ఘోర రోడ్డు ప్రమాదం.. 10 మంది దుర్మరణం | Sakshi
Sakshi News home page

Published Fri, Jun 1 2018 8:22 AM

Road Accident at Arni in Maharashtra Kills Few - Sakshi

సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఘోరం జరిగింది. శుక్రవారం ఉదయం యవాట్మల్‌లోని అర్ని వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. తవేరా వాహనం-ట్రక్కు ఢీ కొట్టిన ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మరో ముగ్గురికి తీవ్ర గాయలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటినా ప్రమాద స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. వేకువ ఝామున ఈ ఘటన జరిగిందని, ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని స్థానిక ఎస్సై తెలిపారు. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది. 

Advertisement
Advertisement