రోడ్డు ప్రమాదంలో 35 మందికి గాయాలు | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో 35 మందికి గాయాలు

Published Wed, Jul 27 2016 4:28 PM

35 injured in road accident

ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో 35 మందికి స్వల్ప గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ సంఘటన నెల్లూరు జిల్లా నాయుడుపేట కార్పోరేషన్ బ్యాంక్ సమీపంలోని పెట్రోల్‌బంక్ వద్ద బుధవారం చోటుచేసుకుంది. వెంకటగిరి నుంచి చిత్తూరు జిల్లా శ్రీసిటీలోని సెల్‌ఫోన్ కంపెనీలో విధులు నిర్వహించేందుకు వెళ్తున్న ఉద్యోగుల బస్సును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 35 మంది మహిళలకు చిన్న చిన్న గాయాలయ్యాయి. అందులో ముగ్గురి పరిస్థితి విసమంగా ఉండటంతో.. నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో బస్సులో 55 మంది ప్రయాణికులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Advertisement

తప్పక చదవండి

Advertisement