మరదలిపై నవవరుడి అఘాయిత్యం | Sakshi
Sakshi News home page

మరదలిపై లైంగికదాడి

Published Mon, Mar 4 2019 12:47 PM

Groom Molestation on Bride Sister in Tamil Nadu - Sakshi

టీ.నగర్‌: వివాహమైన 15 రోజుల్లోనే భార్య చెల్లెలిని కిడ్నాప్‌ చేసి లైంగిక దాడి జరిపిన నవవరుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. పెరియపాళయం సమీపం తేర్‌వళి గ్రామానికి చెందిన అజిత్‌కుమార్‌ (22) ఆరణి అంజాదమ్మన్‌కోవిల్‌ బస్టాప్‌ వద్ద సెల్‌ఫోన్‌ దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి ఆరణి సమీపం ఎరుక్కువాయి గ్రామానికి చెందిన యువతితో గత నెల 15 తేదీన వివాహమైంది. మామ ఇంట్లో అజిత్‌కుమార్‌ ఉండగా భార్య చెల్లెలు 13 ఏళ్ల బాలికపై అతనికి వ్యామోహం ఏర్పడింది.

ఇదిలాఉండగా గత 27వ తేదీ బాలిక అదృశ్యమైంది. ఆమె కోసం తల్లిదండ్రులు, బంధువులు గాలించినా ఆచూకీ తెలియకపోవడంతో పెరియపాళెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు విచారణ జరపగా అదృశ్యమైన బాలిక చివరిగా అక్క భర్త అజిత్‌కుమార్‌తో వెళ్లినట్లు తెలిసింది. పోలీసులు అజిత్‌కుమార్‌ వద్ద విచారణ జరిపగా అతను బాలికను కిడ్నాప్‌ చేసి తన షాపులో బంధించి లైంగిక దాడి జరిపినట్లు తెలిసింది. షాపులో ఉన్న బాలికను రక్షించి అజిత్‌కుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆస్పత్రికి పంపారు. అజిత్‌కుమార్‌ను పొన్నేరి కోర్టులో హాజరుపరిచి పుళల్‌ జైలులో నిర్బంధించారు. 

Advertisement
Advertisement