Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Wed, Jan 10 2018 8:59 AM

normal rush in tirumala

సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

స్వామివారిని మంగళవారం 61,679 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2,23 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement