తిరుపతిలో నడిరోడ్డుపై దారుణ హత్య | Sakshi
Sakshi News home page

తిరుపతిలో నడిరోడ్డుపై దారుణ హత్య

Published Mon, Oct 9 2017 10:54 AM

 brutally murdered in tirupati

సాక్షి, తిరుపతి: తిరుపతి పట‍్టణంలో సోమవారం ఉదయం గుర్తు తెలియని దుండగులు ఒక వ్యక్తిని రోడ్డుపై దారుణంగా నరికి చంపారు. పెద్దకాపువీధికు చెందిన సత్యనారాయణ వాకింగ్  చేస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి కత్తులతో నరికి పరారయ్యారు.  గమనించిన స్ధానికులు రక‍్తపు మడుగులో పడిఉన‍్న సత‍్యనారాయణను రుయా ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందాడు.

సత్యనారాయణ గోవిందరాజస్వామి ఆలయం పక్కన ఒక ప్రైవేట్ లాడ్జిని నడిపేవాడు. హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. నగరంలో నడిరోడ్డుపై ఒక వ్యక్తిపై కత్తులతో దాడికి దిగడం సంచలనం రేపుతోంది

Advertisement
Advertisement