగలేదు. తెలుగుదేశం పార్టీ 1983 నుంచి ఏదో ఒక కూటమిగానే ఉండడం విశేషం. తొలుత సంజయ్ విచార్ మంచ్ అనే పార్టీతో పొత్తు పెట్టుకున్నా, తదుపరి కాలంలో బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో స్నేహం సాగించింది.1994, 1996, 1998లలో వామపక్షాలతో కూటమి కట్టిన టీడీపీ 1999 లో బీజేపీ వైపు జంప్ చేసింది. 2004లో ఓటమి తర్వాత 2009లో టీఆర్ఎస్, వామపక్షాలతో కలిసి పోటీచేసింది. అది ఫలించలేదు. దాంతో తిరిగి 2014 నాటికి బీజేపీతో జత కట్టి లాభం పొందింది. అప్పుడే ఏర్పడిన జనసేన కూడా ఉపయోగపడింది. 2018లో బీజేపీ నుంచి విడిపోయి కాంగ్రెస్ కూటమిలో టీడీపీ చేరి తెలంగాణలో పోటీ చేసింది. అది సఫలం కాకపోవడంతో 2019 ఏపీ ఎన్నికలలో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అలాగే జనసేన కూడా 2019లో బీఎస్పీ, వామపక్షాలతో కూటమి కట్టినా ప్రయోజనం కలగలేదు. దానిని దృష్టిలో ఉంచుకుని టీడీపీ వ్యూహాత్మకంగా పావులు కదిపింది. పవన్ కళ్యాణ్ ద్వారా టీడీపీ అధినాయకత్వం ఎన్డీఏ కూటమిలో చేరడానికి ఖర్చీఫ్ వేసింది. ఈలోగా టీడీపీ రాజ్యసభ ఎంపీలు నలుగురిని బీజేపీలోకి పంపించి తన తరపున పనిచేసేలా ఏర్పాటు చేసుకున్నారు. ఇలాంటి వ్యూహాలలో చంద్రబాబు నిపుణుడే అని చెప్పాలి. తొలుత బీజేపీకి అంత ఇష్టం లేకపోయినా, జనసేన ఒత్తిడితో మళ్లీ టీడీపీని ఎన్డీఏ లో చేర్చుకున్నారు. అది సత్ఫలితాన్ని ఇచ్చి రాష్ట్రంలో అధికారం పొందడమే కాక, కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన మద్దతు ఇచ్చే దశకు టీడీపీ చేరుకుంది.కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సొంతంగా వైఎస్సార్సీపీను ఏర్పాటు చేసుకుని ఒంటరిగానే ప్రయాణం సాగించారు. దానినే ఇప్పటికీ కొనసాగిస్తున్నారు. 2019లో విజయం తర్వాత వైఎస్సార్సీపీ కనుక ఎన్డీఏ లో చేరి ఉన్నట్లయితే కేంద్రంలో తనకు మంచి పట్టు లభించినట్లయ్యేది. కానీ తన వెనుక ఉన్న ఓట్ బ్యాంక్ ఎక్కువగా బీజేపీ వ్యతిరేక భావజాలంతో ఉంటుందన్న భావనతో అలా చేయలేకపోయారు. కానీ ప్రధాని మోదీతో ఉన్న స్నేహం కారణంగా, కాంగ్రెస్ తో సరిపడదు కనుక ఎన్డీఏకే అవసరమైన అన్ని సందర్భాలలో మద్దతు ఇచ్చి వారి అభిమానాన్ని పొందారు.2024 ఎన్నికల ముందు బీజేపీ కేంద్ర నాయకత్వం వైఎస్సార్సీపీకి పొత్తు ఆఫర్ ఇచ్చినా అందుకు సిద్దపడలేదని చెబుతారు. ఒకవైపు చంద్రబాబు జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకోవడం ద్వారా తన అవకాశాలను మెరుగుపరచుకుంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తనకు ఉన్న ఆత్మ విశ్వాసంతో దెబ్బతిన్నారనిపిస్తుంది. చంద్రబాబు 2019 ఎన్నికల సమయంలో మోదీపై తీవ్ర విమర్శలు చేశారు. అయినా ఇప్పుడు కలవగలిగారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎన్నడూ మోదీపై విమర్శలు చేయలేదు. కానీ ఎన్డీఏతో జతకట్టడానికి సిద్దపడలేదు. ప్రస్తుతం రాజ్యసభలో పదకుండు మంది, లోక్ సభలో నలుగురు ఎంపీలు వైఎస్సార్సీపీకి ఉన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎన్డీఏతో సంబంధాలు మెరుగుపరచుకోవడం మంచిదని చెప్పాలి. అలా వైఎస్సార్సీపీ చేస్తుందో, లేదో తెలియదు.ఒడిషాలో బిజు జనతాదళ్ అనూహ్యంగా ఓటమిపాలైంది. బీజేపీతో పొత్తు చర్చలు విఫలం అవడంతో ఒంటరిగా పోటీచేసి దెబ్బతింది. అదే ఎలాగొలా రాజీపడి పొత్తుపెట్టుకుని ఉంటే నవీన్ పట్నాయక్ మరోసారి ముఖ్యమంత్రి అయ్యేవారేమో! అంటే జాతీయ పార్టీతో పొత్తుతో చంద్రబాబు నాయుడు, బీహారు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వంటి నేతలు రాజకీయంగా, ఇతరత్రా లబ్దిపొందుతుండడం గమనించదగ్గ అంశం.ఇతర రాష్ట్రాలను చూస్తే తమిళనాడులో డీఎంకే గత కొంతకాలంగా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుంది. ఇది ఈసారి లోక్ సభ ఎన్నికలలో కూడా ప్రతిఫలించింది. అన్నా డీఎంకే గతంలో మాదిరి బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా నష్టపోయింది. బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఇండి కూటమిలో భాగస్వామిగా ఉంటూ జాతీయ స్థాయిలో ఒక అండ పొందిందని చెప్పాలి. అదే సమయంలో రాష్ట్రంలో మాత్రం కాంగ్రెస్, సీపీఎంలతో పోటీ పడుతోంది. ఇదేమీ కొత్త కాదు. కేరళలో కాంగ్రెస్, సీపీఎంలు పరస్పరం పోటీ పడుతాయి. ఢిల్లీ స్థాయిలో మాత్రం కలిసి ఒక కూటమిగా ఉంటున్నాయి. అలాగే వైఎస్సార్సీపీ వంటి పార్టీలు కూడా ఆ తరహా ప్రయత్నాలు చేస్తాయా? లేదా? అన్నది చూడాలి.ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆప్ మొన్నటి వరకు ఏ కూటమిలో లేదు. బీజేపీ నుంచి తీవ్రమైన సమస్యలు ఎదుర్కుంటోంది. మద్యం స్కామ్ పేరుతో ఆప్ ను బీజేపీ దడదడలాడిస్తోందన్న భావన ఉంది. దాంతో ఆప్ అధినేత కేజ్రీవాల్ ఇండి కూటమిలో చేరారు. బీహారులో జేడీయూ నేత, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కొంతకాలం కాంగ్రెస్, ఆర్జెడిలతో కలిసి, మరికొంతకాలం బీజేపీతో కలిసి రాజకీయం సాగిస్తూ ఇంతవరకు సఫలం అయ్యారు. ఈ పార్లమెంటు ఎన్నికలలో కూడా ఆయన బీజేపీతో జట్టుకట్టడం ఉపయోగపడింది.ఢిల్లీ స్థాయిలో కీలకమైన వ్యక్తిగా మారారు. మహారాష్ట్రలో శివసేన, ఎన్.సీ.సీలలో చీలిక తెచ్చి బీజేపీ అధికారంలోకి రాగలిగింది. కర్నాటకలో బీజేపీతో జెడిఎస్ జట్టుకట్టడం వల్ల కేంద్రంలో ఆ పార్టీ అధినేత కుమారస్వామి మంత్రి కాగలిగారు. జమ్ము-కశ్మీర్ లోని ప్రాంతీయ పార్టీలు కూడా కేంద్రంలో ఏదో ఒక జాతీయ పార్టీతో కలిసి ఉంటాయి. సిక్కింలో ఘన విజయం సాధించిన సిక్కిం ప్రాంతీయ పార్టీ కేంద్రంలో బీజేపీకి మద్దతు ఇస్తోంది.ఓవరాల్ గా చూసినప్పుడు వీలైతే కేంద్రంలో అధికారంలో ఉన్న జాతీయ పార్టీతో కూటమిలో భాగస్వామి అవడమో లేదా సత్సంబంధాలు పెట్టుకోవడమో చేయక తప్పని పరిస్థితులు ప్రాంతీయ పార్టీలకు ఏర్పడుతున్నట్లు అనిపిస్తుంది. అధికార పార్టీతో వీలు కాకపోతే ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమిలో అయినా చేరితే ఏదో ఒక అండ దొరికినట్లవుతుందన్న భావన ఏర్పడుతోంది. దేశ రాజకీయాలలో ఇది అత్యంత కీలమైన పరిణామంగా కనిపిస్తుంది. లేకుంటే రాష్ట్ర స్థాయిలో, కేంద్ర స్థాయిలో ప్రాంతీయ పార్టీలు పలు సమస్యలను ఎదుర్కోవలసి వస్తోంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
వైఎస్ జగన్ను కలిసిన వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగనమోహన్రెడ్డిని పార్టీ ముఖ్య నాయకులు, ఇటీవల ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయనతో భేటీ అయ్యారు. వైఎస్ జగన్ని కలిసిన వారిలో మాజీ మంత్రులు ధర్మాన కృష్ణదాసు, ధర్మాన ప్రసాద్, కొట్టు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామిరెడ్డి, అన్నా రాంబాబు, తెల్లం బాలరాజు, ఎమ్మెల్సీ రెడ్డి శాంతి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ తదితరులు ఉన్నారు. ఎన్నికల ఫలితాలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడులు సహా పలు అంశాలపై చర్చించారు.
