బాలికపై లైంగికదాడి | Sakshi
Sakshi News home page

బాలికపై లైంగికదాడి

Published Sat, Mar 10 2018 7:12 AM

Man Sexual Assult On Minor Girl - Sakshi

చిలకలగూడ : ఏడవ తరగతి చదువుతున్న బాలికపై లైంగికదాడికి పాల్పడిన ఓ వ్యక్తి ఈ విషయం తల్లితండ్రులకు చెబితే యాసిడ్‌ పోసి చంపుతానంటూ బాధితురాలిని బెదిరించిన ఘటన చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పద్మారావునగర్‌ హమాలీబస్తీకి చెందిన బాలిక (16) సికింద్రాబాద్‌ కీస్‌ హైస్కూలులో ఏడో తరగతి చదువుతోంది. ఈనెల 5న మధ్యాహ్నం పక్కింట్లో ఉంటున్న  ఆటోడ్రైవర్‌ నర్సింగ్‌ (32) తన ఇంటికి పిలిచాడు. తలుపులు వేసి లైంగికదాడికి పాల్పడ్డాడు.

కేకలు వేస్తే చంపుతానంటు బెదిరించడంతో బాలిక మిన్నకుండిపోయింది. ఈ విషయాన్ని తల్లితండ్రులకు చెబితే అందరినీ చంపుతానని బెదిరించాడు. నర్సింగ్‌ ఇంటి నుంచి ఏడుస్తూ వెళ్లున్న విషయాన్ని  గుర్తించిన మరో బాలిక  బాధితురాలి తల్లికి చెప్పింది. తల్లిదండ్రులు ఒత్తిడి చేయడంతో అసలు విషయం చెప్పింది. దీంతో తల్లితండ్రులతో కలిసి బాధితురాలి శుక్రవారం పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపినట్లు చిలకలగూడ సీఐ రుద్రభాస్కర్‌ తెలిపారు. కాగా నిందితుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలిపారు. భయాందోళనకు గురైన బాలికను బషీర్‌బాగ్‌లో ని భరోసా సెంటర్‌కు తరలించామని, ఆమెకు వైద్యపరీక్షలు నిర్వహించడంతో పాటు  కౌన్సెలింగ్‌ ఇస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement