సాక్షి, నెల్లూరు(క్రైమ్): ఉద్యోగ నిమిత్తం మహారాష్ట్రకు వెళ్లిన జిల్లా వాసిని రైలు రూపంలో మృత్యువు కబళించింది. కుమారుడు విగతజీవిగా మారడంతో బాధిత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ ఘటన గురువారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. రాపూరుకు చెందిన బండి రవీంద్రరెడ్డి, విజయమ్మలకు ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు లోకేష్రెడ్డి (24) చిన్నతనం నుంచే కుటుంబ పరిస్థితులను దగ్గరగా చూశాడు. ఎలాగైనా ఉన్నత చదువులు చదివి మంచి ఉద్యోగం సాధించి కుటుంబానికి అండగా ఉండాలని నిశ్చయించుకున్నాడు. కష్టపడి చదివాడు. ఇంజినీరింగ్లో అత్యధిక మార్కులు సాధించి రైల్వే వికాస్నిగమ్లో సైట్ ఇంజినీర్గా ఉద్యోగం సాధించాడు. దీంతో అతని కుటుంబం ఎంతో సంతోషించింది. జూలై 4వ తేదీన లోకేష్రెడ్డి మహారాష్ట్రలోని సోలోపూర్ జిల్లా కురడివాడిలో ఉద్యోగంలో చేరాడు. ప్రతిరోజూ తల్లిదండ్రులకు, అన్నకు ఫోన్ చేసి మాట్లాడేవాడు. ఈ నేపథ్యంలో జూలై 30వ తేదీ విధి నిర్వహణలో ఉండగా షోలాపూరు నుంచి పూణే వెళ్లే మెమో రైలు అతడిని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. కురుడివాడి పోలీసులు కేసు నమోదుచేసి మృతదేహాన్ని అక్కడి హాస్పిటల్ మార్చురీకి తరలించారు. కుమారుడి మృతి వార్త తెలుసుకున్న బాధిత తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కుప్పకూలిపోయారు. గుండెలవిసేలా రోదించారు. బంధువులు హుటాహుటిన మహారాష్ట్రకు వెళ్లారు. మృతదేహానికి అక్కడి వైద్యులు శవపరీక్ష నిర్వహించి అప్పగించారు. లోకేష్రెడ్డి మృతదేహాన్ని గురువారం తెల్లవారుజామున రాపూరుకు తీసుకువచ్చి అంత్యక్రియలు చేశారు.
మహారాష్ట్రలో నెల్లూరు జిల్లా వాసి దుర్మరణం
Published Fri, Aug 2 2019 10:31 AM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తిహార్ జైలుకు బాంబు బెదిరింపు..
Royal Challengers Bengaluru: తిరుమల శ్రీవారి సేవలో ఆర్సీబీ క్రికెటర్లు (ఫొటోలు)
MS Dhoni: అందుకే వాళ్లంటే నాకు, జడ్డూకు చిరాకు!
ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
ఇదే సాక్ష్యం... సంచలన నిజాలు బయటపెట్టిన KSR
ప్రధాని మోదీపై పిటిషన్... తిరస్కరించిన సుప్రీంకోర్టు
Mothersday 2024 ‘బంగారం నువ్వమ్మా’! టాలీవుడ్ అమ్మల్నిచూశారా?
నా మాజీ భర్త గే.. అతడి గదిలో రాత్రి ధనుష్కు ఏం పని? సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
టీడీపీకి ఓటు వేయలేదని బంధించి హింసించిన TDP నేతలు ..
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
తప్పక చదవండి
- ప్రోటీన్ సప్లిమెంట్లను వాడుతున్నారా? హెచ్చరిస్తున్న మెడికల్ రీసెర్చ్
- హోర్డింగ్ కూలి 14 మంది మృతి.. ఆనంద్ మహీంద్రా ట్వీట్
- ఢిల్లి లిక్కర్ కేసులో కవిత జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపు
- ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు.. నేడు అదనపు ట్రిప్పులు
- మీ పిల్లలను సరైన క్రమంలో తీర్చిదిద్దాలంటే ఇలా చేయండి!
- తెలుగు సినిమాతో పరిచయమైన హీరోయిన్.. గుర్తుపట్టారా?
- Tandur: పసికందు ప్రాణం తీసిన పెంపుడు కుక్క
- ‘గాజాపై అణు బాంబు వేయనివ్వండి’
- జేసీ కుటుంబంపై కేసు నమోదు
Advertisement