కొణిజర్ల: ఖమ్మం జిల్లా భద్రాచలానికి చెందిన తూము సాయి స్నేహిత కూచిపూడి నృత్యంలో కొత్త రికార్డును సృష్టించింది. స్థానికంగా ఏడో తరగతి చదువుతున్న పదకొండేళ్ల విద్యార్థిని 4 గంటల 8 నిమిషాల 4 సెకండ్లపాటు ఏకధాటిగా నృత్యం చేసి.. విజయవాడకు చెందిన ఎం.చంద్రిక రికార్డును తిరగరాసింది. కొణిజర్ల మండలం తనికెళ్లలోని లక్ష్య ఇంజనీరింగ్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన నృత్య ప్రదర్శనను వండర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏ.ప్రసాద్, జీనియస్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డు ప్రతినిధి ఏఆర్.స్వామి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి డాక్టర్ బొమ్మారెడ్డి శ్రీనివాసరెడ్డి తిలకించి.. రికార్డులు నమోదు చేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గడిపల్లి కవిత బాలికకు రికార్డును ప్రదానం చేశారు. స్నేహిత, ఆమె గురువు కొండలరావును సన్మానించారు.
4 గంటల పాటు ఏకధాటిగా నృత్యం..
Published Sat, Dec 5 2015 5:09 AM
Related news
-
ఇష్టాన్నే ఉపాధిగా మార్చుకున్న గృహిణి.. ఆదాయంతో పాటు అవార్డులు కూడా
ఇష్టంగా నేర్చుకోవాలే కానీ మట్టి కూడా పాఠాలు నేర్పుతుంది. కొత్త ఆవిష్కరణలతో పాటు ఉపాధికీ బాటలు వేస్తుంది. హైదరాబాద్లోని ఏఎస్రావు నగర్లో ఉంటున్న సంగిశెట్టి సంగీత తన కళ ద్వారా ఈ విషయాన్ని మనందరికీ చాటుతోంది. సరదాగా నేర్చుకున్న కళ ద్వారా ఉపాధి పొందుతూ, మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పిస్తోంది. ‘‘కస్టమైజ్డ్ గిఫ్ట్ ఆర్టికల్స్, ఇంటి అలంకరణ వస్తువులు, ఆన్లైన్, ఆఫ్లైన్ వర్క్షాప్స్.. ఆర్టిస్ట్గా నాకు నేను గుర్తింపు సంపాదించుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. నేటి రోజులకు తగినట్టు స్టాచ్యూ, త్రీడీ ఎఫెక్ట్స్, క్యూబిజమ్, జపనీస్ ఆర్ట్, మల్టీపర్పస్ గిఫ్ట్ ఆర్టికల్స్ తయారుచేస్తుంటాను. ఇవన్నీ మట్టితో రూపొందించేవే. ఎకో, పాటరీ క్లే, పాలిమర్ క్లే, మోడలింగ్ క్లేతో కళారూపాల రూపకల్పన ఉంటుంది. ఇవి ఎప్పటికీ పాడవవు. నీటిలో కరగవు, కిందపడినా పగిలిపోవు. ఇల్లు, ఆఫీసులలో అలంకరణ వస్తువులుగా క్లే ఆర్ట్ కళాకృతులను ఎక్కువ వినియోగిస్తుంటారు. డిజైన్ బట్టి ధర ఉంటుంది. రెయిజన్ మెటీరియల్తో కస్టమైజ్డ్ గిఫ్ట్ ఐటమ్స్, షాడో బాక్స్లు.. పెళ్లి, పుట్టిన రోజులు వంటి సందర్భాన్ని పురస్కరించుకొని వచ్చిన ఆర్డర్స్ని బట్టి డిజైన్స్ చేస్తుంటాను. పెన్సిల్, చార్కోల్, మ్యూరల్, ఆయిల్ పెయింటింగ్స్ కూడా నా రోజు వారి వర్క్లో భాగమే. వర్క్షాప్స్ ఎం.కామ్. వరకు చదువుకున్నాను. పెళ్లి, పిల్లలు జీవితంలో ఎప్పుడూ హడావిడి ఉంటూనే ఉంటుంది. ఉద్యోగం చేయాలనుకున్నా వద్దనుకొని, హాబీకే టైమ్ కేటాయించాను. ఇదే ఉపాధిగా మారుతుందని ముందు అనుకోలేదు. కానీ, ఇష్టమైన పనే ఆదాయమార్గాన్ని కూడా చూపిస్తుందని వచ్చిన ఆర్డర్స్ ద్వారా అర్థమైంది. ‘డూడుల్ బగ్స్ పేరుతో ఆర్ట్ స్టూడియో ఏర్పాటు చేశాను. ఆన్లైన్ ద్వారా అమెరికా, కెనడాలోనూ నాకు స్టూడెంట్స్ ఉన్నారు. కొందరు గృహిణులు గ్రూపుగా ఏర్పడి తమకు ఈ క్లే ఆర్ట్ నేర్పించమని అడుగుతారు. ఐదారుగురు గ్రూప్గా ఉన్నా వారి కోసం వర్క్షాప్స్ నిర్వహిస్తుంటాను. ఇప్పటికి వందల సంఖ్యలో మహిళలు శిక్షణ తీసుకున్నవారున్నారు. ప్రతిరోజూ సాయంకాలాలు క్లే ఆర్ట్ ట్రెయినింగ్ క్లాసులు తీసుకుంటాను. వచ్చిన ఆర్డర్స్ను బట్టి నా దగ్గర వర్క్ నేర్చుకున్న వాళ్లకు అవకాశాలు ఇస్తుంటాను. రికార్డులు తెచ్చిన ఆర్ట్ రెండేళ్ళ క్రితం పిస్తా పొట్టుపై చేసిన మైక్రో క్లే ఆర్ట్ మంచి పేరుతో పాటు అవార్డులు కూడా తెచ్చిపెట్టింది. పండ్లు, కూరగాయలు, స్వీట్లు, ఇతర ఆహార పదార్థాలు 150 కంటే ఎక్కువ రకాలు పిస్తాపొట్టుపై 74 గంటలలో చేసి చూపించాను. ఈ సూక్ష్మ కళా నైపుణ్యాలను తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రశంసించింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్లో చోటు వచ్చేలా చేసింది. వర్చువల్ అవార్డులూ వరించాయి. సాధనమున.. ఆసక్తి ఉండి, ఫీజు చెల్లించలేం అనుకునేవారికి మెటీరియల్ ఇచ్చి మరీ ఈ వర్క్స్ నేర్పిస్తుంటాను. ఏ కళ అయినా సాధన చేస్తూ ఉంటే కొత్త కొత్త నైపుణ్యాలు వచ్చి చేరుతాయి. అవే ఉపాధికి మార్గం చూపుతాయి. అందుకే, వర్క్ నేర్చుకున్నవాళ్లను మోటివేట్ చేస్తూ, తమను తాము బిల్డ్ చేసుకునేలా గైడెన్స్ ఇస్తుంటాను. నాకు ఇష్టమైన పని కావడంతో మరింత కొత్తదనం కోసం సాధన చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ కళారంగంలో ఇష్టమే పెట్టుబడి అవుతుంది’’ అని వివరిస్తుంది ఈ హార్టిస్ట్. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: నోముల రాజేష్రెడ్డి -
24 గంటలపాటు ప్రసంగం
విద్యారణ్యపురి: కృషి, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించింది ప్రియాంక సుంకురుశెట్టి. 24 గంటలపాటు నిరంతరాయంగా ప్రసంగించి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. సూర్యాపేటకు చెందిన ప్రియాంక హనుమకొండ నక్కలగుట్టలోని ఆస్పైర్ క్లినీ అకాడమీలో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి సోమవారం ఉదయం 9:30 గంటల వరకు 24 గంటపాటు ‘సన్రైజ్ టు సన్రైజ్’పేరుతో మారథాన్ లెక్చర్ ఇచ్చారు. ప్రతిగంటకు 5 నిమిషాల చొప్పున విశ్రాంతి తీసుకున్నారు. క్లినిక్ రీసెర్చ్ అండ్ క్లినిక్ డేటా మేనేజ్మెంట్ తదితర అంశాలపై 24 గంటల పాటు ఆమె ప్రసంగించారు. తెలుగు బుక్ ఆఫ్ జ్యూరీ సభ్యుడు టీవీ అశోక్కుమార్, అబ్జర్వర్లు నిమ్మల శ్రీనివాస్, వనపర్తి పద్మావతి ఇతర విషయ నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం హనుమకొండ వాగ్దేవి కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆమెకు సర్టిఫికెట్ అందజేశారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో పాలమూరు బుడ్డోడు
