అరకు విహారయాత్రలో విషాదం.. | Sakshi
Sakshi News home page

అరకు విహారయాత్రలో విషాదం..

Published Sun, Feb 2 2020 4:49 PM

Student Died In Bus Accident At Araku - Sakshi

సాక్షి, విశాఖపట్నం : అరకులో విషాదం చోటుచేసుకుంది. భీమవరం డీఎన్ఆర్ కాలేజీకి చెందిన 50 మంది విద్యార్థులు ఆదివారం కావడంతో.. అరకు అందాలు తిలకించడానికి విహారయాత్రకు వచ్చారు. ప్రముఖ సందర్శక ప్రాంతమైన బొర్రా గృహాలు రైల్వే గేట్ వద్ద ప్రమాదవశాత్తు పర్యాటక బస్సులో నుంచి ఓ యువకుడు కిందపడిపోయాడు. ఈ క్రమంలోనే పర్యాటక బస్సు అతనిపై నుంచి దూసుకుని పోయింది. ఈ ప్రమాదంలో ప్రేమ్ కుమార్ (21) అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో విద్యార్థుల విహారయాత్రంలో విషాదం నెలకొంది. ఈ ఘటనతో తోటి విద్యార్థులు కన్నీరుమున్నీరవుతున్నారు.
 

Advertisement
Advertisement