ఆరుగురు ఇండియా కూటమి యూపీ ఎంపీలు సభ్యత్వం కోల్పోనున్నారా?
లక్నో: ఇటీవల కొత్తగా ఎంపికైన ఇండియా కూటమిలోని ఆరుగురు ఎంపీలు తమ పదవుల్ని కోల్పోనున్నారా? క్రిమినల్ కేసులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ ఆరుగురు ఎంపీలకు రెండేళ్లకు పైగా జైలు శిక్ష పడనుందా? అదే జరిగితే వారు పార్లమెంట్ సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందా? అంటే అవుననే అంటున్నాయి తాజా రాజకీయ పరిణామాలు. సాధారణ ఎన్నికల ఫలితాల్లో గెలుపొందిన ఆరుగురు ఇండియా కూటమి ఎంపీలకు పదవీ గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ ఆరుగురు క్రిమినల్ కేసులు ఆరోపణల్ని ఎదుర్కొంటున్నారు. అదే జరిగితే ఈ ఎంపీలు పార్లమెంటు సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని సమాచారం. ఇక ఆ ఆరుగురిలో ఉత్తర్ ప్రదేశ్ ఘాజీపూర్ లోక్సభ స్థానం నుంచి గెలుపొందిన అఫ్జల్ అన్సారీ ఇప్పటికే గ్యాంగ్స్టర్ చట్టం కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించారు. అతని నేరారోపణపై అలహాబాద్ హైకోర్టు గత నెలలో స్టే విధించింది. దీంతో ఆయన సాధారణ ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే అప్జల్ అన్సారీ కేసును జులైలో కోర్టు విచారించనుంది. కోర్టు శిక్షను సమర్థిస్తే అన్సారీ తన లోక్సభ సభ్యత్వాన్ని కోల్పోనున్నారు.అజంగఢ్ సీటును గెలుచుకున్న ధర్మేంద్ర యాదవ్పై కూడా నాలుగు కేసులు పెండింగ్లో ఉన్నాయి. అతను దోషిగా తేలితే రెండేళ్లకు పైగా జైలు శిక్షను అనుభవించాల్సి ఉంది. దీంతో ఆయన సభ్యత్వాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. మాయావతి హయాంలో మంత్రిగా పనిచేసిన బాబు సింగ్ కుష్వాహా నేషనల్ రూరల్ హెల్త్ మెషిన్(ఎన్ఆర్హెచ్ఎం) స్కామ్కు సంబంధించి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై నమోదైన 25 కేసుల్లో ఎనిమిదింటిపై అభియోగాలు నమోదయ్యాయి. సుల్తాన్పూర్ స్థానం నుంచి గెలుపొందిన రాంభూల్ నిషాద్పై గ్యాంగ్స్టర్స్ చట్టం కింద ఒక కేసుతో సహా ఎనిమిది కేసులు నమోదయ్యాయి. చందౌలీ లోక్సభ స్థానం నుంచి మాజీ మంత్రి మహేంద్ర నాథ్ పాండేపై విజయం సాధించిన వీరేంద్ర సింగ్ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారు. సహరాన్పూర్ నుంచి గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి ఇమ్రాన్ మసూద్పై ఎనిమిది కేసులు నమోదయ్యాయి. నగీనా రిజర్వ్డ్ స్థానంలో గెలిచిన సమాజ్ పార్టీకి చెందిన ఏడో అభ్యర్థి చంద్రశేఖర్ ఆజాద్పై 30కి పైగా కేసులు నమోదయ్యాయి. ఏదైనా ఒక కేసులో రెండేళ్లకు పైగా శిక్ష పడితే అతని రాజకీయ జీవితంపై ప్రతికూల ప్రభావం పడుతుంది.అనేక మంది రాజకీయ నేతలు క్రిమినల్ కేసుల్లో దోషిగా తేలి తమ సభ్యత్వాన్ని కోల్పోయే అవకాశం ఉండడం గమనార్హం.
T20 World Cup 2024: బ్యాట్ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య నిన్న (జూన్ 10) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ జాకెర్ అలీ కోపంతో బ్యాట్ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో పుల్ షాట్ ఆడే క్రమంలో జాకెర్ అలీ బ్యాట్ డ్యామేజ్ అయ్యింది. షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ స్వల్పంగా డ్యామేజ్ అయిన బ్యాట్ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్ కొత్త బ్యాట్ కోసం డ్రెస్సింగ్ రూమ్కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc)ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్ మహారాజ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్లను కెప్టెన్ మార్క్రమ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ను ఢిఫెండ్ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్ సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2. రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కేశవ్ మహారాజ్ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హ్రిదోయ్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
తప్పక చదవండి
- హైదరాబాద్ హోటళ్లలో కల్తీ.. మంత్రి వార్నింగ్
- ఇండియన్ మార్కెట్లో రూ.20.98 లక్షల బైక్ లాంచ్ - వివరాలు
- కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?
- నార్త్లో ఎండలు.. సౌత్లో వర్షాలు
- బిహార్ జైలులో చైనీయుడి మృతి
- అంతరిక్ష కేంద్రంలో ‘స్పేస్ బగ్’ .. ఇబ్బందుల్లో సునీతా విలియమ్స్!
- డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
- రంగారెడ్డి: డీఈవో లేట్.. జడ్పీ ఛైర్మన్ క్లాస్
- Kalki 2898 AD: షాకింగ్గా కమల్ హాసన్ లుక్.. లోక నాయకుడికే సాధ్యం!
- వామ్మో.. ఇది కూడా కూలరేనా?
సినిమా
ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రాజు యాదవ్'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
'జబర్దస్త్' కమెడియన్గా కెరీర్ మొదలుపెట్టి గెటప్ శీను.. ఇప్పుడు హీరో అయ్యేంత వరకు వచ్చాడు. స్టార్ హీరోల సినిమాల్లో హాస్య నటుడిగా చేస్తూ పేరు తెచ్చుకున్న ఇతడు.. రీసెంట్గా 'రాజు యాదవ్' మూవీతో ప్రేక్షకుల్ని పలకరించాడు. రిలీజ్కి ముందు ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత వాటిని అందుకోవడంలో పూర్తిగా విఫలమైంది. దీంతో జనాలు పట్టించుకోలేదు. అలాంటిది ఇప్పుడు ఓటీటీ డేట్ ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)గెటప్ శీను, అంకికా కారత్ హీరోహీరోయిన్లుగా నటించగా.. ఈ సినిమాకు కృష్ణమాచారి దర్శకుడు. మే 24న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు తొలిరోజే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో ఓటీటీలోకి వచ్చిన తర్వాత చూసుకోవచ్చులే అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. ఇప్పుడు వాళ్ల కోసమా అన్నట్లు జూన్ 22 నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఈ విషయమై క్లారిటీ వస్తుంది.'రాజు యాదవ్' విషయానికొస్తే.. రాజు యాదవ్ ముఖానికి క్రికెట్ బాల్ తగలడంతో ఆపరేషన్ చేస్తారు. అది ఫెయిలవుతుంది. దీంతో ఫేస్ నవ్వుతున్నట్లే ఉండిపోతుంది. కొన్నాళ్లకు స్వీటీ (అంకితా కారత్) అనే అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. ఆమెకి హైదరాబాద్లో జాబ్ రావడంతో రాజు యాదవ్ కూడా అక్కడికెళ్లి క్యాబ్ డ్రైవర్గా మారతాడు. ఆ తర్వాత అమ్మాయి.. ఇతగాడికి కొన్ని షాకులిస్తుంది. చివరకు ఏమైందనేదే కథ.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్)
ఆస్ట్రేలియా క్రికెటర్ వార్నర్ వీడియో.. బన్నీ రిప్లై ఇదే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప-2: ది రూల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. సుకుమార్- బన్నీ కాంబోలో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప పార్ట్-1కు సీక్వెల్గా ఈ సినిమాను తీసుకొస్తున్నారు. పుష్ప-2లోనూ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్గా కనిపించనుంది. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్, సాంగ్స్ ఆడియన్స్ను ఊపేస్తున్నాయి.పుష్ప సినిమా తర్వాత ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ సైతం బన్నీకి ఫ్యాన్గా మారిపోయాడు. పుష్ప మేనరిజాన్ని బన్నీ స్టైల్లో చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తుంటారు. పుష్ప-2 కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నానని వార్నర్ గతంలోనే వెల్లడించారు.అయితే తాజాగా వార్నర్ ఓ కంపెనీ యాడ్లో మెరిశారు. ఈ ప్రకటనలో పుష్ప సినిమాలోని ఫైర్ అనే డైలాగ్తో మెప్పించారు వార్నర్. ఈ ప్రకటన చూసిన బన్నీ ఫన్నీ రిప్లై ఇచ్చారు. నవ్వుతున్న ఎమోజీలు జత చేస్తూ థమ్సప్ సింబల్ ఇచ్చాడు. కాగా.. ఇటీవల విడుదలైన 'పుష్ప: ది రూల్'లోని 'పుష్ప పుష్ప' సాంగ్కు స్టెప్పులతో డేవిడ్ వార్నర్ అదరగొట్టాడు. షూ డ్రాప్ స్టెప్ ప్రాక్టీస్ చేస్తూ వార్నర్ కనిపించారు. కాగా.. పుష్ప-2 ఈ ఏడాది ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ప్రభాస్ 'కల్కి' ట్రైలర్.. ఆ విషయంపై ట్రోల్స్
ప్రభాస్ 'కల్కి' ట్రైలర్ దుమ్మరేపుతోంది. అద్భుతమైన గ్రాఫిక్స్తో సినిమా తీసినట్లు క్లారిటీ వచ్చేసింది. జూన్ 27 నుంచి థియేటర్లలో దద్దరిల్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ప్రభాస్ లుక్ దగ్గర నుంచి యాక్టింగ్ వరకు అన్ని టాప్ నాచ్ ఉన్నాయని చెప్పొచ్చు. కానీ ఒక్క విషయంలో మాత్రం ఫ్యాన్స్ కాస్త అసంతృప్తిగా ఉన్నారు. ఆ విషయమై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్)గతేడాది 'సలార్' మూవీతో హిట్ కొట్టిన ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ 'కల్కి'. నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే మొదలుపెట్టారు. థియేటర్లలో విడుదలకు మరో 15 రోజులే ఉన్న నేపథ్యంలో సోమవారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేశారు. విజువల్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్టింగ్ అన్ని బాగున్నాయి. కానీ హీరోయిన్ దీపికా పదుకొణె డబ్బింగ్ మాత్రం ఎందుకో అంతగా అతకలేదు.'కల్కి' దీపిక పదుకొణె పాత్రకు ఆమెతోనే డబ్బింగ్ చెప్పించారేమో? అందుకే తెలుగు కృతకంగా అనిపించింది. ఇలా ఉందేంటి అని ఫన్నీ కామెంట్స్ పెడుతున్నారు. ట్రైలర్ వరకు ఈ డబ్బింగ్ ఉంటే పర్లేదు. అదే సినిమాలో ఇలానే వాయిస్ ఉంటే మాత్రం ప్రేక్షకులు ఇబ్బందిగా ఫీలయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి ఈ విషయంలో మూవీ టీమ్ ఏం చేస్తుందో చూడాలి?(ఇదీ చదవండి: హత్య కేసులో కన్నడ స్టార్ హీరో దర్శన్ అరెస్ట్)
ఇటీవలే విడాకులు తీసుకున్న స్టార్ జంట.. మళ్లీ కలవడమేంటి?
