సాక్షి, చిత్తూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 47వ రోజు ప్రజాసంకల్పయాత్ర ముగిసింది. శనివారం సాయంత్రం రామిగానివారిపల్లె వద్ద ఆయన తన పాదయాత్రను ముగించారు. వైఎస్ జగన్ ఇవాళ 14.3 కిలోమీటర్ల మేర నడిచారు. వసంతపురం, ఉప్పులురువాండ్లపల్లె, జి.కొత్తపల్లి క్రాస్, గోపిదిన్నె, బైరెడ్డివారికోట, తంబళ్లపల్లి, బదలవాండ్లపల్లి, రామిగానివారిపల్లె వరకూ సాగింది.
48వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 48వ రోజు పాదయాత్ర మూలపల్లి క్రాస్ నుంచి మొదలు అవుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం తెలిపారు. ఆదివారం ఉదయం 8 గంటలకు మూలపల్లి క్రాస్ నుంచి మొదలై ఎర్రసానిపల్లి, ఎద్దులవారిపల్లి, కన్నెమడుగు, కె.రామిగానివారిపల్లి, రేణుమాకులపల్లి క్రాస్, తిమ్మయ్యగారిపల్లి, పరదేశిపల్లి, దాదంవారిపల్లి, తుపల్లి క్రాస్ మీదగా ముడివీడు వరకూ కొనసాగనుంది.