బాలానగర్: మహబూబ్నగర్ జిల్లాకు చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థి తన ప్రతిభతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు. తాజాగా ఆ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు దక్కించుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. బాలానగర్ మండలంలోని నేరళ్లపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న పాత్లావత్ పురందాస్ విద్యార్థి తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించాడు. చదవండి: కీడు శంకించిందని గాంధీ విగ్రహాన్ని పక్కన పడేశారు ప్రముఖ కవి గిడుగు రామమూర్తి జయంతి (ఆగస్టు 29) సందర్భంగా ఆగస్టు 21 నుంచి 29వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహించారు. జూమ్ ఆప్ ద్వారా నిర్వహించిన కవితా పఠనంలో పురందాస్ పాల్గొని ప్రతిభ చాటాడు. ఈ సందర్భంగా తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో చోటు దక్కించుకున్నాడు. నిర్వాహకులు విద్యార్థికి ప్రశంసా పత్రాన్ని అందించారు. చదవండి: మద్యం తాగితే రూ.10 వేల జరిమానా ఈ కార్యక్రమంలో దేశ విదేశాల నుంచి సుమారు వెయ్యి మందికి పైగా వ్యక్తులు ఇందులో పాల్గొన్నారు. ఈ విషయమై పాఠశాల తెలుగు అధ్యాపకురాలు చైతన్య భారతిని పాఠశాల హెచ్ఎం పాండురంగారెడ్డితో పాటు సర్పంచ్ ఖలీల్, గోపి, ఎంఎంసీ చైర్మన్ శేఖర్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, ఉమాదేవి, రాజేందర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, శారదాదేవి తదితరులు హర్షం వ్యక్తం చేశారు. -
వండర్బుక్లో మణిపూసలు
తాండూరు టౌన్ : వికారాబాద్ జిల్లా తాండూరు ఆణిముత్యం, మణిపూసల సృష్టికర్త, కవి వడిచర్ల సత్యంకు అరుదైన గౌరవం దక్కింది. ఆయన పరిచయం చేసిన ‘మణిపూసలు’ అనే నూతన కవితా ప్రక్రియకు అంతర్జాతీయ వండర్ బుక్ ఆఫ్ రికార్డు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డు, తెలుగు బుక్ ఆఫ్ రికార్డుల్లో స్థానం దక్కింది. ఈ సందర్భంగా బుధవారం తెలుగు సాహిత్య కళాపీఠం ఆధ్వర్యంలో త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో వడిచర్ల సత్యం దంపతులను వండర్బుక్ వారు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి3 ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ అయాచితం శ్రీధర్ మాట్లాడుతూ.. సత్యం సృష్టించిన మణిపూసలు కవితా ప్రక్రియ అతి తక్కువ కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ప్రపంచ తెలుగు సాహిత్యంలోనూ గుర్తింపు పొందిందన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ ఏనుగు నర్సింహ్మారెడ్డి మాట్లాడుతూ.. ఇటీవల తెలుగు సాహిత్య లోకంలో 30 వరకు నూతన కవితా ప్రక్రియలు వచ్చాయని, అయితే అన్నింటిలోకెల్లా మణిపూసలను అనేక మంది కవులు అనుసరించారన్నారు. ఈ కార్యక్రమంలో నేషనల్ బుక్ ట్రస్టు అధికారి మోహన్, నేటినిజం పత్రికా సంపాదకులు దేవదాస్, రామదాసు, సమ్మన్న, వండర్ బుక్ భారత్ కోఆర్డినేటర్ బింగి నరేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అంజిలప్పకు సన్మానం... బొంరాస్పేట: తెలుగు సాహిత్యంలోకి నూతనంగా ప్రవేశించిన కవితా ప్రక్రియ ‘మణిపూసలు’ రచనల్లో మండల పరిధిలోని రేగడిమైలారానికి చెందిన రచయిత అంజిలప్పకు సన్మానం దక్కింది. నియోజకవర్గం నుంచి మణిపూసలు రాసినందుకు గానూ పలువురు సాహితీవేత్తలు అంజిలప్ప సత్కరించారు. -
