మదనపల్లె క్రైం : భార్యను కాపురానికి తీసుకెళ్లేందుకు అత్తగారి ఇంటికి వచ్చిన అల్లుడు పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మదనపల్లె రూరల్ మండలం సీటీఎంలో ఆలస్యంగా గురువారం వెలుగు చూసింది. రూరల్ పోలీసుల కథనం మేరకు.. రామకుప్పం మండలం కృష్ణరాజపురానికి చెందిన రామరాజు కుమారుడు పవన్కుమార్(36)కు 14 ఏళ్ల క్రితం మదనపల్లె మండలం సీటీఎంకు చెందిన వీరనారాయణమ్మతో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పవన్కుమార్ పెయింట్ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఏడాది క్రితం భార్య భర్తతో గొడవపడి పుట్టినింటికి వచ్చేసింది. పలుమార్లు పంచాయితీలు చేసినా, పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చినా ఆమె కాపురానికి వెళ్లలేదు.
బిడ్డలను సైతం భర్తకు దూరం చేసింది. రెండు రోజుల క్రితం అతను సీటీఎంలోని అత్తగారి ఇంటికి వచ్చాడు. భార్యను కాపురానికి రావాలని కోరగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపం చెందిన అతను ఇంటిలోనే పురుగుల మందుతాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం బయటకు తెలియకుండా మృతుడి భార్య, ఆమె కుటుంబ సభ్యులు రెండు రోజుల పాటు దాచారు. మృతదేహం కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతుండడంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అం దించారు. ఎస్ఐ నాయుడు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని మదనప ల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.