ఏ జంట అయినా విడాకులు తీసుకుంటే దాదాపు కలవడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడైనా పొరపాటున బయట ఎదురుపడినా పలకరించడం లాంటివి కూడా జరగవు. చాలా జంటలు విడాకుల తర్వాత కలిసి మాట్లాడుకోవడం జరిగే అవకాశం చాలా తక్కువ. మరీ విడాకుల తర్వాత ఇద్దరు కలిస్తే ఎలా ఉంటుంది. అంతే కాదు ఏకంగా ప్రెస్ మీట్ పెడితే ఎలా ఉంటుంది. అలాంటిదే తాజాగా జరిగింది. ఓ స్టార్ జంట తీసుకున్న నిర్ణయంపై ఫ్యాన్స్ షాకవుతున్నారు. ఆ వివరాలేంటో చూద్దాం.శాండల్వుడ్ జంట నివేద గౌడ, చందన్ శెట్టి ఇటీవలే విడాకులు తీసుకున్నారు. ఏడాది క్రితమే వీరిద్దరూ విడాకులకు పిటిషన్ వేయగా.. ఇటీవలే కోర్టు విడాకులు మంజూరు చేసింది. శాండల్వుడ్లో క్యూటెస్ట్ కపుల్గా పేరున్న ఈ జంట విడిపోవడానికి గల కారణాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో ఫ్యాన్స్ డివోర్స్ గల కారణాలపై తెగ ఆరా తీస్తున్నారు. చందన్ శెట్టి, నివేద గౌడ ఎందుకు విడిపోయారు? విడాకులకు కారణం ఏమిటి? ఇలాంటి విషయాలపై ప్రతిరోజూ అనేక రూమర్స్ వినిపిస్తున్నాయి.తాజాగా విడిపోయిన తర్వాత కూడా నివేద గౌడ, చందన్ శెట్టి సమావేశం నిర్వహించనున్నారు. ఇవాళ బెంగళూరులోని ఓ మాల్లో నిర్వహించే ప్రెస్మీట్లో తాము విడిపోవడానికి గల కారణాలను వివరించనున్నారు. ఈ సమావేశంలో చందన్ శెట్టి, నివేద గౌడ పాల్గొని విడాకులపై మాట్లాడనున్నారు. ఫ్యాన్స్కు క్లారిటీ ఇవ్వనున్నారు.కాగా.. టిక్టాక్ స్టార్ నివేదా గౌడ బిగ్ బాస్ సీజన్- 5తో గుర్తింపు తెచ్చుకున్నారు. అదే సమయంలో ఇద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత రాపర్గా రాణిస్తున్న చందన్ శెట్టి.. నివేదా గౌడపై బొంబే బొంబే అనే పాట రాసి అందరినీ అలరించాడు. మైసూర్లోని జరిగిన దసరా వేడుకల్లో నివేద గౌడకు ప్రపోజ్ చేశాడు. అప్పట్లోనే అతని తీరు వివాదానికి దారితీసింది. అయితే ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వీరిద్దరు నాలుగేళ్ల తర్వాత విడాకులు తీసుకున్నారు.
ఫొటోలు
యాపిల్ WWDC 2024 ఈవెంట్ (ఫొటోలు)
Priya Anand: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హీరోయిన్ ప్రియా ఆనంద్ (ఫొటోలు)
కోహ్లికి ప్రపోజ్ చేసిన క్రికెటర్.. ప్రేయసితో ఘనంగా పెళ్లి (ఫొటోలు)
Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)
MS Dhoni: ప్యారిస్ టూర్లో జీవాతో పాటు ధోని- సాక్షి (ఫొటోలు)
క్రీడలు
T20 World Cup 2024: కెనడాతో కీలక సమరం.. టాస్ గెలిచిన పాకిస్తాన్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా న్యూయార్క్ వేదికగా కెనడా-పాకిస్తాన్ జట్ల మధ్య ఇవాళ (జూన్ 11) కీలక పోరు జరుగనుంది. ఈ మ్యాచ్ భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభంకానుంది. ఈ మ్యాచ్లో పాకిస్తాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. సూపర్-8 అవకాశాలు సజీవంగా ఉంచుకోవాలంటే పాకిస్తాన్ ఈ మ్యాచ్లో తప్పనిసరిగా భారీ తేడాతో గెలవాల్సి ఉంది. మరోవైపు కెనడాకు సైతం ఈ మ్యాచ్ అంతే కీలకంగా మారింది. కెనడా కూడా సూపర్-8 రేసులో నిలవాలంటే ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాల్సి ఉంది. ఇరు జట్లకు ఈ మ్యాచ్ కీలకమైన నేపథ్యంలో ఈ మ్యాచ్కు ప్రాధాన్యత సంతరించుకుంది.తుది జట్లు..కెనడా: ఆరోన్ జాన్సన్, నవనీత్ ధలివాల్, పర్గత్ సింగ్, నికోలస్ కిర్టన్, శ్రేయాస్ మొవ్వ(వికెట్కీపర్), రవీందర్పాల్ సింగ్, సాద్ బిన్ జాఫర్(కెప్టెన్), డిల్లాన్ హేలిగర్, కలీమ్ సనా, జునైద్ సిద్ధిఖీ, జెరెమీ గోర్డాన్పాకిస్తాన్: మహ్మద్ రిజ్వాన్(వికెట్కీపర్), సైమ్ అయూబ్, బాబర్ ఆజం(కెప్టెన్), ఫఖర్ జమాన్, ఉస్మాన్ ఖాన్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం, షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, హరీస్ రౌఫ్, మహ్మద్ అమీర్
T20 World Cup 2024: బ్యాట్ను రెండుగా చీల్చేసిన బంగ్లాదేశ్ బ్యాటర్
టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికా-బంగ్లాదేశ్ మధ్య నిన్న (జూన్ 10) జరిగిన మ్యాచ్లో ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. బంగ్లాదేశీ బ్యాటర్ జాకెర్ అలీ కోపంతో బ్యాట్ను రెండు ముక్కలుగా చీల్చేశాడు. బంగ్లాదేశ్ గెలుపుకు 7 బంతుల్లో 13 పరుగులు చేయాల్సిన తరుణంలో జాకెర్ అలీ ఈ పనికి పాల్పడ్డాడు. సౌతాఫ్రికా ఫాస్ట్ బౌలర్ ఓట్నీల్ బార్ట్మన్ బౌలింగ్లో పుల్ షాట్ ఆడే క్రమంలో జాకెర్ అలీ బ్యాట్ డ్యామేజ్ అయ్యింది. షాట్ మిస్ టైమ్ కావడంతో కోపంతో ఊగిపోయిన జాకెర్ స్వల్పంగా డ్యామేజ్ అయిన బ్యాట్ను రెండుగా చీల్చాడు. అనంతరం జాకెర్ కొత్త బ్యాట్ కోసం డ్రెస్సింగ్ రూమ్కు సైగ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్మీడియాలో వైరలవుతుంది. View this post on Instagram A post shared by ICC (@icc)ఈ మ్యాచ్లో సౌతాఫ్రికా నిర్దేశించిన 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి బంగ్లాదేశ్.. చివరి వరకు పోరాడి 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. బంగ్లాదేశ్ గెలుపుకు ఆఖరి ఓవర్లో 11 పరుగులు అవసరం కాగా.. కేవలం 6 పరుగులు మాత్రమే వచ్చాయి. కేశవ్ మహారాజ్ ఆఖరి ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి కీలకమైన రెండు వికెట్లు తీశాడు. ఈ రెండు వికెట్లకు సంబంధించిన క్యాచ్లను కెప్టెన్ మార్క్రమ్ అందుకున్నాడు. ఈ మ్యాచ్లో 114 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న సౌతాఫ్రికా టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో అత్యల్ప స్కోర్ను ఢిఫెండ్ చేసుకున్న జట్టుగా చరిత్ర సృష్టించింది.ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్లో క్లాసెన్ (46), డేవిడ్ మిల్లర్ (29), డికాక్ (18) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. బంగ్లా బౌలరల్లో తంజిమ్ సకీబ్ 3, తస్కిన్ అహ్మద్ 2. రిషద్ హొసేన్ ఓ వికెట్ పడగొట్టారు.స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. కేశవ్ మహారాజ్ (4-0-27-3), నోర్జే (4-0-17-2), రబాడ (4-0-19-2) ధాటికి 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. బంగ్లా ఇన్నింగ్స్లో తౌహిద్ హ్రిదోయ్ (37) టాప్ స్కోరర్గా నిలిచాడు. షాంటో (14), మహ్మదుల్లా (20) రెండంకెల స్కోర్లు చేయగలిగారు.
T20 World Cup 2024: బంగ్లాదేశ్ చెత్త రికార్డు
పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో బంగ్లాదేశ్ పేరిట ఓ చెత్త రికార్డు కొనసాగుతుంది. మెగా టోర్నీలో అత్యధిక పరాజయలు చవిచూసిన జట్టుగా ఘోర అపవాదును మూటగట్టుకుంది. టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా నిన్న (జూన్ 10) సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో ఓటమిని ఎదుర్కొన్న బంగ్లాదేశ్.. మెగా టోర్నీల్లో తమ పరాజయాల సంఖ్యను 29కి పెంచుకుని, అప్పటికే తమ పేరిట ఉన్న చెత్త రికార్డును మరింత మెరుగుపర్చుకుంది. బంగ్లాదేశ్ తర్వాత అత్యధిక వరల్డ్కప్ పరాజయాలు చవిచూసిన జట్టుగా శ్రీలంక ఉంది. పొట్టి ప్రపంచకప్ టోర్నీల్లో శ్రీలంక ఇప్పటివరకు 21 అపజయాలను ఎదుర్కొంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్, శ్రీలంక తర్వాత ఇంగ్లండ్ (20), పాకిస్తాన్ (19), న్యూజిలాండ్ (18), వెస్టిండీస్ (18), ఐర్లాండ్ (17), ఆఫ్ఘనిస్తాన్ (15), ఆస్ట్రేలియా (15), ఇండియా (15), సౌతాఫ్రికా (15) ఉన్నాయి.అంతర్జాతీయ టీ20ల మొత్తంలో చూసినా అత్యధిక పరాజయాల చెత్త రికార్డు బంగ్లాదేశ్ పేరిటే ఉంది. ఇప్పటివరకు 171 అంతర్జాతీయ టీ20లు ఆడిన ఆ జట్టు 101 మ్యాచ్ల్లో పరాజయాలు ఎదుర్కొంది. అంతర్జాతీయ టీ20ల్లో బంగ్లాదేశ్ తర్వాత సెంచరీ అపజయాలు ఎదుర్కొన్న ఏకైక జట్టుగా శ్రీలంక ఉంది. శ్రీలంక ఇప్పటివరకు ఆడిన 191 టీ20ల్లో 100 పరాజయాలను నమోదు చేసింది.అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరాజయాలు నమోదు చేసిన టెస్ట్ ప్లేయింగ్ దేశాలు ఇవే..ఆఫ్ఘనిస్తాన్- 132 మ్యాచ్ల్లో 48 పరాజయాలుఆస్ట్రేలియా- 190 మ్యాచ్ల్లో 81 పరాజయాలుబంగ్లాదేశ్- 171 మ్యాచ్ల్లో 101 పరాజయాలుఇంగ్లండ్- 186 మ్యాచ్ల్లో 81 పరాజయాలుభారత్- 221 మ్యాచ్ల్లో 68 పరాజయాలుఐర్లాండ్- 168 మ్యాచ్ల్లో 88 పరాజయాలున్యూజిలాండ్- 217 మ్యాచ్ల్లో 91 పరాజయాలుపాకిస్తాన్- 243 మ్యాచ్ల్లో 92 పరాజయాలుసౌతాఫ్రికా-179 మ్యాచ్ల్లో 76 పరాజయాలుశ్రీలంక- 191 మ్యాచ్ల్లో 100 పరాజయాలువెస్టిండీస్- 197 మ్యాచ్ల్లో 99 పరాజయాలుజింబాబ్వే- 145 మ్యాచ్ల్లో 95 పరాజయాలుఇదిలా ఉంటే, టీ20 వరల్డ్కప్ 2024లో భాగంగా సౌతాఫ్రికాతో నిన్న జరిగిన లో స్కోరింగ్ మ్యాచ్ బంగ్లాదేశ్ 4 పరుగుల స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేయగా.. ఛేదనలో తడబడిన బంగ్లాదేశ్ లక్ష్యానికి 5 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
T20 World Cup 2024: టీమిండియా రికార్డును ఒక్క రోజులోనే బద్దలుకొట్టిన సౌతాఫ్రికా
ప్రస్తుతం జరుగుతున్న టీ20 వరల్డ్కప్ 2024లో దాదాపు ప్రతి మ్యాచ్లో నెక్ టు నెక్ ఫైట్లు జరుగుతున్నాయి. బౌలర్లు చెలరేగుతుండటంతో స్వల్ప స్కోర్లు సైతం మ్యాచ్లు గెలిపిస్తున్నాయి. ప్రపంచకప్కు సహ వేదిక అయిన యూఎస్ఏలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఇక్కడ కొత్తగా నిర్మించిన న్యూయార్క్ మైదానం క్యూరేటర్లకు సైతం అంతుచిక్కని విధంగా ఉంది. ఈ వేదికగా జరుగుతున్న మ్యాచ్ల్లో కనీవినీ ఎరుగని రీతిలో అత్యల్ప స్కోర్లు నమోదవుతున్నాయి. పెద్ద జట్లు సైతం కనీసం 100 పరుగులు చేసేందుకు అష్టకష్టాలు పడుతున్నాయి. ఈ వేదికపై ఇప్పటి వరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా 150 పరుగుల మార్కు దాటలేదు. ఐర్లాండ్పై కెనడా సాధించిన 137 పరుగులే ఈ వేదికపై అత్యధిక స్కోర్గా ఉంది. ఈ మైదానంలో బ్యాటర్లు ఒక్కో పరుగు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఆరు మ్యాచ్ల్లో కేవలం రెండే రెండు హాఫ్ సెంచరీలు (రోహిత్ శర్మ, డేవిడ్ మిల్లర్) నమోదయ్యాయి.న్యూయార్క్లో ఇప్పటివరకు జరిగిన మ్యాచ్లు..శ్రీలంక (77) వర్సెస్ సౌతాఫ్రికా (80/4)ఐర్లాండ్ (96) వర్సెస్ భారత్ (97/2)కెనడా (137/7) వర్సెస్ ఐర్లాండ్ (125/7)నెదర్లాండ్స్ (103/9) వర్సెస్ సౌతాఫ్రికా (106/6)ఇండియా (119) వర్సెస్ పాకిస్తాన్ (113/7)సౌతాఫ్రికా (113/6) వర్సెస్ బంగ్లాదేశ్ (109/7)ఒక్క రోజులోనే టీమిండియా రికార్డు బద్దలు..న్యూయార్క్లో నిన్న (జూన్ 10) జరిగిన సౌతాఫ్రికా, బంగ్లాదేశ్ మ్యాచ్లో మరోసారి అత్యల్ప స్కోర్లు నమోదయ్యాయి. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 114 పరుగుల అతి స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడుకుని చరిత్ర సృష్టించింది. ఛేదనలో సౌతాఫ్రికా బౌలర్లు బంగ్లాదేశ్ను 109 పరుగులకే కట్టడి చేసి 4 పరుగుల తేడాతో విజయం సాధించారు.టీ20 వరల్డ్కప్ టోర్నీల్లో ఏ జట్టైనా ఢిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్ (114) ఇదే. ఈ మ్యాచ్కు ముందు ఈ రికార్డు టీమిండియా పేరిట ఉండేది. ఇదే టోర్నీలో భారత్ 120 పరుగుల లక్ష్యాన్ని (పాక్పై) విజయవంతంగా కాపాడుకుంది. బంగ్లాదేశ్పై సౌతాఫ్రికా కాపాడుకున్న 114 పరుగుల లక్ష్యం పొట్టి క్రికెట్ మొత్తంలో ఆ జట్టు ఢిఫెండ్ చేసుకున్న అత్యల్ప స్కోర్గానూ రికార్డుల్లోకెక్కింది. టీ20ల్లో బంగ్లాదేశ్పై సౌతాఫ్రికాకు ఇది వరుసగా తొమ్మిదో విజయం.
బిజినెస్
మొబైల్లో ఆర్డర్చేసి కిచెన్లోకి వెళితే వంట రెడీ!