తెలుగు పద్యాలను అలవోకగా చెప్తున్న చిన్నారి
తెలుగు పద్యాలను అలవోకగా చెప్తున్న చిన్నారి
Related News by category
-
అధికారులు జవాబుదారీగా వ్యవహరించాలి
ఖమ్మం సహకారనగర్: గ్రామపంచాయతీల ప్రత్యేక అధికారులు జవాబుదారీతనంతో వ్యవహరిస్తూ సమస్యల పరిష్కారానికి పాటుపడాలని అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్ సూచించారు. కలెక్టరేట్లో సోమవారం ఆయన జీపీల ప్రత్యేక అధికారులతో సమావేశమై పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా తదితర అంశాలపై సమీఓఇంచచారు. గ్రామాలు పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షిస్తుండడంతో పాటు తాగునీటి సరఫరాకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. మిషన్ భగీరథ సరఫరా లేని చోట ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని, అవసరమైతే ప్రైవేట్ వనరులను లీజ్కు తీసుకోవాలన్నారు. అలాగే, నర్సరీలు, విద్యుద్దీపాలు, అంతర్గత రహదారుల నిర్వహణపై దృష్టి సారించాలని, సకాలంలో పన్నులు వసూలు చేయడమే కాక ప్రజలు వడదెబ్బ బారిన పడకుండా అవగాహన కల్పించాలని సూచించారు. ఈసమీక్షలో జెడ్పీ సీఈఓ వినోద్, డీఆర్డీఓ సన్యాసయ్య పాల్గొన్నారు. ఏకలవ్య మోడల్ స్కూళ్లలో ప్రవేశానికి పరీక్ష భద్రాచలంటౌన్: ఉమ్మడి జిల్లాలోని తెలంగాణ ప్రభుత్వ ఏకలవ్య మోడల్ సంక్షేమ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలుకల్పించేందుకు ఈనెల 28న పరీక్ష నిర్వహించనున్నట్లు భద్రాచలం ఐటీడీఏ పీఓ ప్రతీక్జైన్ తెలిపారు. ఈనెల 28న ఉదయం 10.30 గంటల నుంచి 12.30 వరకు పరీక్ష ఉంటుందని పేర్నొన్నారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు https:// tsemrs. telangana. gov. in వెబ్సైట్ ద్వారా హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. పరీక్షల నిర్వహణకు భద్రాద్రి జిల్లాలో మూడు, ఖమ్మం జిల్లాలో ఒక కేంద్రం ఏర్పాటు చేసినట్లు పీఓ తెలిపారు. స్వచ్ఛమైన తాగునీరు అందించాలి వైరా: వైరా రిజర్వాయర్ వద్ద సక్రమంగా క్లోరినేషన్ చేయడం ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని మిషన్ భగీరథ ఈఎన్సీ కృపాకర్రెడ్డి ఆదేశించారు. వైరా రిజర్వాయర్ గుట్టపై బోడేపూడి సుజల స్రవంతి పథకం, మిషన్ భగీరథ ఇన్ టేక్వెల్ ప్రాంతాలను సోమవారం ఆయన పరిశీలించారు. ఇటీవల రిజర్వాయర్ నుంచి రంగు మారిన నీరు సరఫరా అవుతుందనే ప్రచారంతో పరిశీలించిన ఆయన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం రిజర్వాయర్లో నీటి నిల్వలు, క్లోరినేషన్ విధానంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్కు చేరుతున్న నేపథ్యాన నీరు కలుషితం కాకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సీఈ కె.