Sakshi News home page

తండ్రి మందలించాడని కుమార్తె ఆత్మహత్య

Published Sat, Aug 3 2019 12:54 PM

Young Women Comits Suicide in Hyderabad - Sakshi

దుండిగల్‌: కళాశాలకు సరిగ్గా వెళ్లడం లేదని తండ్రి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ యువతి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటు చేసుకుంది. ఎస్సై శేఖర్‌రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సూరారం కాలనీ రాజీవ్‌గృహకల్పకు చెందిన ఖయ్యూం, షాజహాన్‌ దంపతుల కుమార్తె అయేషా(18) కూకట్‌పల్లిలోని ఓ ప్రైవేట్‌ కాలేజీలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. మొదటి సంవత్సరంలో ఆమె కొన్ని సబ్జెక్ట్‌లు ఫెయిల్‌ అయింది. దీనికి తోడు రెండో సంవత్సరంలో కాలేజీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటోంది. ఈ విషయంపై తరచూ  గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో శుక్రవారం  ఖయ్యూం  కుమార్తెను మందలించాడు. దీంతో మనస్తానికి గురైన అయేషా ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్‌రూమ్‌లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను సూరారంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు  వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

What’s your opinion

Advertisement