విజయనగరం,సాక్షి, సీతానగరం : మండల కేంద్రంలోని సువర్ణముఖీ నదిపై ఆర్అండ్బీ రాష్ట్రీయ రహదారి వంతెనపై ఆదివారం ఉదయం 9.15 గంటల సమయంలో ఎదురెదురుగా వస్తున్న లారీలు ఒకదానికొకటి రాసుకుపోవడం వల్ల సుమారు 40 నిమిషాలు ట్రాఫిక్ స్తంభించిపోయింది. పార్వతీపురం నుంచి బొబ్బిలి వెళ్తున్న లారీ, బొబ్బొలి నుంచి పార్వతీపురం వైపు వస్తున్న లారీ వంతనెపై చిక్కుకున్నాయి.
ఈ సమయంలో ఇరులారీల డ్రైవర్ల మధ్య వాగ్వాదం ఏర్పడడంతో ఎవ్వరూ వాహనాన్ని వెనక్కి తీయలేదు. దీంతో సుమారు కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహనచోదకులందరూ డ్రైవర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో వాహనాలు వెనక్కి తీశారు.