'తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్అప్స్' | Sakshi
Sakshi News home page

'తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్అప్స్'

Published Sun, Mar 26 2017 6:47 PM

'తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్అప్స్' - Sakshi

ఎన్నారై టీఆర్‌ఎస్‌ యుకె, తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్‌డమ్ (టాక్) ఆద్వర్యం లో "'తెలంగాణ గవర్నమెంట్ సక్సెస్ స్టోరీస్ ఆన్ స్టార్ట్అప్స్'" అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్నారై టీఆర్‌ఎస్‌ యుకె  ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల అధ్యక్షతన ప్రారంభమైన కార్యక్రమంలో ముందుగా ఇటీవల యుకె పార్లమెంట్ ముందు జరిగిన ఉగ్ర దాడి లో  ప్రాణాలు కోల్పోయిన వారికి శ్రద్ధాంజలి ఘటించారు. తరువాత ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పెద్దిరాజు సంతాప సందేశాన్ని సభకు తెలిపారు.
దేశానికే ఆదర్శం: యుకె ఎన్నారైలు
అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం మాట్లాడుతూ స్టార్ట్ప్స్ ప్రోత్సాహం మరియు విజయాల్లో తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శనంగా ఉందని తెలిపారు. టీ - హబ్ ద్వారా తెలంగాణ ప్రభుత్వం  చేపడుతున్న కార్యక్రమాలని సభకు వివరించారు.  పలు సందర్భాల్లో తెలంగాణ ఐ.టీ మంత్రి కేటీఆర్‌ చేసిన ప్రసంగాలని సభలో ప్రదర్శించారు. అలాగే తెలంగాణ అభివృద్ధిలో తమ వంతు బాధ్యత నిర్వహిస్తు యువతను  స్టార్ట్ప్ వైపు  ప్రోత్సహిస్తున్న “స్పార్క్ 10  సంస్థ’’  సేవలను ప్రశంశించారు. ముఖ్యంగా సీఈఓ అటల్ మాల్వియా కృషిని అభినందించారు. ఈ కార్యక్రమానికి అన్ని రకాల సహాయాన్ని అందించినందుకు కృతఙ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం టీ హబ్ ద్వారా రూపొందించిన ఆవిష్కరణలు ప్రపంచ స్థాయిలో గుర్తింపు దక్కించుకుంటున్నాయని అన్నారు. ఇటీవలి కాలంలో 4 స్టార్టప్‌లకు అంతర్జాతీయ అవార్డులు దక్కాయని చెప్పారు. ఇందులో "హగ్ ఇన్నొవేషన్స్, లూప్ రియాలిటీ, అథ్‌బేస్, కేతి" ఉన్నాయని తెలిపారు. తెలంగాణ బిడ్డలు ప్రపంచంలో ఎక్కడున్నా గర్వపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్తున్న ముఖ్యమంత్రి కెసిఆర్, కేటీఆర్‌లకి కృతఙ్ఞతలు తెలిపారు.
కేటీఆర్‌ విజనరీ ఉన్న నాయకుడు
ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌కి చెందిన "స్పార్క్ టెన్ ఆక్సిలేటర్"  అనే సంస్థ ప్రోత్సాహంతో  విజయవంతంగా ముందుకు వెళ్తున్న బ్రిస్కీ కంపెనీ యువ స్టార్ట్ప్ వ్యవస్థాపకులు జతిన్ భాటియా మరియు రాజేష్ భుటాడాలు అతిథులుగా పాల్గొన్నారు. వీరు మాట్లాడుతూ తెలంగాణ ఐటీ శాఖా మంత్రి కేటీఆర్‌ విజనరీ ఉన్న గొప్ప నాయకుడని అన్నారు. వారి ప్రతి నిర్ణయం హైదరాబాద్ పేరును ప్రపంచ పటం లో ప్రత్యేకంగా కనిపించేలా ఉన్నాయని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం స్టార్ట్ప్ కు ఇస్తున్న ప్రాధాన్యత మరియు ప్రత్యేక శ్రద్ధ ఎంతో స్ఫూర్తినిస్తుందని పేర్కొన్నారు.