శ్రీనివాస్, ఎస్ఈ సదాశివకుమార్, ఈఈలు వాణిశ్రీ, పుష్పలత, డీఈ నర్సింహమూర్తి, ఏఈ మణిశంకర్ పాల్గొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఉపేక్షించేది లేదు తల్లాడ ప్రమాదంపై ఎన్పీడీసీఎల్ సీఎండీ ఆగ్రహం ఖమ్మంవ్యవసాయం: విద్యుత్ ఉద్యోగులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించేది లేదని ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి హెచ్చరించారు. జిల్లాలోని తల్లాడ సబ్స్టేషన్లో ఆదివారం ట్రాన్స్ఫార్మర్ పేలగా లైన్మెన్గా గాయాలయ్యాయి. ఈ నేపథ్యాన సీఎండీ సోమవారం ఫోన్ చేసి వివరాలు ఆరా తీశారు. ఉద్యోగులు, సిబ్బంది విధినిర్వహణలో నిబంధనలు పాటించాలని, పనిప్రాంతంలో గ్లౌజ్లు, హెల్మెట్ విధిగా ధరించాలని సూచించారు. తల్లాడ సబ్స్టేషన్లో జరిగిన ప్రమాదానికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని పేర్కొన్న సీఎండీ.. అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూనే విధిగా భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. -
కలెక్టర్ను కలిసిన సివిల్స్ ర్యాంకర్
ఖమ్మం సహకారనగర్/ఖమ్మం క్రైం/ఖమ్మం మయూరిసెంటర్: ఇటీవల విడుదలైన సివిల్స్ ఫలితాల్లో 938వ ర్యాంక్ సాధించిన బోనకల్ మండలం గోవిందాపురం(ఎల్)కు చెందిన సాయి అలేఖ్య సోమవారం కలెక్టరేట్లో కలెక్టర్ వీ.పీ.గౌతమ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆమెను కలెక్టర్ సత్కరించారు. ఆతర్వాత సీపీ సునీల్దత్ను కూడా కలవగా ఆయన సాయిఅలేఖ్యతో పాటు ఆమె తండ్రి మధిర టౌన్ పోలీస్స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ రావూరి ప్రకాశ్రావు – పద్మశ్రీ దంపతులను సన్మానించారు. అదనపు కలెక్టర్ బి.సత్యప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్ మ్రినాల్ శ్రేష్ఠ, ఏఎస్పీ అవినాష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఇక సాయి అలేఖ్యను ఖమ్మంలోని బీసీ స్టడీసర్కిల్లో సత్కరించారు. స్టడీసర్కిల్లో గ్రూప్స్, డీఎస్సీ శిక్షణ పొందుతున్న అభ్యర్థులతో ముఖాముఖి ఏర్పాటుచేయగా.. ఆమె పాల్గొని ఉద్యోగాలకు సన్నద్ధతపై సూచనలు చేశారు. బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ శ్రీలత, అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే, సాయిఅలేఖ్య చదువుకున్న త్రివేణి పాఠశాల, సెంచరీ స్కూల్లో కూడా ఆమెను సన్మానించారు. త్రివేణి డైరెక్టర్లు గొల్లపుడి వీరేంద్రచౌదరి, యార్లగడ్డ వెంకటేశ్వరరావు, ప్రిన్సిపాల్ రాజేంద్రప్రసాద్తో పాటు సీహెచ్.అప్పారావు, స్వప్న, ముస్తఫా, అశోక్, చార్లెస్, సందీప్, సెంచరీ స్కూల్లో కరస్పాండెంట్ డీవీఎస్.ప్రభాకర్రావు, డైరెక్టర్ మాధవీలతతో పాటు స్వరూప, కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. సాయిఅలేఖ్యను సన్మానించిన కలెక్టర్, సీపీ -
గులాబీకి సవాల్..
