కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌: ముగ్గురు మిలిటెంట్ల హతం | Sakshi
Sakshi News home page

కాశ్మీర్‌ ఎన్‌కౌంటర్‌: ముగ్గురు మిలిటెంట్ల హతం

Published Tue, Dec 5 2017 9:33 AM

3 LeT militants killed in encounter in south Kashmir - Sakshi

సాక్షి,శ్రీనగర్‌: ఈ ఏడాది అమర్‌నాథ్‌ యాత్రికులపై దాడికి బాధ్యులుగా భావిస్తున్న ముగ్గురు లష్కరే ఉగ్రవాదులు మంగళవారం దక్షిణ కాశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరణించినట్టు పోలీసులు వెల్లడించారు. కాల్పుల ఘటన నుంచి తప్పించుకున్న మరో మిలిటెంట్‌ను అనంత్‌నాగ్‌ జిల్లాలోని ఓ మెటర్నిటీ ఆస్పత్రి నుంచి అరెస్ట్‌ చేసినట్టు పోలీసులు తెలిపారు.

జమ్మూ శ్రీనగర్‌ హైవేపై వెళుతున్న ఆర్మీ కాన్వాయ్‌పై కాజీగండ్‌ వద్ద మిలిటెంట్లు కాల్పులు జరపడంతో పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో ఓ మిలిటెంట్‌ హతమయ్యాడు. ఈ క్రమంలో భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని గాలింపు చర్యలు చేపట్టడంతో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుందని పోలీసులు చెప్పారు. సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం తెల్లవారుజాము వరకూ ఎన్‌కౌంటర్‌ కొనసాగినట్టు సమాచారం. మరణించిన మిలిటెంట్లను యావర్‌ బాసిర్‌, అబు ఫర్ఖన్‌, అబు మవియలుగా గుర్తించారు. 

Advertisement
Advertisement