ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఇన్నోవా | Sakshi
Sakshi News home page

ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఇన్నోవా

Published Fri, Mar 30 2018 10:19 AM

Teacher Died In Road Accident - Sakshi

ఐరాల: మండలంలోని చవటపల్లె వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బంగారుపాళ్యం మండలం టేకుమందకు చెందిన ఉపాధ్యాయుడు ఇరువారం వెంకటేశు మృతి చెందారు. ఎస్‌ఐ శివశంకర్‌ కథనం.. ఉపాధ్యాయుడు వెంకటేష్‌ కుటుంబ సభ్యులు నలుగురితో కలిసి ఇన్నోవా కారులో కడప రిమ్స్‌ కళాశాలలో చదువుతున్న తన అక్క కూతురు వద్దకు వెళ్లారు. అక్కడ పనిముగించుకుని తిరిగి బయలుదేరారు. ఈ క్రమంలో కర్నూలు–చిత్తూరు జాతీయ రహదారిలో బుధవారం అర్ధరాత్రి 12:30 గంటల ప్రాంతంలో చవటపల్లె వద్ద రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొన్నారు. దీంతో ఉపాధ్యాయుడు వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు కావడంతో వారిని చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఉపాధ్యాయుడి మృతితో టేకుమందలో విషాదం అలుముకుంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement