ఇంటర్‌ పరీక్షలకు 1,529 మంది గైర్హాజరు | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ పరీక్షలకు 1,529 మంది గైర్హాజరు

Published Tue, Mar 7 2017 12:32 AM

1529 members absent for inter exams

అనంతపురం ఎడ్యుకేషన్ : ఇంటర్‌ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన మొదటి సంవత్సరం గణితం, బాటనీ, సివిక్స్, ఒకేషనల్‌ పరీక్షల్లో 1,529 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. మొత్తం 39,398 మందికిగనూ 37,869 మంది మాత్రమే హాజరయ్యారు. వీరిలో జనరల్‌ విద్యార్థులు 36,445 మంది ఉండగా 35,119 మందే హాజరయ్యారు. 1,326 మంది గైర్హాజరయ్యారు. అలాగే ఒకేషనల్‌ పరీక్షకు సంబంధించి 2,953 మంది విద్యార్థులకుగాను 2,750 మంది హాజరయ్యారు. 203 మంది గైర్హాజరయ్యారు.

Advertisement
Advertisement