ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ.. | Sakshi
Sakshi News home page

ఘరానా దొంగలు.. ఏసీలు రిపేరు చేస్తామంటూ..

Published Fri, Aug 2 2019 4:25 PM

Chittoor Police Arrested Two Thieves - Sakshi

సాక్షి, చిత్తూరు : ఏసీలు మరమ్మత్తు చేస్తామంటూ నమ్మించి దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. దోచుకున్న సొత్తును అమ్మడానికి ప్రయత్నిస్తుండగా వారు అడ్డంగా దొరికి పోయారు. తిరుపతి అర్బన్‌ జిల్లా ఏఎస్పీ వెంకటేశ్వర నాయక్ తెలిపిన వివరాల మేరకు.. తిరుపతి తాతయ్యగుంట వినాయక్‌నగర్‌కు చెందిన సురేష్‌, రహ్మతుల్లా అనే ఇద్దరు యువకులు ఏసీ మెకానిక్‌లమంటూ వివిధ ప్రాంతాల్లో తిరిగేవారు. ఏసీలు మరమ్మత్తు చేస్తామంటూ ఇంట్లోని బీరువా తాళాలు పగుల గొట్టి బంగారు, వెండి నగలు చోరీ చేసేవారు. అలా 265 గ్రాముల బంగారు, 75గ్రాముల వెండి ఆభరణాలను దొంగలించారు. ఈ సొత్తును మొత్తం అమ్మడానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అనుమానించిన పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా అసలు సంగతి బయటపడింది. పోలీసులు వారి వద్దనుంచి నగలను, బైక్‌ను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement