పోలీసులను నిర్భందించిన మహిళలు | Sakshi
Sakshi News home page

పోలీసులను నిర్భందించిన మహిళలు

Published Sun, Sep 9 2018 12:46 PM

AP Police Detained By Women Tamil Nadu Villupuram - Sakshi

సాక్షి, చెన్నై : తనఖీల నిమిత్తం గ్రామంలోకి ప్రవేశించిన పోలీసులను మహిళలు నిర్భందించిన ఘటన తమిళనాడులోని విల్లూపురంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శనివారం ఆంధ్రప్రదేశ్‌ కడప జిల్లాకు చెందిన పోలీసు బృందాలు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకోవటానికి తమిళనాడులోని విల్లూపురం వెళ్లారు. విల్లూపురంలోని కలవరియన్‌ కొండల్లో అర్థరాత్రి తనఖీలు చేపట్టారు.

కొద్ది సేపటి తర్వాత గ్రామంలోని మహిళలు పోలీసులను చుట్టుముట్టి నిర్భందించారు. ఏపీ పోలీసులను నిర్భందించారన్న సమాచారం అందుకున్న తమిళనాడు పోలీసులు అక్కడి చేరుకున్నారు. మహిళలకు సర్ది చెప్పి వారిని విడిపించారు. ఎట్టకేలకు తమిళనాడు పోలీసుల సహకారంతో ఏపీ పోలీసులు సురక్షితంగా బయటకు రాగలిగారు.

Advertisement
Advertisement