తిరువొత్తియూరు: శంకరన్కోయిల్ సమీపంలో బాలికపై దాడిచేసి హత్య చేసిన అన్నను పోలీసులు అరెస్టు చేశారు. దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించి తీవ్రంగా గాయపడిన అవ్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. నెల్లై జిల్లా శంకరన్ కోయిల్ సమీపం గురువిగులా, కీళ్ అళగు నాచ్చియార్ పురానికి చెందిన బాలుడు (15) అక్కడున్న పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. గత రెండు నెలలుగా మానసిక రుగ్మతతో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి భోజనం చేసి కుటుంబ సభ్యులు నిద్రించారు.
ఆ సమయంలో హఠాత్తుగా నిద్రమేల్కొన్న బాలుడు ఆవేశంలో కలుపు తీసే పనిముట్టుతో నిద్రిస్తున్న చెల్లెలు (7) పై దాడి చేశాడు. ఈ ఘటనలో చిన్నారి అదే స్థలంలో మృతి చెందింది. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన అవ్వ తీవ్రంగా గాయపడింది. కుటుంబసభ్యులు ఆమెను చికిత్స కోసం శంకరన్ కోయిల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. దీనిపై సమాచారం అందుకున్న కురివి కులం పోలీసులకు కేసు నమోదు చేసి బాలిక మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి విద్యార్థిని అరెస్టు చేశారు.