వై-ఫైతో అనుసంధానమయ్యే గ్యాడ్జెట్లు మన హాల్ నుంచి తిన్నగా వంట గదిలోకి ప్రవేశిస్తున్నాయి. ఎలాగంటారా.. కిచెన్లోనూ స్మార్ట్ పరికరాల సంఖ్య పెరుగుతోంది. హాల్లో ఎక్కువగా స్మార్ట్ టీవీ, స్మార్ట్ హోం థియేటర్, స్మార్ట్ ఫ్యాన్, సెన్సార్ డోర్లు.. వంటి పరికరాలు వాడుతుంటాం. మరి కిచెన్లోనూ వై-ఫైతో అనుసంధానమయ్యే ఏఐ పరికరాలు వస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. కరెంట్ లేకపోయినా ఇండక్షన్ కుకర్ పనిచేస్తే.. మనకేం కావాలో మొబైల్లో ఆర్డర్ పెట్టి కిచెన్లోకి వెళితే వంట సిద్ధంగా ఉంటే.. మైక్రోఓవెన్లో పెట్టే పదార్థాలు ఎంత సమయంలో వేడి అవుతాయో ముందుగానే తెలిస్తే.. ఊహించుకుంటేనే ఆహా అనిపిస్తుంది కదా. ఇటీవల సీయాటెల్లో జరిగిన స్మార్ట్ కిచెన్ సమ్మిట్(ఎస్కేఎస్)లో కంపెనీలు ఇలాంటి పరికరాలనే ప్రదర్శించాయి. ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.మొబైల్లో ఆర్డర్పెట్టి కిచెన్లోకి వెళితే..స్మార్ట్ కిచెన్ సమ్మిట్లో చెఫీ అనే కంపెనీ కొత్తరకం పరికరాన్ని పరిచయం చేసింది. కంపెనీకు చెందిన యాప్లో మనకు కావాల్సిన వంటను ఆర్డర్పెట్టి కాసేపయ్యాక కిచెన్లోకి వెళితే ఆ వంట సిద్ధంగా ఉంటుంది. ఎలాగంటారా.. కిచెన్లో వంటచేసే స్మార్ట్ పరికరాన్ని ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి. అందులో వంటకు కావాల్సిన కూరగాయలు, పప్పులు, ఇతర ధాన్యాలు, బియ్యం..వంటివాటిని ఏర్పాటుచేసుకోవాలి. ట్రేల్లో వాటికి కేటాయించిన ప్రత్యేక సెటప్లో పెట్టుకోవాలి. కిచెన్లోని పరికరం వై-ఫైకు అనుసంధానమై ఉంటుంది. దాంతో యాప్ ద్వారా మనకు కావాల్సిన పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే అందుకు తగ్గట్టుగా ముందే ఉంచిన ట్రేల్లోని ముడి పదార్థాలను ఉపయోగించుకుని వంట సిద్ధం చేస్తుంది. ఈమేరకు కంపెనీ ఇన్స్టాగ్రామ్లో విడుదల చేసిన వీడియో వైరల్గా మారింది. View this post on Instagram A post shared by Chefee Robotics (@chefeerobotics)బ్యాటరీతో పనిచేసే ఇండక్షన్ కుకర్ఇంపల్స్ ల్యాబ్స్ తయారుచేసిన ఇండక్షన్ కుక్టాప్ కరెంట్ లేకపోయినా పనిచేస్తుంది. ముందుగా వినియోగించినపుడు విద్యుత్ ద్వారా కుకర్లో ఉండే బ్యాటరీలు ఛార్జ్ అవుతాయి. కరెంటులేని సమయంలో తిరిగి ఆ బ్యాటరీల ద్వారా కుకుర్ను వేడిచేసి వంట చేసుకునే వీలుంటుంది.ముందే సమయాన్ని చెప్పే థర్మామీటర్మైక్రోఓవెన్లో ఏదైనా పదార్థాన్ని వేడి చేయాలనుకున్నప్పుడు కంబషన్ కంపెనీ తయారుచేసిన థర్మామీటర్ ఎంతో ఉపయోగపడుతుంది. ముందుగా మనం వేడి చేయాలనుకున్న ఆహారంపై థర్మామీటర్ ఉంచాలి. అందులోని ఎనిమిది సెన్సార్లు అది ఎలాంటి పదార్థమే గుర్తించి తినడానికి అనువుగా వేడి అవ్వాలంటే ఎంతసమయం పడుతుందో తెలియజేస్తుంది.ఇదీ చదవండి: డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’స్మార్ట్ కిచెన్ సమ్మిట్లో కలినరీ టెక్నాలజిస్ట్ స్కాట్ హెమెండెంగర్ మాట్లాడుతూ..‘ఈ సమ్మిట్లో ఎన్నో అద్భుతమైన ప్రాడక్ట్స్ ప్రదర్శించారు. ఇవన్నీ చూస్తుంటే కొద్ది రోజుల్లోనే మన కిచెన్లు స్మార్ట్గామారే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. Wife అయితే గరిటెను ఎలా అయినా వాడుతుంది. కానీ Wi-Fi మాత్రం గరిటెను స్మార్ట్ కిచెన్ కోసమే వాడుతుంది’ అన్నారు.
పడిలేసిన పసిడి.. మళ్ళీ తగ్గిన వెండి - కొత్త ధరలు ఇవే..
జూన్ 8న భారీగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు (జూన్ 11) స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. నేడు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయనే వివరాలు ఈ కథనంలో వివరంగా చూసేద్దాం..విజయవాడ, హైదరాబాద్లలో 10 గ్రాముల బంగారం ధరలు రూ.65850 (22 క్యారెట్స్), రూ.71840 (24 క్యారెట్స్) వద్ద ఉన్నాయి. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గినట్లు తెలుస్తోంది. ఇదే ధరలు బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో మాత్రమే కాకుండా గుంటూరు, ప్రొద్దుటూరు, వైజాగ్లలో కూడా కొనసాగుతాయి.ఢిల్లీలో ఈ రోజు ఒక తులం 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 66000 కాగా.. 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ. 71990 వద్ద ఉంది. ఈ ధరలు నిన్నటి కంటే రూ. 150, రూ. 170 ఎక్కువ.ఇక చెన్నై విషయానికి వస్తే.. బంగారం ధరలు వరుసగా రూ. 150, రూ. 170 తగ్గి.. రూ. 66450 (22 క్యారెట్స్ 10 గ్రామ్స్), రూ. 72490 (24 క్యారెట్స్ 10 గ్రామ్స్) వద్ద నిలిచాయి. ధరలు తగ్గినప్పటికీ.. ఇతర రాష్ట్రాలకంటే చెన్నైలో బంగారం ధరలు కొంత ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.వెండి ధరలుదేశంలో బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గు ముఖం పట్టాయి. దీంతో ఈ రోజు (జూన్ 11) ఒక కేజీ వెండి ధర రూ. 90500 వద్ద ఉంది. నిన్నటి ధరలతో పోలిస్తే ఈ రోజు ధరలు ఏకంగా రూ. 1200 తగ్గింది. దీన్ని బట్టి చూస్తే క్రమంగా పెరుగుతూ వెళ్లిన వెండి ధరలు కూడా ఒక్కసారిగా కిందకు పడుతున్నట్లు స్పష్టమవుతోంది.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి).
డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి పోలీసులకు చిక్కారా..? మీకోసమే ‘డిజీలాకర్’
ఏదైనా అత్యవసర సమయాల్లో ప్రయాణాలు చేసి డ్రైవింగ్ లైసెన్స్ మరిచిపోయి ట్రాఫిక్ పోలీసులకు పట్టుబడ్డారా..? బ్యాంకులో పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేసేపుడు అనుకోకుండా పాన్కార్డు మరిచిపోయారా..? టికెట్ రిజర్వేషన్ చేసుకొని ప్రయాణం చేసేపుడు ఆధార్కార్డు వెంట తెచ్చుకోవడం గుర్తులేదా..? కంగారు పడకండి. మీ కోసమే ఈ కథనం.నిత్యం ఏదో ఒక సందర్భంలో పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్..వంటి గుర్తింపుకార్డులు అవసరమవుతూ ఉంటాయి. నిత్యం ఫిజికల్గా వీటిని వెంటతీసుకెళ్లడం కుదరకపోవచ్చు. కానీ ఎంత అత్యవసరాల్లో అయినా మొబైల్ను మాత్రం దాదాపు గుర్తుంచుకుని తీసుకెళ్తుంటాం. మన చేతిలో ఉండే స్మార్ట్ఫోన్లో అన్ని గుర్తింపుకార్డులు డిజిటల్ రూపంలో ఉంటే ఎంత బాగుంటుందో కదా. అయితే, డిజీలాకర్ ఈ సదుపాయాన్ని కల్పిస్తోంది. అసలు ఈ లాకర్ ఏంటీ..? దీన్ని ఎలా వినియోగించాలో తెలుసుకుందాం.డిజీలాకర్ఇది కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఒక డిజిటల్ ప్లాట్ఫామ్. ఇందులో సర్టిఫికెట్లు, కీలకపత్రాలను సురక్షితంగా దాచుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు సులువుగా వినియోగించుకోవచ్చు. పదోతరగతి సర్టిఫికెట్ నుంచి ఆధార్కార్డు, పాన్కార్డు, రేషన్కార్డు.. ఇలా ప్రభుత్వం జారీ చేసిన అన్ని డాక్యుమెంట్లనూ డిజిటల్ రూపంలో దాచుకోవడానికి ఈ లాకర్ ఉపయోగపడుతుంది. జీవిత బీమా వంటి ముఖ్యమైన పత్రాలను ఇందులో దాచుకోవచ్చు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ మర్చిపోయి ట్రాఫిక్ పోలీసులకు చిక్కినా డిజీలాకర్లో ఉన్న పత్రాలు చూపించొచ్చు. ఇలా ఎక్కడైనా, ఎప్పుడైనా వీటిని వినియోగించుకోవచ్చు.వినియోగం ఇలా..ప్లేస్టోర్ నుంచి ఫోన్లో డిజీలాకర్ యాప్ను ఇన్స్టాల్ చేసుకోవాలి. పేరు, పుట్టిన తేదీ, ఈ-మెయిల్, ఫోన్ నంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే ఆరంకెల సెక్యూరిటీ పిన్ను వస్తుంది. దాన్ని సంబంధింత బ్లాక్లో ఎంటర్ చేయాలి. మీ ఆధార్కార్డ్ లింక్ అయిన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. దాన్ని ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే అకౌంట్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆధార్ నంబర్ లేదా ఆరంకెల సెక్యూరిటీ పిన్ సాయంతో లాగిన్ అవగానే మీ ఆధార్ కార్డు, పాన్కార్డు వివరాలు అందులో కనిపిస్తాయి. యాప్లో సెర్చ్ సింబల్పై క్లిక్ చేసి మీ రాష్ట్రాన్ని ఎంచుకోగానే పదోతరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికెట్ల లిస్ట్ ప్రత్యక్షమవుతుంది. వాటిలో మీ ప్రాంతం, యూనివర్సిటీకి సంబంధించిన ఆప్షన్ను ఎంచుకొని హాల్టికెట్ నంబర్, ఉత్తీర్ణత పొందిన సంవత్సరం ఎంటర్ చేసి డాక్యుమెంట్లు పొందొచ్చు. వీటితో పాటు రేషన్కార్డు..వంటి ప్రభుత్వ గుర్తింపుకార్డులను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవసరమైనపుడు ఆ డాక్యుమెంట్లను వినియోగించుకోవచ్చు.ఇదీ చదవండి: లోన్ కావాలా..? సిబిల్ స్కోర్ ఎంత ఉండాలంటే..ఇతర పత్రాలను ఎలా అప్లోడ్ చేయాలంటే..కేవలం ప్రభుత్వం అందించే డాక్యుమెంట్లే కాకుండా ఇతర విలువైన పత్రాలను డిజిటల్ రూపంలో ఈ లాకర్లో భద్రపరచుకోవచ్చు. డిజీలాకర్ యాప్లో సైన్-ఇన్ అవ్వగానే కిందకు స్క్రోల్ చేస్తే ‘డిజీలాకర్ డ్రైవ్’ అని ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ‘+’ సింబల్పై ప్రెస్ చేయాలి. మీకు కావాల్సిన డాక్యుమెంట్లను మాన్యువల్గా అప్లోడ్ చేసి స్టోర్ చేసుకోవచ్చు. గూగుల్ డ్రైవ్ మాదిరిగా అక్కడే ప్రత్యేక ఫోల్డర్లు కూడా క్రియేట్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. డిజీలాకర్లో ప్రతీ యూజర్కు 1 జీబీ క్లౌడ్ డేటా లభిస్తుంది. 10 ఎంబీ వరకు సైజ్ ఉన్న ఒక్కో ఫైల్ను స్టోర్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ సాయంతో ఎక్కడున్నా వీటిని యాక్సెస్ చేయొచ్చు.
యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామన్న మస్క్.. ఎందుకంటే..
ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంటే తన కంపెనీలో యాపిల్ ఉత్పత్తులను నిషేధిస్తామని టెస్లా అధినేత ఎలొన్మస్క్ హెచ్చరించారు. ఈమేరకు మస్క్ తన ఎక్స్ఖాతాలో పోస్ట్ చేశారు.కాలిఫోర్నియాలోని యాపిల్ ప్రధాన కార్యాలయంలో వరల్డ్వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2024ను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో యాపిల్ ఓపెన్ఏఐతో ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో ఎలొన్మస్క్ ఎక్స్వేదికగా స్పందించారు. ‘ఓపెన్ఏఐని యాపిల్ ఆపరేటింగ్ సిస్టమ్ స్థాయిలో ఏకీకృతం చేస్తే మాకంపెనీలో యాపిల్ పరికరాలను నిషేధిస్తాం. ఈ ఒప్పందాన్ని ఆమోదయోగ్యం కాని భద్రతా ఉల్లంఘనగా పరిగణిస్తాం. యాపిల్కు తన సొంత ఏఐను తయారుచేసుకునే సత్తాఉందని భావిస్తున్నాం. అయినా, ఓపెన్ఏఐ యాపిల్ భద్రతను, సమాచార గోప్యతను కాపాడుతుందని ఎలా భరోసా ఇవ్వగలరు’ అని పోస్ట్చేశారు.కన్సల్టింగ్ సంస్థ క్రియేటివ్ స్ట్రాటజీస్ సీఈఓ బెన్ బజారిన్ మాట్లాడుతూ..‘ప్రైవేట్ క్లౌడ్లో కస్టమర్ల డేటా సురక్షితంగా ఉంటుందని తెలియజేయడానికి యాపిల్ ప్రయత్నిస్తోంది. ప్రైవేట్ క్లౌడ్లో ఫైర్వాల్ ద్వారా వినియోగదారుల సమాచారం దుర్వినియోగమయ్యే అవకాశం ఉంది. అలా జరుగుతున్నపుడు యాపిల్కు కూడా సరైన సమాచారం ఉండదు’ అన్నారు.ఇదీ చదవండి: టెన్షన్ పడుతూ లవ్ప్రపోజ్ చేసిన సుందర్పిచాయ్2015లో ఎలొన్మస్క్, సామ్ఆల్ట్మాన్ కలిసి ఓపెన్ఏఐను స్థాపించారు. లాభాపేక్ష లేకుండా మానవాళి ప్రయోజనం కోసం ఏఐను అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించినట్లు మస్క్ చెప్పారు. కానీ అందుకు విరుద్ధంగా కార్యకలాపాలు సాగుతున్నాయని కంపెనీ నుంచి బయటకు వచ్చి సీఈవో సామ్ఆల్ట్మాన్పై మస్క్ దావా వేశారు. ఓపెన్ఏఐకి పోటీగా, చాట్జీపీటీ చాట్బాట్కు ప్రత్యామ్నాయంగా మస్క్ ఎక్స్ఏఐను రూపొందించారు.If Apple integrates OpenAI at the OS level, then Apple devices will be banned at my companies. That is an unacceptable security violation.— Elon Musk (@elonmusk) June 10, 2024
వీడియోలు
వైఎస్ జగన్ ను కలిసిన మాజీ మంత్రులు
మిర్యాలగూడ గ్యాంగ్ వార్ లపై డి.ఎస్ .పి సీరియస్ వార్నింగ్
గోదావరిలో దూకి కుటుంభం తో సహా ఆత్మహత్య యత్నం
రెండు వైపుల ఉన్న కత్తి తో నాపై దాడి
పిల్లోడి ప్రాణాలు తీసేంత కక్ష మరి రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు
సీఎం చంద్రబాబు.. ఏకగ్రీవం
కేసీఆర్ కు నోటీసులు
పార్లమెంట్ సమావేశాలు
BJLP నేత ఎవరు..?
మాజీ డిప్యూటీ మేయర్ ఇంటిపై దాడి..
ఫ్యామిలీ
అపుడేమో కోపంతో విడాకులు : పుష్కర కాలానికి మళ్లీ ప్రేమ,కన్నీళ్లు.. కట్ చేస్తే!
సాధారణంగా ఇక కలిసి జీవించడం అసాధ్యం అనుకున్నపుడు మాత్రమే భార్యభర్తలు విడిపోయేందుకు నిర్ణయం తీసుకుంటారు. ఎపుడైనా, ఎక్కడైనా తారసపడినా కూడా ఒకర్నొకరు పట్టించుకోరు. అంటీ ముట్టనట్టే ఉంటారు. కనీసం పలకరించు కోరు కూడా (అయితే భార్యభర్తలుగా విడిపోయిన తరువాత కూడా, హుందాగా, స్నేహంగా ఉంటున్నజంటలు కూడా చాలానే ఉన్నాయి). కానీ విడాకులు తీసుకున్న పుష్కరకాలం తరువాత కలిసి మళ్లీ ఒక్కటయ్యారు. యూపీలోని రాంపూర్లో ఈ ఆసక్తికర ఉదంతం చోటు చేసుకుంది.యూపీలోని ఇమ్రతా గ్రామానికి చెందిన అధికారి అలీకి రాంపూర్కు చెందిన అమ్మాయితో 2004లో వివాహం జరిగింది. వీరికి ముగ్గురు కుమార్తెలు , ఒక కుమారుడు పుట్టారు. అయితే వీరి మధ్య తలెత్తిన విబేధాలు తారా స్థాయికి చేరడంతో పెళ్లయిన 8 ఏళ్లకు విడాకులు తీసుకున్నారు. అమ్మాయి తల్లి వద్ద, కొడుకులిద్దరూ తండ్రి వద్ద పెరుగుతున్నారు. ఇద్దరూ మరో పెళ్లి చేసుకోకుండా, పిల్లలే ప్రాణంగా జీవితాన్ని సాగిస్తున్నారు.అయితే దాదాపు 12 ఏళ్ల తరువాత, ఒక పెళ్లి వేడుక వారి జీవితాన్నే మార్చేసింది. ఈ పెళ్లిలో అనుకోకుండా ఒకరినొకరు ముఖాముఖి కలుసు కున్నారు. అలీ, అతని భార్య ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏదో తెలియని భావోద్వేగానికి లోనయ్యారు. భర్త కళ్లలో నుంచి నీళ్లు కారడం చూసిన భార్య కూడా చలించిపోయింది. తర్వాత ఇద్దరూ మాట కలిపారు. ఒకరి నంబర్లు మరొకరు తీసుకుని ఫోన్లో మాట్లాడుకోవడంమొదలెట్టారు. ఒకరి బాధల్ని మరొకరు మనస్ఫూర్తిగా పంచుకున్నారు.తమ మధ్య ప్రేమ పదిలంగాగానే ఉందని, క్షణికావేశంతో వేసిన అడుగు తప్పని తొందర పడ్డామని పశ్చాత్తాపపడి మళ్లీ కలిసి జీవించాలని నిర్ణయించుకున్నారు. మొత్తానికి ఒక శుభముహూర్తాన ఇద్దరూ పెళ్లితో మళ్లీ ఒక్కటయ్యారు. అంతే కాదు ‘స్వీట్ ఫ్యామిలీ’ అనుకుంటూ ఉత్తరాఖండ్ పర్యటనకు చెక్కేసారు.
అల్జీమర్ వ్యాధికి దానిమ్మ చెక్ పెట్టగలదా?
