విద్యార్థిని ఆత్మహత్య | Sakshi
Sakshi News home page

Published Wed, Sep 5 2018 8:33 PM

Student Commits Suicide In Sulthan Bazar Area - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : నగరంలో పెయింగ్‌ గెయిస్ట్‌గా బస చేస్తున్న విద్యార్థిని రెడ్డి ప్రియ ఆత్మహత్యకు పాల్పడింది. సుల్తాన్‌ బజార్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన.. విద్యార్థిని కుటుంబంలో విషాదం నింపింది. పోలీసుల వివరాల ప్రకారం... వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన రెడ్డి ప్రియ నాలుగు నెలల క్రితం నగరానికి వచ్చింది. సుల్తాన్‌బజార్లోని అను మాన్షన్‌లో పెయింగ్‌ గెస్ట్‌గా ఉంటూ.. మేడ్‌ ఈజీ ఇనిస్టిట్యూట్‌లో గేట్‌ కోచింగ్‌ తీసుకుంటోంది. గత కొంతకాలంగా ఆమె డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బుధవారం ఆత్మహత్యకు పాల్పడింది. కాగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement