చీమ చింతకాయల కోసం వెళ్లి.. | Sakshi
Sakshi News home page

చీమ చింతకాయల కోసం వెళ్లి..

Published Thu, Apr 19 2018 5:09 PM

Woman Died In Well In Warangal - Sakshi

చెన్నారావుపేట: చీమ చింతకాయల కోసం వెళ్లి ప్రమాదవశాత్తు బావిలో పడి మహిళ మృతి చెందిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని చెన్నారావుపేట మండలం అమీనాబాద్‌ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఏఎస్సై షేక్‌ షíఫీ, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన మరాటి కోమల(45) తన వ్యవసాయ బావి వద్ద గొర్రెల మంద కావలికి వెళ్లింది. భర్త సాంబయ్య ఇంటి వద్ద ఉన్నాడు. మంద వద్ద ఉన్న కోమల బావికి సమీపంలో ఉన్న చీమ చింతకాయల చెట్టు వద్దకు కాయలు తెంపుకోవడానకి వెళ్లింది.

బావి అంచున ఉన్న కర్రపై నిల్చోని చీమ చింతకాయలు కోస్తుండగా కర్ర విరిగి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. భర్త సాంబయ్య గొర్రెల మంద వద్దకు వెళ్లాడు. అక్కడ భార్య కోమల కనిపించకపోవడంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో చూశాడు. ఎక్కడ కనిపించక పోవడంతో బావిలో చూడగా కోమల అందులో పడి శవమై తేలింది. గ్రామస్తుల సాయంతో మృత దేహాన్ని బయటికి తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సాంబయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై తెలిపారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement