శ్రీవారికి రూ.71 లక్షల విరాళం | Sakshi
Sakshi News home page

శ్రీవారికి రూ.71 లక్షల విరాళం

Published Sat, Jul 23 2016 8:06 PM

దాతల విభాగంలో అధికారులు డీడీ అందజేస్తున్న చెన్నయ్‌ సిల్క్స్‌ అధినేత కె.మాణిక్యం

 
సాక్షి, తిరుమల:
తిరుమల శ్రీవారికి శనివారం రూ.71 లక్షల విరాళం అందింది. ఇందులో చెన్నయ్‌ సిల్క్స్‌ అధినేత కె.మాణిక్యం రూ.50 లక్షల విరాళం డీడీ సమర్పించారు. ఇక్కడి దాతల విభాగంలో శ్రీవారి ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ఈసందర్భంగా దాతకు లడ్డూ ప్రసాదాలు అందజేశారు.అలాగే, నిత్యానప్రసాదం ట్రస్టుకోసం రూ.15 లక్షలు , విద్యాదానం కోసం రూ.2 లక్షలు, గో సంరక్షణ ట్రస్టుకోసం రూ. 4 లక్షలు విరాళం అందింది. 
 
 
 

Advertisement
Advertisement