పోలీసుల అదుపులో గగారిన్‌ హత్య కేసు నిందితులు | Sakshi
Sakshi News home page

పోలీసుల అదుపులో గగారిన్‌ హత్య కేసు నిందితులు

Published Tue, Nov 27 2018 3:13 PM

Accused In Gagarin Murder Case In Police Custody - Sakshi

విజయవాడ: నగరానికి చెందిన ఫైనాన్స్‌ వ్యాపారి దేవరపల్లి గగారిన్‌ హత్య కేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  ఈ కేసులో ప్రధాన నిందితులు మద్దాల సుధాకర్‌, మద్దాల సురేష్‌లు ఓ ప్రైవేటు ఛానల్‌ కార్యాలయంలోకి వెళ్తుండగా సూర్యారావుపేట పోలీసులు అరెస్ట్‌ చేశారు. విజయవాడలోని గవర్నర్‌ పేట సమీపంలో గత శుక్రవారం దేవరపల్లి గగారిన్‌ అనే వ్యక్తిపై ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు పెట్రోలు పోసి నిప్పంటించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన గగారిన్‌ను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం అర్ధరాత్రి మృతిచెందారు. మద్దాల సురేష్‌, మద్దాల సుధాకర్‌ అనే వ్యక్తులు తనపై పెట్రోలు పోసి నిప్పంటించారని వాంగూల్మంలో బాధితుడు చనిపోయేముందు చెప్పినట్లు తెలిసింది.

విజయవాడలో దారుణం.. పెట్రోల్‌ పోసి నిప్పంటించారు

విజయవాడలో విషాదం.. గగారిన్‌ మృతి 

Advertisement

తప్పక చదవండి

Advertisement