భీమవరం టౌన్: పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంగళవారం నాలుగేళ్ల వయస్సు కలిగిన బాలుడిని కిడ్నాప్ చేశారు. రూ.5 లక్షలు ఇవ్వాలంటూ తల్లిదండ్రులకు ఫోన్ చేసి ఓ ఆగంతకుడు బెదిరించాడు. పోలీస్ స్టేషన్లో ఉండగానే మరోసారి ఫోన్ కాల్ చేసి స్టేషన్కు ఎందుకు వెళ్లావ్ ఫిర్యాదు చేసినా, మీడియాకు చెప్పినా సహించేది లేదంటూ బెదిరించాడు. వివరాల్లోకి వెళితే.. 39వ వార్డు దుర్గాపురం ప్రాంతానికి చెందిన వడ్రంగి పనిచేసుకునే మామిడి లక్ష్మణరావు, దుర్గ దంపతులకు శ్యామ్ గౌతమ్ లేక లేక పుట్టిన సంతానం. మెంటేవారితోటలోని వండర్ కిడ్స్ కిండర్ గార్డెన్ స్కూల్లో ఎల్కేజీ చదువుతున్నాడు. సుమారు 11.20 గంటల సమయంలో ఆగంతకుడు స్కూల్ వద్దకు వెళ్లి టీచర్తో శ్యామ్ గౌతమ్ కుటుంబ సభ్యులకు యాక్సిడెంట్ అయిందని నమ్మించాడు.
శ్యామ్ గౌతమ్ తండ్రితో ఫోన్లో మాట్లాడమని తన సెల్ఫోన్ నుంచి ఎవరికో ఫోన్ కాల్ చేసి టీచర్కు ఇచ్చాడు. అవతల వ్యక్తి మాట్లాడ్డంతో టీచర్కు కొంత నమ్మకం కలిగి ఆగంతకుడికి బాలుడిని అప్పగించగా మోటార్ సైకిల్పై తీసుకుపోయాడు. తర్వాత గంటకు బాలుడి తండ్రి లక్ష్మణరావుకు ఆగంతకుడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది. రూ.5 లక్షలు ఇస్తేగాని వదిలిపెట్టనంటూ బెదిరించాడు. దీంతో అతను కంగారు పడి పోలీసులను ఆశ్రయించాడు. విషయం తెలుసుకున్న డీఎస్పీ టి.ప్రభాకర్బాబు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. అప్పటికే పోలీసులు సంఘటన వివరాలు తెలుసుకున్నారు. సీసీ కెమెరాల్లో ఆగంతకుడ్ని గుర్తించేందుకు స్టేషన్లో ఫుటేజిని పరిశీలిస్తున్నారు. టీచర్ను కూడా పిలిపించి సీసీ ఫుటేజిని పరిశీలించి గుర్తుపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సీఐ డి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసు బృందాలు ఆగంతకుడి ఫోన్ కాల్స్ ఆధారంగా పట్టుకునేందుకు గాలిస్తున్నారు. నవంబర్ 1వ తేదీ శ్యామ్గౌతమ్ పుట్టిన రోజు కావడం, ఇంతలో ఇలా జరగడంతో తల్లి దుర్గ కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
భీమవరంలో బాలుడి కిడ్నాప్
Published Wed, Nov 1 2017 4:19 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
నేడు కొత్తకోటకు సీఎం రేవంత్ రాక..
‘నీట్’కు ఏర్పాట్లు పూర్తి
ఐదుగురి నామినేషన్లు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా రాకేష్రెడ్డి
సుందర మున్నేరే లక్ష్యం..
నిరంతర విద్యుత్ సరఫరాకు చర్యలు
నేడు, రేపు డిప్యూటీ సీఎం భట్టి పర్యటన
పకడ్బందీగా విధులు నిర్వర్తించాలి
బీజేపీతోనే అభివృద్ధి సాధ్యం
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement