ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సు బోల్తా : 20 మందికి గాయాలు

Published Thu, Oct 1 2015 7:20 AM

20 passengers injured in rtc bus overturned

చిత్తూరు : చిత్తూరు జిల్లా కుప్పం మండలం నడుమూరు వద్ద ఆర్టీసీ బస్సు గురువారం ఉదయం బోల్తా పడింది. ఈ ప్రమాదంతో 20 మంది ప్రయాణీకులు తీవ్రంగా గాయపడ్డారు. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

తమిళనాడులోని కృష్ణగిరి నుంచి కుప్పం వస్తుండగా ఈ బస్సు బోల్తా పడిందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement