క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

క్షణికావేశంలో వివాహిత ఆత్మహత్య

Published Wed, Jun 27 2018 1:39 PM

Married Woman Commits Suicide In Visakhapatnam - Sakshi

యలమంచిలి: క్షణికావేశంలో ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన యలమంచిలిలో పలువురిని కలచివేసింది. పట్టణంలోని ధర్మవరం ప్రాంతానికి చెందిన కూనిశెట్టి కుమారి(25)మంగళవారం తెల్లవారుజామున గుళికలమందు తాగింది.  ఆమెను కేజీహెచ్‌కు తరలించగా  అక్కడ మృతిచెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.

రాంబిల్లి మండలం కలవలాపల్లి గ్రామానికి చెందిన కుమారికి యలమంచిలి ధర్మవరానికి చెందిన శ్రీనివాసరావుకు ఆరేళ్లక్రితం వివాహమైంది. శ్రీనివాసరావు ఒక ప్రైవేటు కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తుండగా,  కుమారి  బ్రాండిక్స్‌లో పనిచేస్తోంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటి నిర్మాణంకోసం తాకట్టు పెట్టిన తన బంగారు ఆభరణాలు విడిపించాలని భర్తతో వాగ్వాదానికి దిగిన కుమారి మంగళవారం తెల్లవారుజామున గుళికల మం దుతాగి ఆత్మహత్యకు యత్నించింది.  గమనించిన భర్త శ్రీనివాసరావు, బంధువులు ఆమెను యలమంచిలి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖపట్నం  కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ కుమారి మృతిచెందింది. కుమారి మేనమామ రమణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు యలమంచిలి పట్టణ ఎస్‌ఐ నారాయణరావు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

తల్లిని కోల్పోయిన చిన్నారులు
కుమారి, శ్రీనివాసరావు ఎంతో అన్యోన్యంగా ఉండేవారని స్థానికులు తెలిపారు.  బంగారు ఆభరణాల విషయంలో వచ్చిన మన్పర్థల కారణంగా కుమారి ఆత్మహత్య చేసుకోవడంతో అభంశుభం తెలియని చిన్నారులు తల్లిని కోల్పోయారు. తల్లికి ఏం జరుగుతుందో కూడా తెలియని చిన్నారులు విలపిస్తున్న తీరును చూసి స్థానికులు కంటతడిపెట్టారు.  

Advertisement
Advertisement