ఖమ్మం లోక్సభ ఎన్నిక బీఆర్ఎస్కు సవాల్గా మారింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీ మెజార్టీ ఓట్లు సాధించడం ఎదురీతకు కారణమవుతోంది. లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మొత్తంగా 2.65 లక్షల ఎక్కువ ఓట్లను కాంగ్రెస్ సొంతం చేసుకుంది. ఈ వ్యత్యాసాన్ని విశ్లేషిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనన్న ఉత్కంఠ బీఆర్ఎస్ నేతలు, శ్రేణుల్లో నెలకొంది. ఇక్కడ విజయం కోసం బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షుడు తాతా మధు సర్వశక్తులొడ్డుతున్నా ఫలితం ఎలా ఉండబోతోందన్న చర్చ రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. – సాక్షి ప్రతినిధి, ఖమ్మంనాడు అధికారంలో.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని ఖమ్మంలో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ విజయం సాధించారు. ఆ తర్వాత ఆరు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, టీడీపీ, ఇండిపెండెంట్లుగా గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్లో చేరారు. అనంతరం 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావుకు 5,67,459 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి. దీంతో 1,68,065 ఓట్ల మెజార్టీతో నామ విజయబావుటా ఎగురవేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నాడు 14.74 శాతం ఓట్ల వ్యత్యాసం వచ్చింది. బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ సునాయాసంగా గెలిచింది. కాగా, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ పరిధి ఏడు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులకు 5,18,194 ఓట్లు వస్తే.. పార్లమెంట్ ఎన్నికల్లో నామాకు 49,265 ఓట్లు మాత్రమే అదనంగా నమోదయ్యాయి. ఇప్పుడు భారీ వ్యత్యాసం తాజా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లను పరిశీలిస్తే భారీ వ్యత్యాసం ఉంది. ఖమ్మం లోక్సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్తో పాటు పొత్తులో భాగంగా సీపీఐ అభ్యర్థులకు 7,33,293 ఓట్లు వచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్థులకు 4,67,639 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. తద్వారా కాంగ్రెస్ కూటమి 2,65,654 ఓట్ల మెజార్టీని సాధించినట్లయింది. ఈ గణాంకాలను పరిశీలిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో తమ అభ్యర్థి గెలుపు నల్లేరుపై నడకేనని ధీమా వ్యక్తం చేస్తోంది. మరోపక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్లు తగ్గడం.. అధికారంలో కూడా లేకపోవడంతో బీఆర్ఎస్ అభ్యర్థికి ఎదురీత తప్పదా అన్న చర్చ కొనసాగుతోంది. ఖమ్మం లోక్సభ ఎన్నికలో బీఆర్ఎస్ ఎదురీత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకు మెజార్టీ ఓట్లు ఆ పార్టీతో పోలిస్తే ‘కారు’కు 2.65 లక్షల ఓట్ల వ్యత్యాసం ఈ ఎన్నికల్లో ఓటరు తీర్పు ఎటువైపోనని ఉత్కంఠపట్టు దొరికేది ఎక్కడ.. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖమ్మం నియోజకవర్గంలో 49,381 ఓట్ల మెజార్టీ, పాలేరులో 56,650 మెజార్టీ, సత్తుపల్లిలో 19,440 ఓట్లు, మధిరలో 35,452 ఓట్ల మెజార్టీ, వైరాలో 33,045 ఓట్లు, కొత్తగూడెంలో సీపీఐ అభ్యర్థి 42,781 ఓట్ల మెజార్టీ, అశ్వారావుపేటలో 28,905 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఎక్కడా కూడా బీఆర్ఎస్ అభ్య ర్థులు కాంగ్రెస్ అభ్యర్థులకు గట్టిపోటీ ఇవ్వలేక పోయారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థులకు ఏడు నియోజకవర్గాల్లోనూ భారీ మెజార్టీ రావడంతో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఏ అసెంబ్లీ పరిధిలో ఎలా ఓట్లు దక్కించుకోవాలి, ఎక్కడ పట్టు దొరుకుతుందనే లెక్కల్లో బీఆర్ఎస్ నేతలు మునిగితేలుతున్నారు.ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి, బీఆర్ఎస్కు వచ్చిన ఓట్లు.. నియోజకవర్గం కాంగ్రెస్ బీఆర్ఎస్ ఖమ్మం 1,36,016 86,635 పాలేరు 1,27,820 71,170 సత్తుపల్లి 1,11,245 91,805 మధిర 1,08,970 73,518 వైరా 93,913 60,868 కొత్తగూడెం (సీపీఐ) 80,336 37,555 అశ్వారావుపేట 74,993 46,088 మొత్తం 7,33,293 4,67,639 -
