- మొదటి ముద్దాయికి లక్ష,
- రెండవ ముద్దాయికి 50వేల జరిమానా
నరసరావుపేట టౌన్ : వివాహిత మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఇద్దరు నిందితులకు 20 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ 13వ అదనపు జిల్లా న్యాయమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం యడ్లపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఆమెపై అదే గ్రామానికి చెందిన కె. అంకమ్మరావు, కె. మహేంద్రబాబులు డిసెంబర్ 5, 2014న లైంగిక దాడికి పాల్పడటంతో పాటు సంఘటనను సెల్ఫోన్లో చిత్రీకరించారు. బాధితురాలి ఫిర్యాదుమేరకు యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ఫోన్లో వీడియోను చూపి బాధిత మహిళను బెదిరింపులకు పాల్పడుతున్న మరో ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో అభియోగçపత్రం దాఖలు చేశారు. విచారణలో ఇద్దరు నిందితులపై నేరం రుజువుకావడంతో మొదటి ముద్దాయి అంకమ్మరావుకు 20 ఏళ్ల జైలు, లక్ష రూపాయల జరిమానా, రెండో ముద్దాయి మహేంద్రబాబుకు 20 ఏళ్ల జైలు, 50వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పుచెప్పారు. కాగా మిగిలిన ఏడుగురు నిందితులపై నేరం రుజువు కాకపోవడంతో కేసును కొట్టివేశారు.