Sakshi News home page

తల్లి మందలించిందని కూతురి బలవన్మరణం

Published Tue, Jul 3 2018 11:01 AM

Daughter Suicide When Mother Reprobate In Hyderabad - Sakshi

బంజారాహిల్స్‌: ఇంటి పనులు సరిగ్గా చేయడం చేతకాదంటూ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన కూతురు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌పరిధిలో చోటుచేసుకుంది. ఫిలింనగర్‌లోని దీన్‌దయాల్‌నగర్‌ బస్తీలో నివసించే ఆంజనేయులు అపోలో ఆస్పత్రిలో హౌజ్‌కీపింగ్‌ చేస్తుంటారు. ఆయన భార్య మొరమ్మ గృహిణి. కూతురు శిరీష(18) పదో తరగతి ఫెయిల్‌ కావడంతో ఇంట్లోనే ఉంటోంది. కొద్ది రోజులుగా ఇల్లు కడగడంలో నిర్లక్ష్యం చూపిస్తోందంటూ తల్లి మొరమ్మ కూతురును మందలిస్తోంది. ఆదివారం ఉదయం కూడా మందలించింది. దీంతో మనస్తాపం చెందిన శిరీష ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకుపాల్పడింది. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement