దారుణం: కుక్కలకు అన్నం వేసిందని.. | Sakshi
Sakshi News home page

దారుణం: కుక్కలకు అన్నం వేసిందని యువనితిని.. 

Published Thu, Jul 19 2018 8:43 PM

Locals Beat Young Girl in Karnataka - Sakshi

సాక్షి, బెంగళూరు(యశ్వంతపూర్‌) : విశ్వాసం లేని మనుషులు.. విశ్వాసం చూపించే కుక్కులకు అన్నం వేసిందని ఓ యువతిని చితకబాదారు. ఈ ఘటన మహాలక్ష్మీ లేఔట్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో చోటుచేకుంది. వివరాల్లోకి వెళితే.. తారిణి అనే యువతి రోజు తన ఇంటి ముందుకు వస్తున్న కుక్కలను అన్నం వేసేది. దీంతో కుక్కలు వీధిలోకి రావటంవల్ల తమకు ఇబ్బందులు కలుగుతున్నట్లు స్థానికులు అనేక సార్లు హెచ్చరించారు. 

వీధి కుక్కలకు అన్నం వేస్తే వీకేందుకు ఇబ్బందులంటూ బుధవారం తారిణితో స్థానికులు గోడవ పడ్డారు. కుక్కలకు అన్నం వేసిన్నందుకు తనపై దాడి చేయటంను తారిణి తీవ్రంగా ఖండించారు. దీనితో పాటు అన్నం వేసిన పాపానికి స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తారణిపై మహాలక్ష్మీ లేఔట్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. తనపై దాడి చేస్తున్న సమయంలో వీడియో తీయాలని ప్రయత్నించగా ఫోన్‌ను కూడ లాక్కోని కోట్టిన్నట్లు తారిణి పోలీసుల వద్ద వాపోయ్యారు. దీనిపై స్వచ్చంద సంస్థలు తారిణి అభినందిస్తుండగా కేసు నమోదు చేసిన పోలీసులు గుక్కమింగటం కష్టం మారింది. 

Advertisement
Advertisement