సాక్షి, హైదరాబాద్ : మైనర్పై అత్యాచారం, గంజాయి కేసులో అదిరిపోయే ట్విస్ట్ వెలుగుచూసింది. అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తి ఆమె ప్రియుడేనని తేలింది. వీరిరువురు గత కొద్దికాలంగా ప్రేమించుకుంటున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆ యువతి మరొకరితో చనువుగా మాట్లాడుతోందని ప్రియుడు ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. దీనిపై ఇద్దరి మధ్య అనేక గొడవలు జరిగాయి. వేరే యువకుడితో మాట్లాడుతోందన్న కోపంతో అతడు బాలికపై బ్లేడ్తో దాడి చేశాడు. అయితే ఈ నెల 8వ తేదీన బాలకృష్ణ అనే వ్యక్తి తన కూతురు అదృశ్యమైందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మైనర్ బాలిక కావడంతో కిడ్నాప్ కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అదే రోజు స్వయంగా బాలిక పోలీస్ స్టేషన్కి వచ్చిందని, గత కొంత కాలంగా ఇద్దరి మధ్య శారీరిక సంబంధం కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం అమ్మాయి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు.
గంజాయి గ్యాంగ్
కొద్ది నెలల క్రితం దోమలగూడకు చెందిన 15 మంది అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు ఓ గ్యాంగ్గా ఏర్పడ్డారు. గ్యాంగ్లో నాను అలియాస్ నరేష్, నాగరాజు, బాబా అలియాస్ అభిరామ్లు కీలకమైన వ్యక్తులు. ఆ యువకులు గ్యాంగ్లోని ఇద్దరు అమ్మాయిలకు గంజాయి అలవాటు చేశారు. నాను తండ్రి కారు డ్రైవర్ కాగా అభిరామ్ తండ్రి సుదర్శన్ ల్యాబ్ టెక్నీషియన్. సుదర్శన్కు స్థానికంగా ఉన్న ఓ కార్పోరేటర్ స్నేహితుడు. ఈ గ్యాంగ్కు అలీ అనే వ్యక్తి గంజాయ్ సప్లై చేస్తుంటాడు.
గంజాయి అమ్మాయిలకు తాగించి వారిపై గతంలో పలుమార్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు. వీడియోలు తీసీ బెదిరించిన సంఘటనలు కూడా ఉన్నాయి. గతంలో నాను, అభిరామ్లు కలిసి గ్యాంగ్ సభ్యుల్లో ఇద్దరికి కానిస్టేబుల్ వేషం వేయించారు. తరవాత గంజాయి సప్లై చేసిన అలీని బెదిరించి, అతని దగ్గరనుంచి రూ.18 వేలు తీసుకున్నారు. అలీ నారాయణ గూడ పోలీసులను ఆశ్రయించి వారిపై కేసు పెట్టాడు. ఆ తర్వాత సుదర్శన్ అతడి మిత్రుడైన కార్పోరేటర్ సహాయంతో కేసు మాఫీ చేయించాడు.