అల్జీమర్స్ వ్యాధిని న్యూరోడిజెనరేటివ్ డిజార్డర్ అని అంటారు. దీని కారణంగా జ్షాపక శక్తి క్షీణించిపోతుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే దీన్ని తీవ్రమైన మతిమరుపుగా పేర్కొనవచ్చు. దీని కారణంగా రోజు వారి కార్యకలాపాలు కూడా సరిగా నిర్వహించలేరు బాధితులు. ఇది ఎక్కువగా 65 ఏళ్లు పైబడిన వారిలో కనిపిస్తుంటుంది. ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించగలమే గానీ పూర్తిగా నివారించలేం. అయితే తాజాగా యూనివర్సిటీ ఆఫ్ కోపనహాగన్, యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా పరిశోధకులు చేసిన అధ్యయనంలో అల్జీమర్స్ వ్యాధికి చెక్ పెట్టడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా ఉంటుందని వెల్లడించారు. వారి అధ్యయనంలో దానిమ్మ పండు గుణాలకు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. అల్జీమర్లో వ్యాధిని చికిత్స చేయండంలో 'యురోలిథిన్ ఏ' కీలమకమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు నుంచి దెబ్బతిన్న మైటోకాండ్రియాను తొలగించడంలో యూరోలిథిన్ ఏ అనేది కీలక పాత్ర పోషిస్తుందని గుర్తించారు పరిశోధకులు. ఇక్కడ యూరోలిథిన్ ఏ అనేది ఎల్లాజాటానిన్ల సమ్మేళనం. ఈ ఎల్లాజాటానిన్లు సమ్మెళనాలు అధికంగా దానిమ్మలో ఉంటాయి. దీన్ని ఆహారంగా తీసుకున్నప్పుడూ గట్ బ్యాక్టీరియా ద్వారా రూపాంతరం చెంది 'యురోలిథిన్ ఏ'ను ఉత్పత్తి చేస్తాయి. ఇది మైటోకాండ్రియా పనితీరుని మెరుగుపరిచి కండరాల ఆరోగ్యాన్ని కాపాడుతుందని పరిశోధన పేర్కొంది.ఈ దానిమ్మలో పాలీఫైనాల్స్, ప్యూనికాలాజిన్స్, ఆంథోసైనిన్స్పు పుష్కలంగా ఉంటాయి. ఇవి శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్లు. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గిస్తాయి. ముఖ్యంగా అల్జీమర్స్ వంటి న్యూరోడెజనరేటివ్ వ్యాధులను నయం చేయడంలో తోడ్పడతాయని పరిశోధనలో తేలింది. ఈ పండులో సీ, కే, ఫోలేట్ వంటి విటమిన్లు కూడా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ప్రీ రాడికల్స్ , యాంటీ ఆక్సిడెంట్ల మధ్య అసమతుల్యత కారణంగా ఆక్సీకరణ ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది సెల్ డ్యామేజ్కు దారితీస్తుంది. నూర్యాన్ల క్షీణతలో ఆక్సీకరణ ఒత్తిడి ప్రధాన అంశం. ఈ దానిమ్మలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తటస్టీకరించి మెదడు కణాలు దెబ్బతినకుండా కాపాడుతుందని పరిశోధకులు తెలిపారు.అల్జీమర్స్ను తీవ్రతరం చేసే అమిలాయిడ్ బీటా ఫలకాల నిక్షేపణలను తగ్గించడంలో దానిమ్మపండు ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించారుఅంతేగాదు ఈ దానిమ్మ పండు అల్జీరమర్స్ వ్యాధిపి సమర్థవంతంగా నియంత్రిస్తుందా? లేదా అని చేసిన అధ్యయనంలో మంచి పలితాలు వచ్చాయని చెబుతున్నారు పరిశోధకులు. అందుకోసం తాము వృద్ధుల జ్ఞాపకశక్తిపై అధ్యయనం నిర్వహించగా..వారిలో గణనీయమైన మెరుగదల కనిపించిందని తెలిపారు. ఈ అధ్యయనం న్యూరోబయాలజీ ఆఫ్ ఏజింగ్ జర్నల్లో ప్రచురితమయ్యింది.అంతేగాదు ఈ దానిమ్మలో ఉండే విటమిన్లు ఇన్ఫ్లమేటరీ మార్గాలను నిరోధిస్తాయి. ప్రో-ఇన్ఫ్లమేటరీ సైటోకిన్ల స్థాయిలను తగ్గించి, న్యూరోఇన్ఫ్లమేషన్ను నివారిస్తాయి.పైగా దీనిలోని సమ్మేళనాలు కొత్త న్యూరాన్ల పెరుగుదలను ప్రోత్సహించి జ్ఞాపకశక్తి పనితీరుని మెరుగ్గా ఉంచుతుంది. అంతేగాదు దీనిలో ఉండే విటమిన్లు, ఫైబర్లు మొత్తం ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచేలా చేసి దీర్ఘాయువుని అందిస్తుంది.(చదవండి: కూర్చొని వర్సెస్ నిలబడి: ఎలా తింటే బెటర్?)
ఢిల్లీ మెట్రోలో మరోసారి అమ్మాయిల రచ్చ: వీడియో వైరల్
సోషల్ మీడియా పిచ్చితో మెట్రో రైళ్లలో కొంతమంది తీరు అభ్యంతరకరంగా, తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారుతుంది. గతంలో వెలుగులోకి వచ్చిన ఘటనలు మరిచిపోకముందే, తాజాగా ఢిల్లీ మెట్రోలో అమ్మాయిలు డ్యాన్స్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.इन रील्स वालों के लिए एक दो मेट्रो कही साइड में खड़ी कर दो यार जहां देखो वहां चालू हो जाते है । #DelhiMetro में तो ये चल ही रहा है कही #MumbaiMetro में भी ये चालू न हो जाए pic.twitter.com/l8pzDHKxpy— Mahendra Singh (@mahendrasinh280) June 11, 2024సోషల్ మీడియాలో యూజర్ల రీల్స్తో గతంలో ఢిల్లీ మెట్రో వార్తల్లో నిలిచింది. ఈ నేపథ్యంలో మెట్రోలో రీల్స్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ యువతీ యువకుల ఆకతాయి పనులకు అడ్డుకట్ట పడటం లేదు. ఢిల్లీ మెట్రోలో ఇద్దరు యువతులు కలిసి డ్యాన్సింగ్ వీడియోనే ఇందుకు ఉదాహరణ. తోటి ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉంటుందన్న కనీస స్పృహను కూడా మర్చిపోయిన అమ్మాయిలు భోజ్పురి పాటకి రాడ్ పక్కన నిలబడి స్టెప్పు లేశారు. దీంతో కొంతమంది ప్రయాణీకులు చూసీ చూడనట్టు కొందరు, మరి కొందరు అసహనం వ్యకం చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ఎక్స్లో పోస్ట్ అయింది. మహేంద్ర సింగ్ అనే ఎక్స్ యూజర్ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఈ రీల్స్ చేసేవాళ్ల కోసం ఒకటి రెండు మెట్రోలు సైడ్కి నిలపండి రా బాబూ, ఎక్కడ చూసినా ఈ రీల్స్ గోలే.. ఈ జాడ్యం ముంబై మెట్రోకి కూడా విస్తరించకూడదు అంటూ అసహనం వ్యక్తం చేశారు.
మెథడ్ డ్రెస్సింగ్ ట్రెండ్.. ఈ బ్యూటీ ఫ్యాషన్ టాలెంట్ అదుర్స్ (ఫోటోలు)
న్యూస్ పాడ్కాస్ట్
ప్రధాని కార్యాలయం మోదీ పీఎంవో కాదు, అది ప్రజా పీఎంవో అని మోదీ ఉద్ఘాటన.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం... 72 మందితో కొలువుదీరిన నూతన మంత్రివర్గం, ఆంధ్రప్రదేశ్కు 3, తెలంగాణకు 2 పదవులు.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా నేడే నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం.. మంత్రివర్గం కూర్పుపై కొనసాగుతున్న కసరత్తుతి.. ఇంకా ఇతర అప్డేట్స్
ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి.. గవర్నర్ జోక్యం చేసుకోవాలి.. వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి.. ఇంకా ఇతర అప్డేట్స్
ప్రధానమంత్రిగా ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోదీ... నేడు ఎన్డీఏ ఎంపీల సమావేశం.. ఇంకా ఇతర అప్డేట్స్
ఎన్డీయే నేతగా నరేంద్ర మోదీ ఏకగ్రీవ ఎన్నిక.. శనివారం లేదా ఆదివారం ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం.. ఇంకా ఇతర అప్డేట్స్
లోక్సభ ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించిన ఎన్డీయే.. బీజేపీకి కూటమికి 292 స్థానాలు, ఇండియా కూటమికి 234 స్థానాలు.. 240 సీట్లకే పరిమితమైన బీజేపీ, మెజారిటీ కంటే 32 స్థానాలు తక్కువ.. 99కి పెరిగిన కాంగ్రెస్ బలం.. ఇంకా ఇతర అప్డేట్స్
నేడే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు.. ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఫలితాలు కూడా ఈరోజే వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి, రీప్లేస్మెంట్ మనమే.. తెలంగాణ దశాబ్ది వేడుకల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వెల్లడి.. ఇంకా ఇతర అప్డేట్స్
కేంద్రంలో ఎన్డీఏ హ్యాట్రిక్, 350 నుంచి 400 స్థానాలు ఖాయం, తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ, ఆంధ్రప్రదేశ్లో మరోసారి వైఎస్సార్సీపీ ప్రభంజనం... ఎగ్జిట్ పోల్స్ అంచనా.. ఇంకా ఇతర అప్డేట్స్
క్రైమ్
ఘోరం.. అంత్యక్రియలకు అడ్డుపడ్డ ఆ నలుగురు!