ఉక్కపోతతో బాలింతలు, చిన్నారుల అవస్థ
ఎంసీహెచ్లో మొరాయిస్తున్న ఏసీలుఖమ్మంవైద్యవిభాగం: ప్రచండ భానుడి ప్రభావంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. జిల్లాలో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇక ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి మాతా శిశు ఆరోగ్య కేంద్రం(ఎంసీహెచ్)లో చికిత్స పొందుతున్న బాలింతలు వేడి తట్టుకోలేక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పలు వార్డుల్లో ఏసీలు సరిగ్గా పనిచేయకపోవడంతో అధికారులు కొన్నిచోట్ల కూలర్లు బిగించారు. అయినా గాలి సరిపోక పలువురు ఇళ్ల నుంచి టేబుల్ ఫ్యాన్లు తెచ్చుకుని వేడి నుంచి ఉపశమనం పొందుతున్నారు. -
‘మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం’
● ఎంపీగా నామను గెలిపిస్తేనే అది సాధ్యం ● ప్రచార సమావేశాల్లో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుఖమ్మం రూరల్/తిరుమలాయపాలెం: అసెంబ్లీ ఎన్నికలకు ముందు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్పాలంటే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి నామ నాగేశ్వరరావు గెలిపించాలని పలువురు పిలుపునిచ్చారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం, తిరుమలాయపాలెం మండలం పిండిప్రోలులో జరిగిన ప్రచార సమావేశాల్లో అభ్యర్థి నామతో పాటు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎమ్మెల్యేలు కందాళ ఉపేందర్రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రైతులు, సామాన్య ప్రజల కష్టాలు కళ్లెదుటే కనబడుతున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజల హక్కులను కాపాడాలన్నా, జిల్లా అభివృద్ధి చెందాలన్నా నామ గెలుపు తప్పనిసరని చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించినందుకు తప్పు చేశామని భావిస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ హయాంలో అమలైన సంక్షేమ పథకాలను వివరిస్తూ నామ గెలుపునకు పాటుపడాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కాగా, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలను తొలగించడమే కాక హామీలను నెరవేర్చడం లేదంటూ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా పాట రూపంలో వివరించారు. అలాగే, బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్న పోలీసులు తీరు మార్చుకోవాలని సూచించారు. ఈ సమావేశాల్లో ఎంపీపీ బి.ఉమ, నాయకులు తాళ్లూరి జీవన్కుమార్, బెల్లం వేణు, బాషబోయిన వీరన్న, గుడిబోయిన దర్గయ్య, లక్ష్మణ్, వెంకటేశ్వర్లు, ఏ.వరప్రసాద్, దేవరం దేవేందర్రెడ్డి, మాలతి, చావా వేణు, ఆలస్యం నాగేశ్వరరావు, రవి, చామకూరి రాజు తదితరులు పాల్గొన్నారు. ● ఖమ్మం లీగల్: బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఖమ్మం కోర్టు ప్రాంగణంలో న్యాయవాదులు, న్యాయ శాఖ ఉద్యోగులను కలిసి తనను గెలిపించాలని కోరారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ నాయకులు బిచ్చాల తిరుమలరావు, కొత్తా వెంకటేశ్వరరావు, మేకల సుగుణారావు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Photos
View allVideo
View allమారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఐవోసీ లాభం సగానికి డౌన్
సిగ్గూ ఎగ్గూ లేని తెంపరితనం
సెల్ఫ్–మేడ్ మ్యూజిక్ స్టార్స్
మే డే స్ఫూర్తిని కాపాడుకోవాలి!
ధర పెరిగినా బంగారమే
PrajwalRevannavideo: త్వరలో భారత్కు ప్రజ్వల్ రేవణ్ణ..?
కాంగ్రెస్ ప్రేమ దుకాణాల్లో ఫేక్ వీడియోలు
IPL 2024: ఉత్కంఠ పోరులో లక్నో విజయం.. ముంబై ఇక ఇంటికే!
పార్టీ నుంచి ప్రజ్వల్ సస్పెండ్
‘ఆల్ ఫ్రీ బాబు’ పునరాగమనం
తప్పక చదవండి
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- ఆ హీరోయిన్ నన్ను మునిగిపోకుండా కాపాడింది: టాలీవుడ్ హీరో
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
- బీజేపీలో చేరిన నటి రూపాలీ గంగూలీ
- ఆస్ట్రేలియా నుంచి వచ్చిన ఓటరుకు నిరాశే
- పెళ్లయిన నెలకే విడాకులా? ఆ కామెంట్స్పై క్లారిటీ ఇచ్చిన నటి
- Hassan sex scandal: రాజుకుంటున్న పెన్డ్రైవ్
- లోకం చెడ్డదేం కాదు బాస్.. హార్ట్ టచింగ్ వీడియో
- ఏడు పదుల వయసులో ఇదేం కోరిక..ఏకంగా గర్ల్ఫ్రెండ్ కావాలంటూ..!
Advertisement