తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం | Sakshi
Sakshi News home page

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

Published Sat, Jan 13 2018 8:16 AM

normal rush in tirumala

సాక్షి, తిరుపతి: తిరుమలలో  శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మొత్తం 5 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది.

శుక్రవారం శ్రీవారిని 55,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.
 

Advertisement
Advertisement