స్వాతి నుంచి ప్రాణహాని ఉంది..! | Sakshi
Sakshi News home page

స్వాతి నుంచి ప్రాణహాని ఉంది

Published Thu, Dec 28 2017 2:17 AM

lifr threat from swathi - Sakshi

నాగర్‌కర్నూల్‌ క్రైం: నాగర్‌కర్నూల్‌లో భార్య, ఆమె ప్రియుడి చేతిలో హత్యకు గురైన కాంట్రాక్టర్‌ సుధాకర్‌రెడ్డి తల్లిదండ్రులు, బంధువులు బుధవారం జిల్లా ఎస్పీ సన్‌ప్రీత్‌ సింగ్‌ను కలిశారు. స్వాతి నుంచి వారి పిల్లలు వర్షిణి, దర్శిత్‌రెడ్డిలకు కూడా ప్రాణహాని ఉందన్నారు.

సుధాకర్‌రెడ్డి హత్యతో తాము వీధినపడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. రాజేశ్‌ వైద్య ఖర్చులు పెట్టించడంతో ఆర్థికంగా చితికిపోయామని తెలిపారు. నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.

Advertisement
Advertisement