Sakshi News home page

సైనైడ్ ప్రసాదం: సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు

Published Thu, Nov 7 2019 9:12 PM

Cyanide Killings, New Twists in Serial Killer Shiva case - Sakshi

సాక్షి, తూర్పు గోదావరి: సైనైడ్ కలిపిన ప్రసాదంతో పది మందిని హత్య చేసిన ఏలూరు సీరియల్ కిల్లర్ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. రెండో వ్యక్తిని హతమార్చినప్పుడే శివ అలియాస్ సింహాద్రి పోలీసులకు దొరికాడు.. స్వయంగా పోలీసులే 9 లక్షల రూపాయల్ని అతడి నుంచి రికవరీ చేసి బాధితుడి కుటుంబానికి ఇచ్చేశారు. పోలీసులు అప్పుడే గుర్తిస్తే.. మరి ఆ తర్వాత కూడా శివ 8 హత్యల్ని ఎలా చెయ్యగలిగాడు..? ఈ కేసులో పోలీసుల వైఫల్యం ఎంత ఉంది..?
నూజివీడు తవిటయ్య కుటుంబం ‘సాక్షి ఫేస్ టు ఫేస్‌’లో చెప్పిన సంచలన వాస్తవాలను ఇక్కడ చూడండి

ప్రసాదంలో సైనైడ్­ పెట్టి పది మందిని చంపేశాడు శివ అలియాస్ సింహాద్రి.. పదో వ్యక్తి చనిపోయినప్పుడు పోలీసుల్ని ఆశ్రయిస్తే వాళ్లు సాధారణ మరణమే అన్నారు. అయినా పట్టువదలకుండా ఓ కుటుంబం చేసిన ప్రయత్నంతో పది హత్యలు బయటపడ్డాయి. లేదంటే అవన్నీ కాలగర్భంలో కలిసిపోయేవే.. ఇప్పటికీ శివ హత్యాకాండ కొనసాగేదే. పీఈటీ నాగరాజు మాస్టారు కుటుంబం ఈ కేసు ఛేదనలో ఎలా కీలకంగా ఎలా మారిందో.. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మా ప్రతినిధి సుధాకర్ అందించే ఈ గ్రౌండ్ రిపోర్ట్­ ఇదీ..

సైనైడ్ సీరియల్ కిల్లర్ శివ అలియాస్ సింహాద్రి.. ఈ హత్యల్లో తన రియల్ ఎస్టేట్ పరిచయాలను వాడుకున్నాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవారి వద్ద డబ్బు ఉంటుంది. ఈ విషయాన్ని పసిగట్టి.. తనను తాను ఓ రియల్ ఎస్టేట్ బ్రోకర్-గా పరిచయం చేసుకొని వారిని నమ్మించాడు. ఆ తర్వాత పూజలు, రైస్ పుల్లింగ్  యంత్రాల పేరుతో వారు డబ్బు బయటికి తెచ్చేలా చేసి సైనైడ్ కలిపిన ప్రసాదం తినిపించాడు... శివ చేసిన నాలుగో హత్యే ఇందుకు ఉదాహరణ.. తూర్పుగోదావరి జిల్లా ముస్తానాబాద్ పొలాల్లో బాలవెంకటేశ్వర్రావును హతమార్చాడు..
ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం ఈ వీడియో క్లిక్‌ చేయండి

Advertisement

What’s your opinion

Advertisement