పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

Published Wed, May 2 2018 1:24 PM

Man Committed Suicide - Sakshi

గుర్ల : మండలంలోని ఆనందపురం గ్రామానికి చెందిన గంట్యాడ రామునాయుడు (38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలోకి వెళ్తే...గంట్యాడ రామునాయుడు, ఆయన భార్య రాముల నారాయణమ్మ మధ్య ఏడాదిగా గోడవలు జరుగుతున్నాయి. రెండు నెలలు కిందట నారాయణమ్మ  కన్నవారి ఇంటికి వెళ్లిపోయింది. తన భార్యను  ఇంటికి రావాలని రామునాయుడు కోరగా ఆమె తిరస్కరించడంతో సోమవారం రాత్రి ఆనందపురం గ్రామ శివార ప్రాంతంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అటుగా వచ్చిన గ్రామస్తులు గమనించి  జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మరణించినట్టు పోలీసులు తెలిపారు. మృతునికి గంట్యాడ ఎరుకునాయుడు అనే కుమారుడు ఉన్నాడు. స్థానిక పాఠశాలల్లో 8వ తరగతి చదువుతున్నాడు.  ఎస్‌ఐ సంభాన రవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. 

Advertisement

తప్పక చదవండి

Advertisement