బస్సు-లారీ ఢీ: ముగ్గురు మృతి | Sakshi
Sakshi News home page

బస్సు-లారీ ఢీ: ముగ్గురు మృతి

Published Sun, Sep 11 2016 7:22 AM

3 dies in chittor Road accident

బంగారుపాళ్యం(చిత్తూరు జిల్లా): చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం మొగిలిఘాట్ వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ముగ్గురు మృతిచెందగా, పది మంది తీవ్రంగా గాయపడ్డారు. బెంగుళూరు-చెన్నై జాతీయ రహదారిపై బెంగుళూరు వైపు వెళుతున్న ప్రైవేటు వోల్వో బస్సును లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. లారీ-బస్సు ముందు భాగాలు నుజ్జునుజ్జుఅయ్యాయి. ఈ సంఘటనలో బస్సు డ్రైవర్, మరో మహిళ, లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా మరో పది మంది ప్రయాణికులు గాయపడ్డారు.

క్షతగాత్రులను పలమనేరు, చిత్తూరు, బంగారుపాళ్యం ప్రభుత్వ ఆస్పత్రులకు తరలించారు. ప్రమాదం కారణంగా బస్సు, లారీ రెండూ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో రెండు గంటలపాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. సమాచారం అందుకున్న గంగవరం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ రవికుమార్, బంగారుపాళ్యం ఎస్‌ఐ నెట్టికంఠయ్య పోలీస్ సిబ్బందితో వెళ్లి జేసీబీ ద్వారా వాహనాలను తొలగించి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement