భార్యాపిల్లలపై హత్యాయత్నం | Sakshi
Sakshi News home page

భార్యాపిల్లలపై హత్యాయత్నం

Published Fri, Oct 27 2017 7:50 AM

murder attempt on wife and childrens - Sakshi

మదనపల్లె క్రైం : కాపురం చేయకుండా రెండేళ్లు  దూరంగా ఉన్న భార్యపై అత ను కోపం పెంచుకున్నాడు. పెట్రోల్‌ పోసి ఆమెను, పిల్లలను సజీవదహనం చేసేం దుకు యత్నించాడు. ఈ సంఘటన గురువారం మ దనపల్లెలో జరిగింది. టూ టౌన్‌ ఎస్‌ఐ కృష్ణ్ణయ్య కథ నం మేరకు.. కడప పట్టణం సాయిపేటకు చెందిన ఆర్‌.రమణ ములకలచెరువు మండలం దేవులచెరువుకు చెందిన సునీతను 12 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. వీరికి పిల్లలు లక్ష్మీ, వేణు ఉన్నారు. భార్యాభర్తల మధ్య అనుమానం ఏర్పడి తరచూ గొడవపడేవారు. దీంతో రెండేళ్ల క్రితం సునీత పిల్లలను తీసుకుని పుట్టింటికి చేరుకుంది.

అక్కడ గ్రామస్తులు అవమానిస్తుండడంతో  తల్లిని వెంట తీసుకుని వచ్చి మదనపల్లెలోని రామారావుకాలనీలో ఉంటూ ఓ హోటల్‌లో పనిచేస్తోంది. 15 రోజుల క్రితం రమణ వచ్చి కాపురానికి రావాలని కోరాడు. ఆమె నిరాకరించింది. ఇక్కడే ఉందా మని చెప్పడంతో  ఉండిపోయాడు. తరువాత ఏమి జరిగిందో గురువారం భార్యాపిల్లలు, అత ్తను గదిలో పెట్టి పెట్రోల్‌ పోసి నిప్పంటించాడు. ముగ్గురూ స్వల్పగాయాలతో ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. నిందితుడు పరారయ్యా డు. ఈ మేరకు బాధితులు ఫిర్యాదు చేసినట్లు, కేసు  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement