రాజేంద్రనగర్: కాటేదాన్లోని ఓ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. మూడు గంటల పాటు మంటలు ఎగిసిపడి షేడ్ మొత్తం దగ్ధమైంది. పక్కనే ఉన్న పరిశ్రమలకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది, స్థానిక ప్రజలు తీవ్రంగా కష్టపడ్డారు. ఇంత జరిగిన నిర్వాహకులు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయకపోగా సమాచారం సైతం అందించలేదు. స్థానికులు, కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం.. కాటేదాన్ పారిశ్రామికవాడలో షాలీమార్ కొబ్బరినూనె పరిశ్రమ కొనసాగుతుంది. ఇందులో నూనె తయారీ, ప్యాకింగ్ చేస్తారు.
శనివారం రాత్రి విధులు ముగించుకున్న కార్మికులు ఇళ్లకు వెళ్లారు. ఆదివారం ఉదయం 5.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో పరిశ్రమలో మంటలు వ్యాపించాయి. మంటలు ఉధృతం కావడంతో సెక్యూరిటీ గార్డులు విషయాన్ని కంపెనీ యజమానికి తెలిపారు. అప్పటికే పరిశ్రమలోని నాలుగువైపుల నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. నిమిషాల వ్యవధిలో దట్టమైన పొగలతో ప్యాకింగ్కు సిద్ధంగా ఉన్న కొబ్బరినూనె డబ్బాలు కాలి బూడిదయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఆస్తి నష్టం కోట్లల్లో ఉంటుందని కార్మికులు తెలుపుతున్నారు. మంటలు అదుపులోకి వచ్చిన కొద్ది నిమిషాల్లోనే పరిశ్రమ పైకప్పు కుప్పకూలింది. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు అందలేదని దీంతో కేసు నమోదు చేయలేదని మైలార్దేవ్పల్లి ఇన్స్పెక్టర జగదీశ్వర్ తెలిపారు.
ఆదివారం కావడంతో...
ఈ పరిశ్రమలో కొబ్బరినూనె తయారీ, ప్యాకింగ్తో పాటు పసుపు, కారం, గరం మసాలా తది తర నిత్యవసర వస్తువుల ప్యాకింగ్ను నిర్వహి స్తున్నారు. ఇందులో 800 మంది కార్మికులు పనిచేస్తుంటారు. ఆదివారం ఉదయం ప్రమాదం జరగడంతో ఎవరు లేరని దీని కారణంగా పెను ప్రమాదం తప్పిందని కార్మికులు వెల్లడించారు.
రెండు గంటలు ఉక్కిరిబిక్కిరి...
ఉదయం రెండు గంటల పాటు దట్టమైన పొగలతో కాటేదాన్ పరిశ్రమ చుట్టుపక్కల ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు. ఉదయం 6.30 గంటల నుంచి 8.30 గంటల వరకు పొగ కమ్మేసింది. ఫైర్ సిబ్బంది మూడు గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కాటేదాన్ పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్న ప్రతిసారి అగ్నిమాపక సిబ్బంది ఇబ్బందులకు గురవుతున్నారు. స్థానికంగా వాహనాలు వెళ్ళేందుకు రహదారులు పెద్దగా లేకపోవడం, రహదారి నుంచి పరిశ్రమ లోపలికి ఉండడంతో ఇబ్బందులకు గురవుతున్నారు. దీనికి తోడు అగ్నిమాపక యంత్రంలో నీటిని తిరిగి తీసుకురావడానికి బుద్వేల్ లేదా బహదూర్పురా వాటర్బిడ్ల వద్దకు వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు.
కాటేదాన్లో భారీ అగ్నిప్రమాదం
Published Mon, Apr 2 2018 10:55 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
నేహా కుటుంబానికి అండగా అమిత్షా..
ఆ టాలీవుడ్ హీరోతో కలిసి పని చేయాలని ఉంది: అల్లరి నరేశ్
రుతురాజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. పంజాబ్ టార్గెట్ ఎంతంటే?
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కుమార్తెకు అరుదైన గౌరవం!
వరల్డ్కప్కు సెలక్టయ్యాడు.. తొలిసారి డకౌటయ్యాడు! వీడియో వైరల్
ఈవీఎంలపై మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
ఎందుకంత ఓవరాక్షన్.. వాళ్లతో పోలిస్తే నువ్వెంత?: పూరి
వడగళ్ల వానతో దెబ్బతిన్న విమానం.. ఒడిశాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement