Sakshi News home page

గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం

Published Fri, Apr 13 2018 12:46 PM

Man Died In Road Accident - Sakshi

కొత్తూరు: కర్లెమ్మ పంచాయతీ పరిధి మహసింగి వద్ద గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మహసింగికి చెందిన దూబ మల్లేశ్వరరావు(40) మృతిచెందాడు. పోలీస్‌లు చెప్పిన వివరాలు ప్రకారం... గురువారం తెల్లవారుజామున బహిర్భూమి కోసం గ్రామానికి ఆనుకొని ఉన్న పాలకొండ–హడ్డుబంగి రోడ్డు మీదకు వెళ్లిన మల్లేశ్వరరావును గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొంది.

కాలు చేతులతో పాటు పలు చోట్ల తీవ్రంగా గాయాలపాలైన మల్లేశ్వరరావు కుప్పకూలిపోయాడు. అటువైపు వెళ్లిన గ్రామానికి చెందిన ఒక మహిళ మల్లేశ్వరరావు కేకలు విని గ్రామంలోకి వచ్చి కుటుంబ సభ్యులకు చెప్పింది.

వెంటనే కుటుంబ సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రుడిని ప్రైవే ట్‌ వాహనంలో శ్రీకాకుళంలోని రిమ్స్‌కు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందా డు. భర్త మృతి చెందిన వార్త విన్న భార్య, కుటుంబ సభ్యు ల రోదన మిన్నంటింది.

మృ తుడికి ఇద్దరు పిల్లలు ఉన్నా రు. కుటుంబ యజ మాని మృ తి చెందడంతో ఆ కుటుంబం వీధిన పడింది. మృతుడు భార్య రూపావతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ కేసు నమోదు చేశారు. 

మూడు రోజుల వ్యవధిలో ఇద్దరు...

గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు మూడు రోజుల వ్యవధిలో రోడ్డు ప్రమాదంలో ఒకే చోట మృతి చెందడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ నెల 10వ తేదీన లిమ్మక గణేష్‌ బైక్‌ ఢీకొని మృతి చెందగా, మల్లేశ్వరరావు గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో గురువారం మృతి చెందాడు. వరుస ప్రమాదాలు జరగడంతో గ్రామస్తులు రోడ్డు మీదకు వెళ్లేందుకు భయపడుతున్నారు.  

Advertisement
Advertisement