వారి ఆలోచనను ప్రోత్సహించి ముందుకు నడిపించిన "స్పార్క్ టెన్ ఆక్సిలేటర్" కు ఎప్పటికి కృతజ్ఞులుగా ఉంటామని తెలిపారు.  మేము మా వ్యాపారాన్ని పూణేలో ప్రారంభించినా ఇప్పుడు హైదరాబాద్ లోనే స్థిరపడి ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు.  ప్రపంచ వేదికల్లో మాతృ రాష్ట్రం  ఖ్యాతిని ముందుకు తీసుకెళ్తు ఎన్నో కార్యక్రమాలు  చేస్తున్న ఎన్నారై టీఆర్‌ఎస్‌ శాఖను, టాక్ సంస్థని అభినందించారు. తరువాత ఏర్పాటు చేసిన చర్చలో, పలువురు అడిగిన ప్రశ్నలకు జవాబు చెప్పారు.

బంగారు తెలంగాణలో మా పాత్ర ఉంటుంది
టాక్ అధ్యక్షురాలు పవిత్ర కంది మాట్లాడుతూ.. సంస్థ ఆవిర్భవించి తక్కువకాలమే అయినా, మేమంతా తెలంగాణ బ్రాండ్ ని ప్రపంచ వేధికల్లో మార్కెట్ చేయడానికి అన్ని రకాలుగా కృషి చేస్తున్నామని అన్నారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో మా వంతు పాత్ర ఉంటుందని చెప్పారు. భవిషత్తులో తెలంగాణ నుంచి నాయకులని, ప్రభుత్వ ప్రతినిధులని ఆహ్వానించి బిజినెస్ మీట్ లు పెట్టి మా వంతు బాధ్యత నిర్వహిస్తామని తెలిపారు. చివరిగా ఎగ్జిక్యూటివ్ మెంబెర్ రవి రతినేని వందన సమర్పణతో కార్యక్రమాన్ని ముగించారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్‌ఎస్‌  అధ్యక్షులు అనిల్ కూర్మాచలం, టాక్ అధ్యక్షురాలు పవిత్ర రెడ్డి కంది, ఎన్నారై టీఆర్‌ఎస్‌ యుకె  - ఉపాధ్యక్షులు నవీన్ రెడ్డి, అశోక్ దూసరి, శ్రీకాంత్ పెద్దిరాజు, ప్రధాన కార్యదర్శి  రత్నాకర్ కడుదుల, అడ్వైసర్ బోర్డు సభ్యులు దొంతుల వెంకట్ రెడ్డి, సత్యం రెడ్డి కంది, వీర ప్రవీణ్ కుమార్  సెక్రటరీ శ్రీధర్ రావు తక్కలపెల్లి, సృజన్ రెడ్డి, మీడియా ఇంచార్జ్ శ్రీకాంత్ జెల్ల, యూకే,  ఈయూ ఇంచార్జ్ విక్రమ్ రెడ్డి, ఈస్ట్ లండన్ కో ఆర్డినేటర్ నవీన్ మాదిరెడ్డి, ఈవెంట్స్  కో ఆర్డినేటర్స్ నవీన్ భువనగిరి, వెస్ట్ లండన్ ఇంచార్జ్ గణేష్ పాస్తం ,సురేష్ బుడగం, ముఖ్య సభ్యులు రవి కుమార్ రత్తినేని మరియు టాక్ సభ్యులు శ్రీ శ్రావ్య, ప్రవళిక, దీప్తి, రాజేష్ వాక,  స్థానిక ప్రవాసులు ఆర్‌సీ రావు, భాస్కర్ నీల తదితరులు  హాజరయ్యారు.

Advertisement
Advertisement