ప్రొద్దుటూరు క్రైం : ‘రెండు రోజుల్లో కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్ విదేశాలకు చెక్కేసేవాడు. అదృష్టం కొద్దీ ఈ విషయం మాకు తెలిసింది.. లేదంటే బాధితులు మాపై దాడి చేసేవారు’ కేఎస్ఎస్ ట్రావెల్స్ కార్యాలయాల్లో పని చేస్తున్న పలువురు ఆపరేటర్లు పోలీసుల వద్ద స్వయంగా అన్న మాటలు ఇవి. తక్కువ మొత్తంతో ఉమ్రా (పవిత్ర యాత్ర)కు పంపిస్తానని కేఎస్ఎస్ ట్రావల్స్ తరఫున పెద్ద సంఖ్యలో వసూళ్లు చేసి దగా చేయబోయిన సయ్యద్ అల్తాఫ్ హుస్సేన్ అబిది వ్యవహారం బట్టబయలైంది. వైఎస్ఆర్ జిల్లాలోని కడప కేంద్రంగా చేసుకొని దేశవ్యాప్తంగా కేఎస్ఎస్ ట్రావెల్స్ బ్రాంచ్ కార్యాలయాలను ఏర్పాటు చేశారు.
ఈ ఏడాది జనవరి 16 నుంచి ఉమ్రా కోసం ప్రజల నుంచి డబ్బు వసూలు చేశారు. వచ్చే ఏడాదిలో వెళ్లాలనుకునే వారి నుంచి రూ.14 నుంచి 25 వేలు, త్వరగా వెళ్లాలనుకునే వారి నుంచి రూ. 30– 35 వేలు వసూలు చేశారు. ఇక రంజాన్ నెలలో ఉమ్రా చేయాలనుకునే వారు రూ.60 వేలకు పైగా చెల్లించాల్సి వస్తుంటుంది. అయితే కేఎస్ఎస్ ట్రావెల్స్ వారు మాత్రం రూ.35 వేల నుంచి 40 వేలకే తీసుకెళతామని ప్రచారం చేయడంతో.. చాలా మంది బుక్ చేసుకున్నారు. అయితే రంజాన్ వచ్చేసినా ఏ తారీఖున పంపిస్తారన్నది తేల్చలేదు. హెడ్ ఆఫీసు నుంచి ఇందుకు సంబంధించిన సమాచారం లేదని స్థానిక ఉద్యోగులు చెప్పారు. అయితే డబ్బు చెల్లించిన వారి నుంచి ఇటీవల ఒత్తిడి పెరిగింది. దీనికి తోడు ఉమ్రాకు వెళ్లే తేదీలను మార్చడంతో సిబ్బందికి సైతం సందేహాలు మొదలయ్యాయి.
సిబ్బంది సాయంతో కేఎస్ఎస్ ట్రావెల్స్ మోసాలు వెలుగులోకి
కేఎస్ఎస్ ట్రావెల్స్ చైర్మన్, భాగస్వాములు కలిసి దేశం విడిచి వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు ఆపరేటర్లకు సమాచారం అందింది. వాళ్లు విదేశాలకు వెళ్తే ఉమ్రా బాధితులు తమను చంపేస్తారని భావించారు. ఈ క్రమంలోనే చైర్మన్ ఉద్ద ఉన్న ఆపరేటర్ సలహా మేరకు అంతా సమావేశమై చర్చించి ప్రొద్దుటూరు పోలీసులను ఆశ్రయించారు. పోలీసుల సూచనల మేరకు పక్కా ప్రణాళికతో బెంగళూరులో ఉన్న చైర్మన్, ఇతర భాగస్వాములను అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ఆపరేటర్లు, సబ్ ఏజెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. ఇదిలా ఉండగా చైర్మన్కు సంబంధించిన వ్యక్తులు తరచూ తమకు ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని ఆపరేటర్లు వాపోతున్నారు.
ఎంఐఎం ఆలీ ఎవరో మాకు తెలియదు..
పోలీసుల అదుపులో ఉన్న ఎంఐఎం ఆలీ ఎవరో తమకు తెలియదని ఆపరేటర్లు అంటున్నారు. అతనికి చైర్మన్ అల్తాఫ్హుస్సేన్ అబిదితో ఉన్న సంబంధం కూడా తెలియదని అంటున్నారు. ‘ఎంఐఎం ఆలీ బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బు తీసుకున్నాడని అనేక సార్లు మా చైర్మన్ మాతో అనే వారు.. కొన్ని రోజుల క్రితం కూడా ట్రావెల్స్ డబ్బును అతను తీసుకున్నాడు.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేయండని మా చైర్మన్ చెప్పారు’ అని ఆపరేటర్లు పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. ఈ కారణంతోనే ఆలీని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఉమ్రా ముసుగులో ఘరానా మోసం
Published Wed, May 30 2018 3:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
చంద్రబాబుపై నమ్మకం లేకే ఉమ్మడి మేనిఫెస్టోకు బీజేపీ నో
జేబీ పౌడర్తో అండాశయ క్యాన్సర్.. పరిష్కారానికి రూ.54వేలకోట్లు
నడుస్తున్న రైలులో భార్యకు ట్రిపుల్ తలాక్!
శ్రీదేవి మొదటి లగ్జరీ ఇల్లు.. రెంట్కు ఇస్తారట!
ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
అరుదైన గుండె సమస్య.. 23 ఏళ్లకే రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ క్రికెటర్
చంద్రబాబు మేనిఫెస్టోపై పోసాని అదిరిపోయే సెటైర్లు..
లాభాలతో ప్రారంభమైన స్టాక్మార్కెట్ సూచీలు
కడపలో దుమ్ములేపుతున్న అవినాష్ రెడ్డి ఎన్నికల ప్రచారం
బాబుకు గుర్తు గుబులు
తప్పక చదవండి
- ఒకప్పుడు మోదీ ఫాలోవర్.. ఇప్పుడు వారణాసిలో పోటీ
- ‘ఆప్’- కాంగ్రెస్ ఆశలకు బీఎస్పీ గండి కొట్టనుందా?
- MLC Kavitha: కవిత బయటకు వచ్చేనా?
- జయహో జోయా
- రాష్ట్రంలో పోలింగ్ సమయం పెంపు
- ‘కింగ్స్’ పోరులో పంజాబ్దే గెలుపు
- చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
Advertisement