డాడీ లే డాడీ అంటూ కన్నీరు మున్నీరు | Sakshi
Sakshi News home page

డీసీఎం డ్రైవర్‌ నిర్లక్ష్యం.. ఇద్దరు బలి

Published Fri, May 31 2019 12:36 PM

Two Killed In Road Accident In Nalgonda - Sakshi

సాక్షి, నల్గొండ : జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. చర్లపల్లి బై పాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..  చర్లపల్లి బై పాస్‌ రోడ్డుపై  వెళుతున్న బైక్‌ను డీసీఎం ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతి చెందిన వారిని గుంటూరు జిల్లాకు చెందిన శ్రీనివాసరావు, నర్సింహారావుగా పోలీసులు గుర్తించారు. మృతులిద్దరూ పొట్టకూటి కోసం నార్కట్ పల్లిలోని కామినేని ఆసుపత్రిలో  వాచ్‌మెన్‌లుగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు.

విషయం తెలుకున్న వారి భార్యా పిల్లలు మృతదేహాల వద్దకు వచ్చి బోరున విలపించారు. తండ్రి మృతదేహం వద్ద చేరిన కూతురు ‘‘డాడీ లే డాడీ’’ అంటూ ఏడ్వటం అక్కడి వారిని కంట తడిపెట్టించింది. డీసీఎం డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. పోలీసు అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Advertisement
Advertisement