యాదాద్రి భువనగిరి జిల్లా: రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావు? అంటే… రూపాయి రూపాయి నువ్వు ఏం! చేస్తావు? అని అడిగితే! హరిశ్చంద్రుని చేత అబద్ధం ఆడిస్తాను, భార్య-భర్తల మధ్యన చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలను విడదీస్తాను. అన్నదమ్ముల మధ్య వైరం పెంచుతాను. ఆఖరుకు.. ప్రాణ స్నేహితులను కూడా విడగొడ్తాను అందట. యాదాద్రి భువనగిరి జిల్లాలో తాజాగా జరిగిన ఘటన అది నిజమేనని నిరూపించింది. అయినవాళ్లే వేధిస్తుండడంతో తట్టుకోలేక ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకుంటే.. అతనికి అంత్యక్రియలు నిర్వహించకుండా ఆ అయినవాళ్లే అడ్డుకోవడంతో మూడు రోజులుగా ఆ మృతదేహం మార్చురీలోనే మగ్గుతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగికి చెందిన చీరిక హనుమంతరెడ్డి(48) హైదరాబాద్లో ప్రైవేటు బస్సు డ్రైవర్గా పనిచేస్తూ... అక్కడే అద్దె ఇంట్లో ఉండేవారు. హనుమంతరెడ్డి తండ్రి నర్సిరెడ్డి పేరిట 7.24 ఎకరాల భూమి ఉంది. పోస్ట్మాస్టర్గా ఉద్యోగ విరమణ చేసిన నర్సిరెడ్డి... మూడేళ్ల క్రితం వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు.ఈలోపు తండ్రి ఆస్తిలో తమకూ వాటా కావాలని హనుమంతరెడ్డి తోబుట్టువులు కోర్టును ఆశ్రయించారు. తమ్ముడు కరుణాకర్రెడ్డితోనూ హనుమంతరెడ్డికి ఆస్తి తగాదాలున్నాయి. ఈ నేపథ్యంలో కొద్దిరోజులుగా మానసిక వేదనతో ఉన్న హనుమంతరెడ్డి శనివారం రాత్రి పంతంగిలోని ఇంటికి వచ్చి ఉరి వేసుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున పక్కింట్లో ఉన్న వారు చూసి పోలీసులకు సమాచారమివ్వడంతో విషయం వెలుగు చూసింది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే, తన భర్త మృతికి ఆడపడుచులు, మరిదే కారణమని హనుమంతరెడ్డి భార్య స్వప్న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ముగ్గురిపై కేసు నమోదైంది. దీంతో భయపడ్డ ఇద్దరు చెల్లెళ్లు, తమ్ముడు... ఆ కేసును ఉపసంహరించుకోవాలని గ్రామ పెద్దలు, బంధువుల ద్వారా హనుమంతరెడ్డి భార్యపై ఒత్తిడి తెచ్చారు. ఆస్తి విషయమై కోర్టులో ఉన్న కేసును ఉపసంహరించుకుంటేనే అంత్యక్రియలు నిర్వహిస్తామని హనుమంతరెడ్డి భార్య స్వప్న, బంధువులు భీష్మించారు. ఆది, సోమ వారాల్లో అతడి సోదరుడు, చెల్లెళ్లతో బంధువులు చర్చించారు. కేసు ఉపసంహరణకు వారు ఒప్పుకొన్నా.. సోమవారం కోర్టు సమయం మించిపోవడంతో వీలు కాలేదు. మంగళవారం కేసు ఉపసంహరించుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించేందుకు బంధువులు ఏర్పాట్లు చేస్తున్నారు.
విజయనగరం: ఆ ఆర్టీసీ డ్రైవరన్న టైమింగ్.. దెబ్బకు స్మగ్లర్లు పరార్
విజయనగరం: గుర్తుతెలియని వ్యక్తులు బస్సులో విడిచిపెట్టి వెళ్లిన గంజాయితో కూడిన రెండు బ్యాగులను దత్తిరాజేరు మండలం పెదమానాపురం పోలీస్ స్టేషన్కు ఆర్టీసీబస్సు డ్రైవర్ పి.గణపతి సోమ వారం అప్పగించారు. ఎస్ఐ శిరీష తెలిపిన వివరాల ప్రకారం.. సాలూరు నుంచి వైజాగ్ వెళ్తున్న ఆర్టీసీ డీలక్స్ బస్సులో రామభద్రాపురం వద్ద ఇద్దరు వ్యక్తులు ఎక్కారు. పెదమానాపురం వద్దకు వచ్చేసరికి బస్సులో ఎంత మంది ఉన్నారో ఆర్టీసీ సిబ్బంది లెక్కిస్తున్న సమయంలో వారు టిక్కెట్లు తీయలేదని గమనించి నిలదీశారు. వారు వెంటనే బస్సుదిగి పారిపోయారు. ప్రయాణికులతో కలిసి వారు తెచ్చిన బ్యాగులు తెరిచి చూడగా గంజాయి ఉన్నట్టు గమనించారు. వెంటనే బస్సును స్టేషన్ వద్ద ఆపి గంజాయిని ఆర్టీసీ డ్రైవర్ అప్పగించారు. తహసీల్దార్ సుదర్శన్, వీఆర్వో ఆధ్వర్యంలో బ్యాగులో ఉన్న గంజాయిని తూకంవేసి 14.3 కేజీలు ఉన్నట్టు నిర్ధారించారు. గంజాయిని సీజ్ చేసి పరారైన వ్యక్తుల కోసం గాలిస్తున్నామని ఎస్ఐ తెలిపారు.
లండన్లో కోనూరు విద్యార్థి మృతి
పల్నాడు జిల్లా: మండల పరిధిలోని కోనూరు గ్రామానికి చెందిన గుంటుపల్లి సాయిరాం (25) ఈ నెల 2న లండన్లోని మాంచెస్టర్లో గల పాకిస్తాన్ పోర్ట్ బీచ్లో మృతి చెందాడు. ఈ విషయం స్థానిక పోలీసుల ద్వారా సోమవారం తల్లిదండ్రులకు తెలిసింది. రాష్ట్ర పోలీస్ ఎన్ఆర్ఐ సెల్ సీఐడీ విభాగం నుంచి అచ్చంపేట పోలీస్ స్టేషన్ కు సమాచారం రావడంతో అచ్చంపేట పోలీసులు విషయాన్ని తమకు తెలియచేసినట్లు కోనూరులో ఉంటున్న సాయి తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు తెలిపారు.తమ కుమారుడు బీటెక్ విజయవాడలోని కె.ఎల్.యూనివర్సిటీలో పూర్తిచేసి లండన్లో జాబ్ చేస్తూ ఎంటెక్ చదివేందుకు 2021లో వెళ్లినట్లు తెలిపారు. ఈ నెల 2న బీచ్లో మృతి చెందినట్లు పోలీసుల ద్వారా తెలుసుకున్నామన్నారు. అయితే ఎందువల్ల మృతి చెందాడో విషయం తమకు తెలియదన్నారు. మృతదేహాన్ని తెప్పించండి తమ కుమారుడు సాయిరాం మృతదేహాన్ని తమ స్వగ్రామమైన కోనూరుకు తెప్పించేందుకు భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చొరవ చూపాలని తల్లిదండ్రులు గుంటుపల్లి ఏడుకొండలు, అన్నపూర్ణలు కోరుతున్నారు.
అయ్యో పాపం అనుకుంటే.. పోలీసులకే షాకిచ్చాడు!
హన్మకొండ, సాక్షి: చనిపోయాడనుకున్న వ్యక్తి ఒక్కసారిగా లేచి మాట్లాడితే.. ఆ షాక్ ఎలా ఉంటుందో ఉహించుకోండి. అలాంటి ఘటనే వరంగల్ నగరంలో చోటుచేసుకుంది. కుంటలో ఓ మృతదేహం తేలియాడుతున్నదన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లిన పోలీసులు.. ఆ వ్యక్తిని బయటికి లాగుతుండగా సదరు వ్యక్తి లేచి మాట్లాడడం చూసి షాక్కు గురయ్యారు. శ్రీకాకుళం జిల్లా కావలికి చెందిన శ్రీనివాస్ కాజీపేటలోని ఓ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్నాడు. అతనితో పాటు మరో ఇద్దరు సోమవారం చిత్తుగా మద్యం సేవించి నగరంలోని రెడ్డిపురంలోని కోవెలెకుంటకు వెళ్లారు. అక్కడ కొంతసేపు కుంటలోకి దిగారు. మద్యం మత్తులో శ్రీనివాస్ కొంత ఒడ్డు మేరలో నిద్ర పోయాడు. శ్రీనివాస్ మృతి చెందినట్లుగా భావించిన వారు అక్కడినుంచి జారుకున్నారు. ఆ తర్వాత స్థానికులు ఓ వ్యక్తి మృతదేహం నీటిలో తేలియాడుతున్నట్లు గమనించి 108 అంబులెన్స్, పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అంబులెన్స్తోపాటు కాకతీయ యూనివర్సిటీ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కుంట లోతుగా ఉన్నట్లు భావించిన పోలీసులు ఒకరిచేయి మరొకరు పట్టుకుని తేలియాడుతున్న ఆ వ్యక్తిని బయటికి లాగేందుకుప్రయత్నిస్తున్న క్రమంలో అతనే నేరుగా లేచి నిల్చున్నారు. దీంతో ఒక్కసారిగా అందరూ షాక్కు గురయ్యారు. బయటికి తీసుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. కుంటలో చల్లదనానికి నిద్ర వచ్చనట్లు సదరు వ్యక్తి పోలీసులకు చెప్పాడు. తనకు రూ.50 ఇస్తే కాజీపేటకు వెళ్తానని చెప్పడంతో పోలీసులు అతనికి డబ్బులు ఇచ్చి పంపించి వేశారు. తాగి నీటిలో పడుకున్న వ్యక్తి.. చనిపోయాడనుకొని పోలీసులకు ఫోన్ చేసిన స్థానికులు.. తీరా వచ్చి చూస్తే షాక్ హనుమకొండ - రెడ్డిపురం కోవెలకుంటలో ఓ వ్యక్తి ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి 12 గంటల వరకు నీటిలోనే ఉన్నాడు.. అది గమనించిన స్థానికులు కేయూ పోలీసులకు మరియు 108 సిబ్బందికి సమాచారం… pic.twitter.com/zzR7SGbFwP— Telugu Scribe (@TeluguScribe) June 10, 2024 VIDEO CREDITS: Telugu Scribe