న్యూఢిల్లీ : జాతకంలో దోషం ఉందని చెప్పి మేనకోడలిపై నాలుగేళ్లుగా అత్యాచారానికి పాల్పడ్డారు ఓ దుర్మార్గపు మేన మామ. ఈ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీ చెందిన ఓ వ్యక్తి తన మేన కోడలి(23)పై కన్నేశాడు. ఆమెను లొంగదీసుకునేందుకు జాతకాన్ని ఎర చూపాడు. జాతకంలో దోషం ఉందని అలాగే ఉంటే పెళ్లి కాదని, తండ్రి కూడా చనిపోతాడని బెదిరించారు. దీంతో ఆమె మేన మామ చెప్పినట్లుగా చేసింది. దోషం నెపంతో గత నాలుగేళ్లుగా ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
ఇటీవల ఆమె వివాహం అయింది. అయినప్పటికీ ఆమెను మళ్లీ తన కోరికను తీర్చాలని వేధించాడు. దీంతో ఈ విషయాన్ని ఆమె తన భర్తకు చెప్పింది. అతను నరేల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడిని అరెస్ట్ చేశారు. కాగా తన మేన కోడలు జాతకంలో దోషం ఉందని, నివారణ కోసమే అత్యాచారానికి పాల్పడ్డానని నిందితుడు చెప్పడం గమనార్హం. మూఢనమ్మకాలను నమ్మి మోసపోయిన సదరు మహిళను కౌన్సిలింగ్ నిమిత్తం ఢిల్లీ మహిళా కమిషన్ను తరలించారు.