వర్ని(బాన్సువాడ): కోటగిరి మండలం కొడిచర్ల శివారులోని మంజీర నది ఇసుకలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ మచ్కురి రాజ్కుమార్ అలియాస్ రాజు(25) అనే యువకుడు హత్యకు గురయ్యాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. కోడిచర్లకు చెందిన రాజు, పోతంగల్కు చెందిన మరో ముగ్గురు వ్యక్తులు శుక్రవారం రాత్రి ఇసుక తెచ్చేందుకు ట్రాక్టర్లో మంజీర నదికి వెళ్లారు. అక్కడ ఇసుక నింపుతున్న సమయంలో రాజుతో ముగ్గురికి ఘర్షణ జరిగింది. నలుగురు మద్యం సేవించారని తెలిసింది. ఈ క్రమంలో రాజును చంపి ఇసుకలో పాతిపెట్టినట్టు తెలుస్తోంది. నిందితులు ట్రాక్టర్ను తీసుకుని అక్క డి నుంచి పరారయ్యారు. అయితే తన భర్త రాత్రి వెళ్లి తిరిగి రాలేదని శనివారం హతుడి భార్య అంజన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంజీరాలో గాలించగా రాజు మృతదేహం లభ్య మైంది. సంఘటన స్థలాన్ని బోధన్ ఏసీపీ రఘు, రుద్రూర్ సీఐ శ్రీనివాస్ రెడ్డి, ఎస్ఐ రాజ్భరత్ రెడ్డి పరిశీలించారు. హంతకులను ఘటన స్థలానికి తేవాలని కోడిచర్ల, హంగర్గావాసులు డిమాండ్ చేశారు. ఇసుక నుంచి మృతదేహాన్ని బయటకు తీ యకుండా వారు అడ్డుకున్నారు. సమగ్ర విచారణ జరిపిస్తామని పోలీస్ అధికారుల హామీతో శాం తించారు. అనంతరం శవ పంచానామ చేశారు. రాజుకున్న వివాహేతర సంబంధంతోనే హత్య జరిగినట్టుగా భావిస్తున్నారు. నిందితులు పోలీస్స్టేషన్లో లొంగిపోయినట్టు సమాచారం. హతుడు రాజుకు భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
మంజీర నదిలో యువకుడి హత్య
Published Sun, Jul 29 2018 11:52 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
వేలుకు సిరాచుక్క
ఎమ్మెల్యేలకు పరీక్ష!
గీతకార్మికుడికి గాయాలు
ప్రశాంత పోలింగ్కు పటిష్ట బందోబస్తు
పార్లమెంటు ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు
● మూడు నియోజకవర్గాల్లో డిస్ట్రిబ్యూషన్ ● సామగ్రితో పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది ● పర్యవేక్షించిన జిల్లా ఎన్నికల అధికారి బదావత్ సంతోష్
ఓటెత్తాలి..!
ఎన్నికల విధుల్లో ఎన్సీసీ కేడెట్లు
ఎన్నికల విధుల్లో.. ఎస్సై సోదరులు
మండుటెండల్లో గాలివాన బీభత్సం
తప్పక చదవండి
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
- ఐబీవీ, ఆర్పీ ఠాకూర్లపై ఈసీకి వైఎస్సార్సీపీ ఫిర్యాదు!
- పోలింగ్ ఏజెంట్లను బూత్లలోకి రానివ్వడం లేదు: దిలీప్ ఘోష్
- ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ సతీమణి ఓటు గల్లంతు
- AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
- జగనన్నకు కృతజ్ఞతతో.. దివ్యాంగురాలి మాటలు వింటే..
- అందుకే శిల్పా రవికి మద్దతు ఇచ్చాను: అల్లు అర్జున్
- Watch: కుటుంబ సభ్యులతో కలిసి ఓటేసిన సీఎం జగన్
Advertisement