కుషావతిలో కొట్టుకుపోయిన సుమో: ఒకరి మృతి | Sakshi
Sakshi News home page

కుషావతిలో కొట్టుకుపోయిన సుమో: ఒకరి మృతి

Published Tue, Nov 17 2015 8:47 AM

కుషావతిలో కొట్టుకుపోయిన సుమో: ఒకరి మృతి

పెద్దమండ్యం: చిత్తూరు జిల్లా పెద్దమండ్యం మండలంలోని కుషావతి నది పొంగిపొర్లుతోంది. సోమవారం రాత్రి ఒక సుమో వాహనం వరదనీటిలో కొట్టుకు పోయింది. సుమోలో ఉన్న ఆరుగురిలో ఐదు మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. కలిచెర్లకు చెందిన పుట్టూ(35) అనే యవకుడు సుమో వెనుక సీట్లో ఉండటంతో డోరు తెరుచుకోకపోవడంతో నీట మునిగి మృతి చెందాడు. వివరాలు మండలంలోని కలిచెర్లకు చెందిన అస్లాం (20), ఖదిర్ (40),  ఫయాజ్ (42), ఖాదర్ (39), పుట్టూ(35) తో పాటు మరో ఇద్దరు సాయంత్రం 6 గంటలకు సుమోలో పని నిమిత్తం పెద్దమండ్యంకు వెళ్లారు. పని చూసుకుని రాత్రి 8 గంటలకు తిరుగు ప్రయాణమయ్యారు. పెద్దమండ్యం దాటగానే కుషావతి నది ఉద్ధృతంగా ప్రవహిస్తున్న విషయాన్ని గుర్తించారు. అయినా ఖదిర్ వాహనాన్ని ప్రవాహంలో ముందుకు పోనివ్వడంతొ సుమో బోల్తాపడింది. సుమోలో ఉన్న ఆరుగురిలో ఐదు మంది ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మరొకరు సుమో లో చిక్కుకుపోయి మునిగిపోయాడు.

ఈ విషయం మంగళవారం ఉదయం అధికారులు గర్తించారు. వరద ఉధృతి ఎక్కువగా ఉందని బయటకు వెళ్లవద్దని గ్రామస్తులు వారించినా మద్యం మత్తులో ఉన్న వారు సుమోను నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెబుతున్నారు. సుమోను వెలికి తీసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement