మైనర్‌కు తుపాకీ పెట్టి.. గ్యాంగ్‌స్టర్‌ పెళ్లి.. | Sakshi
Sakshi News home page

మైనర్‌కు తుపాకీ పెట్టి.. గ్యాంగ్‌స్టర్‌ పెళ్లి..

Published Wed, May 9 2018 8:07 PM

Gangster Points Gun At Minor Head And Married - Sakshi

పాట్నా, బిహార్‌ : కిడ్నాప్‌కు గురైన 15 ఏళ్ల మైనర్‌ బాలికను పోలీసులు కనిపెట్టారు. బిహార్‌కు చెందిన పప్పు సింగ్‌ అనే గ్యాంగ్‌స్టర్‌ బాలికను కిడ్నాప్‌ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. ఇందుకు సంబంధించి ఓ ఫొటో సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతోంది. చేతిలో గన్‌ పట్టుకున్న పప్పు అనుచరుడు ఒకరు మరోచేతితో టార్చ్‌ వేశాడు. ఆ వెలుగులో బాలిక నుదుటిన పప్పు సింగ్‌ కుంకుమ దిద్దుతున్నాడు.

బిహార్‌ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసేందుకే పప్పు ఆ ఫొటోను సోషల్‌మీడియాలో విడుదల చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. భాగల్‌పూర్‌, నౌగచియా ప్రాంతాల్లో పప్పు సింగ్‌ పెద్ద గ్యాంగ్‌స్టర్‌. అతనిపై హత్య, దోపిడీ కేసులు ఉన్నాయి. ఎప్పటినుంచో పోలీసులకు దొరక్కుండా తిరుగుతున్నాడు.

కొద్దిరోజుల క్రితం బాలికను కిడ్నాప్‌ చేసిన పప్పు ఆమెను ఢిల్లీ తీసుకెళ్లాడు. బాలిక కోసం వెతుకుతున్న పోలీసులకు పప్పు భార్య బాలికను అప్పజెప్పింది. పప్పు, అతని అనుచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు భాగల్‌పూర్‌ ఎస్‌ఎస్‌పీ ఆశిష్‌ భారతి పేర్కొన్నారు. కాగా, పప్పు చెర నుంచి బయటపడ్డ బాలిక షాక్‌లో ఉన్నట్లు తెలిపారు. పప్పు, అతని అనుచరులు ఎంత క్రూరంగా ప్రవర్తించారో తల్లిదండ్రులకు చెబుతూ భోరుమంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement