జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..! | Sakshi
Sakshi News home page

జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం..!

Published Tue, Mar 12 2019 9:49 AM

RTC Bus Driver Rash Driving One Died At Jubilee Check Post - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జూబ్లీ చెక్‌పోస్టు వద్ద ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. సికింద్రాబాద్‌ నుంచి కొండాపూర్‌ వెళ్తున్న సిటీ బస్సు జూబ్లీ చెక్‌పోస్టు వద్ద అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టింది. స్కూటీపై వెళ్తున్న ఇద్దరిలో ఒకరు తీవ్రగాయాలపాలై అక్కడిక్కడే ప్రాణాలు విడువగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రున్ని ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement