- ఉత్తర్వులు విడుదల చేసిన ప్రభుత్వం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో 32 మండలాలను కరువు కింద ప్రకటిస్తూ శుక్రవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. నైరుతి రుతు పవనాల వల్ల జిల్లాలో ఆశించిన వర్షపాతం నమోదు కాలేదు. ఖరీఫ్లో వర్షాధారంపై సాగు చేసిన పంటలు దాదాపుగా దెబ్బతిన్నాయి. జిల్లాలో 1.34 లక్షల హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగాను 97 వేల హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. ప్రధానంగా వేరుశనగ, పత్తి, కంది, పెసర, మినుము తదితర పంటలు ఎండిపోయాయి.వేరుశనగ పంట ఊడలు దిగే సమయంలో వాన ముఖం చాటేసింది. ప్రభుత్వ రెయిన్గన్ల ప్రయోగం ఫలితాలివ్వలేకపోయింది. ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి సాగు చేసిన పంటలు కళ్లెదుటే ఎండిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలోని 32 మండలాలను కరువు కింద ప్రకటించాలంటూ కలెక్టర్ కేవీ సత్యనారాయణ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. గత బుధవారం రాష్ట్ర స్థాయి డ్రాట్ కమిటీ వివిధ జిల్లాల నుంచి ప్రతిపాదనలను పరిశీలించింది. కలెక్టర్ పంపిన ప్రతిపాదనల మేరకు అన్ని మండలాలను కరువు కింద గుర్తిస్తూ జీఓ నెం. 9 విడుదల చేసింది. జిల్లాలో కరువు సహాయక చర్యలు ప్రారంభించాలని ప్రభుత్వం ఆదేశించింది.
నిబంధనలు ఇవీ..
– ఏదైనా మండలాన్ని కరువు కింద ప్రకటించేందుకు ప్రభుత్వం కొన్ని నిబంధనలను అనుసరిస్తుంది. ఇందులో వర్షపాతలోటు ప్రధానమైంది. సంవత్సర సాధారణ వర్షపాతం 750 మిల్లీ మీటర్లు ఉన్న మండలాల్లో 15 శాతం వర్షపాత లోటు ఉండాలి. జిల్లా సాధారణ వర్షపాతం 700మిల్లీమీటర్లు కనుక ఈ నిబంధన వైఎస్సార్ జిల్లాకు వర్తిస్తుంది. ఈ ఖరీఫ్లో ఈ నిబంధన ప్రకారం పరిశీలిస్తే 32 మండలాల్లో వర్షపాత లోటు నమోదైంది.
– ప్రధాన పంటల సాధారణ సాగు విస్తీర్ణం 50 శాతానికి మించి తగ్గిపోవాలి.
– ఐదు సంవత్సరాల సగటు పంట దిగుబడులతో పోలిస్తే 33 శాతం దిగుబడి నష్టం ఉండాలి.
– పంటలను ప్రభావితం చేసే డ్రై స్పెల్స్ నమోదు ఉండాలి.
– నార్మలైజ్డ్ విజిటేటివ్ డిఫరెన్షియల్ ఇండెక్స్
– పై నిబంధనలలో వర్షపాత లోటు తప్పనిసరిగా ఉండాలి. మిగతా వాటిల్లో ఏదేని రెండు వర్తిస్తే ప్రభుత్వం వాటిని కరువు మండలాల కింద ప్రకటిస్తుంది.
కరువు మండలాలు ఇవీ
కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, సింహాద్రిపురం, లింగాల, పులివెందుల, తొండూరు, చక్రాయపేట, గాలివీడు, చిన్నమండెం, సంబేపల్లె, సుండుపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, బ్రహ్మంగారిమఠం, గోపవరం, బద్వేలు, అట్లూరు, కొండాపురం, మైలవరం, పెద్దముడియం, రాజుపాలెం, బి.కోడూరు, ముద్దనూరు, వేముల, వీరపునాయునిపల్లె, కమలాపురం, చింతకొమ్మదిన్నె, పెండ్లిమర్రి, వేంపల్లె, రామాపురం, వీరబల్లి.
జిల్లాలో 32 కరువు మండలాలు
Published Fri, Oct 21 2016 10:38 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
చెస్ గ్రాండ్మాస్టర్ల కర్మాగారంలా మారిన భారత్.. 1987లో ఒక్కరే.. ఇప్పుడు..!
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
తప్పక చదవండి
- ఓపిక నశించింది.. అమోథీలో కాంగ్రెస్ కార్యకర్తల ఆందోళన
- అషూ రెడ్డి మరింత హాట్గా.. శ్రియ ఇలా అయిపోయిందేంటి?
- ఓ వైపు రాహుల్ ఎన్నికల ప్రచారం.. మరోవైపు బీజేపీలోకి కాంగ్రెస్ కీలక నేత
- కోటి 50 లక్షలు పోగొట్టుకున్నా.. జనసేన మాజీ నాయకురాలు సుభాషిణి
- ఎంపీ రాఘవ్ చద్దా ఎక్కడా?.. స్పందించిన ఆమ్ ఆద్మీ పార్టీ
- కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
- చత్తీస్గఢ్లో మళ్లీ ఎన్కౌంటర్.. ఏడుగురు మావోయిస్టుల మృతి
- లాలూ కుమార్తె ఆస్తిపాస్తులెంత? అఫిడవిట్లో ఏముంది?
- ఓటర్ల సంఖ్యను పెంచడానికి కొత్త వ్యూహం.. ప్రతి రెండు గంటలకు ఓ విన్నర్
- అలాంటి సినిమాలే చేస్తా.. వివాదంపై స్పందించిన నయనతార
Advertisement