సాక్షి, చెన్నై: చెన్నైలో దారుణం చోటుచేసుకుంది. అప్పటివరకు తోటి స్నేహితులతో కలిసి ఆడిపాడిన పదేళ్ల చిన్నారి అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు.. చెన్నై కాశీమేడుకు చెందిన మత్స్యకారుడు ప్రకాష్ (40), మాలిని (35) దంపతుల కుమార్తె జెసికా (10) ఐదో తరగతి చదువుతోంది. కాగా శుక్రవారం సాయంత్రం స్నేహితులతో కలిసి సముద్ర తీరంలో ఆడుకునేందుకు జెసికా బయటికి వెళ్లింది. ఈ క్రమంలో సమీపంలోని అమ్మవారి ఆలయంలో వేడుకలు చూసేందుకు జెసికా తల్లిదండ్రులు బయల్దేరుతూ.. ఆమె కోసం చూడగా కనిపించలేదు. దీంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదుచేశారు. జెసికా కోసం వెదికుతున్న క్రమంలో.. కాశీమేడు సముద్రపు నీటి ఒడ్డున ఆమె స్పహతప్పి పడి ఉన్నట్లు కనుగొన్నారు. ఆస్పత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలోనే జెసీకా ప్రాణాలు విడిచింది. కాశీమేడు పరిసరాల్లో మాదకద్రవ్యాలు తీసుకునే యువకులే చిన్నారిపై అత్యాచారం చేసి సముద్రంలోకి విసిరేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు తరలించారు.
Published Sat, Sep 8 2018 8:56 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
తప్పక చదవండి
- బీజేడీ కంచుకోటను బద్దలు కొట్టేలా.. బీజేపీ ఎన్నికల ప్రచారం
- క్యాస్టింగ్ కౌచ్పై రమ్యకృష్ణ కామెంట్స్.. కొన్నిసార్లు తప్పదంటూ!
- ‘ప్రజ్వల్ రేవణ్ణ’ వీడియోల వెనుక కుట్ర: హెచ్డి కుమారస్వామి
- 25 వేల మంది టీచర్ల నియామకం రద్దుపై సుప్రీం స్టే
- యువీ, ధావన్ కాదు!.. నాకిష్టమైన ప్లేయర్లు వాళ్లే!
- ‘నేను దేశాన్ని విడిచి వెళ్లాలా?’.. బెంగళూరుపై ఆంత్రప్రెన్యూర్ అసహనం
- అమోథీ.. రాహుల్, ప్రియాంకల సంపద
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- T20 WC: బుమ్రాకు విశ్రాంతి?.. పొలార్డ్ కీలక వ్యాఖ్యలు
Advertisement